ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు..? ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారకులు హిందూ రాజులే..
బౌద్ధ రాజుల కాలంలో ఈ దేశంలో అందరికీ విద్య ఉంది విదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు దేశం ఐకమత్యంగా ఉండేది ఎవడైనా దండయాత్ర చేస్తే వాడి పుంగి భజాయించి పంపించేవారు అలాంటి బలమైన దేశాన్ని కేవలం పొట్ట కూటి కోసం వచ్చిన బ్రాహ్మణ సంతతి బౌద్ధ బిక్షులతో మమేకమై వారి పతనాన్ని కోరుకున్నారు
మిత్రులారా 8వ శతాబ్దం క్రితం వరకు ఈ దేశంలో బౌద్ధ రాజులు పాలన చేశారు ఆ తర్వాత బౌద్ధ బిక్షులైన మధ్యచార్యులు ఆదిశంకరాచార్యులు బౌద్ధాన్ని అద్వైతం పేరుతో శివ, విష్ణు, సూర్య, స్కంద, శక్తి, అనే శాఖలతో విభజించారు వారి మాటలు నమ్మిన రాజులు శివ భక్తులుగా కొందరు విష్ణుభక్తులుగా కొందరు సూర్య భక్తులుగా కొందరు శక్తి ఆరాధకులుగా కొందరు ఇలా దేశవ్యాప్తంగా ఐదు వర్గాలుగా విడిపోయారు మత ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకున్నారు అలా 12వ శతాబ్దం వరకు యుద్ధాలు చేసుకొని చంపుకున్నారు ( చోళులు పాండ్యుల యుద్ధాలు కేవలం మతం కోసం జరిగినవే )
రాజులు మత ఆధిపత్యం కోసం కొట్లాడుతుంటే మరో పక్క బ్రాహ్మణులు రాజులకు అబూత కల్పనలు మాయమాటలు చెప్పి దేశాన్ని 6,500 కులాలుగా విభజించేలా రాజులను ఒప్పించారు అప్పటివరకు ఉన్న విద్యా వ్యవస్థ రాజుల చేత రద్దు చేయించారు.
మనిషికి మనిషికి మధ్యన అంతర్యాన్ని పెంచి కులాలకు కులాలకు మధ్యన ఆధిపత్యాన్ని పెంచి దేశంలో ఐకమత్యాన్ని లేకుండా చేశారు దేశంపై ఎవడెవడో 11 శతాబ్దంలో వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడున్న మందిరాలను ధ్వంసం చేసి దోచుకెళ్తుంటే ప్రజలు చూస్తుండిపోయారు తప్పితే ఎదురు తిరగలేదు
చివరికి దేశం గందరగోళంలోకి వెళ్లిపోయాక 12వ శతాబ్దంలో రామానుజచార్యులు ఈ గొడవలకు పుల్ స్టాప్ పెట్టి అన్ని శాఖలను విష్ణువు అవతార శాఖగా మార్చి హైందవమతంగా రూపాంతరం చేశారు.. అక్కడనుండి దేశంలోకి మన ధర్మ రాజ్యాంగం అమలు అవడం మొదలైంది చాతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో ప్రజలలో ఐక్యమత్యం పూర్తిగా పోయింది ఇదే అదునుగా విదేశీయులు మొదట 14వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఒకప్పటి మన గాంధార దేశం బాబరు ఆక్రమించుకొని మొగల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు.
అఖండ భారత్ కాస్త కుదించుకుంటూ దేశాలను వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పటి ఆఫ్గానిస్థాన్ మనదే..బంగ్లాదేశ్ మనదే శ్రీలంక మనదే ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 15 దేశాలు మన దేశం నుండి విడిపోయాయి..
