CONCEPT

భావన

వ్యక్తిత్వ వికాసం (Personality Development)

  
GOALS IN OUR LIFE:
WEALTHY
HEALTHY
GOOD PROFITION
GOOD RELATIONSHIPS
SPIRUTUALLY STRONG/GOOD PERSONALITY

DREAM
STRUGGLE
VICTORY

                     చింతా రామమోహన్
                         వ్యక్తిత్వ వికాసం 
             (Personality  Development)

STUDENT-TEACHER-PARENT:
Student :Who become himself/herself
conscious (స్పృహ)
Teacher :  who inspires student(ప్రభావితం)
Parent : who gives personality to their children  (వ్యక్తిత్వం) 

HOW TO GET KNOWELDGE: 
1. Reading books 
2. Excursions
3. Debating   

లక్ష్యసాధనకు మార్గాలు 
1.ధ్యానం ( Meditaion ) 
2.సమయపాలన ( Time management ) 
3.సహచరత్వం ( Association ) 
TIME MANAGEMENT
To accomplish:
Avoiding the phrase “I don’t have time...”,will soon help you to realize that you do have the time needed for just about anything you choose to accomplish in life.

(CHARACTERISTICS OF TIME)
1.Time is a unique resource.
2.It is available in continuous stream and is never absent
3.We are forced to spend it and once lost is lost for ever
4.Today never comes again.
5.There is no substitute for time.
6.It can not be stored or accumulated.
7.It is available all round the clock.

How do I change? 
* If I feel depressed I will sing.
* If I feel sad I will laugh.
* If I feel ill I will double my labour.
* If I feel fear I will plunge ahead.
* If I feel inferior I will wear new garments.
* If I feel uncertain I will raise my voice.
* If I feel poverty I will think of wealth to come.
* If I feel incompetent I will think of past success.
* If I feel insignificant I will remember my goals. 
* "Today I will be the master of my emotions".

*STAND AND DIE IN YOUR OWN STRENGTH ;IS THERE IS ANY SIN IN THE WORLD,IT IS WEAKNESS;AVOID ALL WEAKNESS,FOR WEAKNESS IS SIN , WEAKNESS IS DEATH 
                         - SWAMY VIVEKANANDA.

కష్టపడితే ఏదో ఒకరోజు మనదవుతుంది- అభినవ్
                                                             ***
motivation





                     

తెలుగు - సౌందర్యం( పాటలు )- సాహిత్య కళారూపాలు (పాటలు)


నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది 

 మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,

చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.


గలగలా గోదారి కదలిపోతుంటేను

బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ

మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతినగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములొ తియ్యందనాలు

నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి

తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక

నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం


జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
 
మూడవ పద్యం: గానమాలింపక

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..

II ఏ దివిలో II

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

II ఏ దివిలో II

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

II ఏ దివిలో II

చిత్రం : కన్నెవయసు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : దాశరధి
సంగీతం : సత్యం
---------------------------------------------------
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
-------------------------------------------
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో

మౌనమే

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే

చిత్రం : గుప్పెడు మనసు
గానం :బాలమురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం :ఎం.ఎస్.విశ్వనాథన్
---------------------------------------------------
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

చిత్రం :తల్లా! పెళ్లామా!
గానం : ఘంటసాల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
---------------------------------------------------
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో  ||ఆ చల్లని||

భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో  ||ఆ చల్లని||

మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల  దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో  ||ఆ చల్లని||

అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||

 దాశరది క్రిష్ణమాచార్య