తర్వాత ఇంగ్లీష్ వారు కూడా వచ్చారు ఈ దేశాన్ని కొంతమేర అభివృద్ధి చేస్తూనే సంపద మొత్తం దోచుకెళ్లారు.. ముస్లిమ్స్ క్రైస్తవులు దేశాన్ని దోచుకు వెళ్ళడమే కాకుండా ఇక్కడ మతాలను కూడా వదిలిపెట్టి వెళ్లారు బలవంతన కొందరిని మత మార్పిళ్ళు చేస్తే మరికొందరు వివక్ష తట్టుకోలేక ఇష్టపూర్వకంగా ముస్లింలుగా క్రైస్తవులుగా మారారు
అఖండ భారత్ నుండి దేశాలన్నీ విడిపోవడానికి కారణం వైదిక సాంప్రదాయమే.. ఈ దేశంలోకి ఇతర మతాలు రావడానికి కారకులు కూడా వైదికులే
అయితే బ్రాహ్మణులు ఈ విషయాన్ని ఒప్పుకోకపోగా విదేశీయుల మతాల వల్లనే దేశం విచ్ఛిన్నమైందని తప్పుని వారిపై నెట్టేసి హిందువులకు ముస్లింల పైన క్రైస్తవుల పైన ద్వేషాన్ని పెంచి కాలం వెలుబుచుతూ వచ్చారు
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు
ఈ దేశంలో మొదటి సంస్కృతి బౌద్ధం నుంచి మొదలైందని చారిత్రక ఆధారాలతో బయటపడుతున్నాయి ఈ నిజాన్ని జీర్ణించుకోలేని హైందవులు దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారకులు బౌద్ధ రాజులేనని వారు బౌద్ధాన్ని స్వీకరించి శాంతి శాంతి అంటూ యుద్ధాలు చేయకుండా కూర్చోవడం వల్ల విదేశీయులు దేశాన్ని ఆక్రమించారని ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు అందుకే ఈ పోస్టు ఆధారాలతో సహా నేను ఈ పోస్ట్ చేస్తున్నాను.
బాదామి చాళుక్యులు, పల్లవులు, ఏడవ శతాబ్దం రాష్ట్ర కూటులు వరకు బౌద్ధ రాజులుగా కొనసాగారు..ఆ తర్వాత మొదట "శైవ రాజులు"గా తర్వాత "వైష్ణవ రాజులు"గా చివరగా 12వ శతాబ్దం నుండి "హైందవ రాజులు"గా కొనసాగారు.
ఈ దేశాన్ని ఏ కాలంలో ఎవరు పరిపాలించారు వారు పరిపాలించిన కాలం వివరాలు పురావస్తు శాఖ నుండి సేకరించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
పోస్ట్ పూర్తిగా చదివి ఈ దేశం విదేశీయుల ఆక్రమణ లోకి వెళ్లడానికి కారకులు ఎవరు ? అప్పుడు ఏ మత రాజులు ఉన్నారు ? విదేశీ మతాలు ఈ దేశంలోకి రావడానికి కారకులు ఎవరు ? కామెంట్లలో తెలియజేయండి..
..బౌద్ధ అన్వేషకుడు మీ బండపల్లి శివారెడ్డి.
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
• మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
• మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
• శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
• కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
• ఇక్ష్వాకులు 210 – 300
• బృహత్పలాయనులు 300 – 350
• ఆనందగోత్రికులు 295 – 620
• శాలంకాయనులు 320 – 420
• విష్ణుకుండినులు 375 – 555
• పల్లవులు 400 – 550
. గుప్తులు 500 - 600
. బాదామి చాళుక్యులు 500 - 600
పూర్వమధ్య యుగము 650 – 1320
• మహాపల్లవులు
• రేనాటి చోడులు
• రాష్ట్రకూటులు 700 - 900
• తూర్పు చాళుక్యులు 624 – 1076
• పూర్వగాంగులు 498 – 894
• చాళుక్య చోళులు 980 – 1076
• కాకతీయులు 750 – 1323
• అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
• ముసునూరి నాయకులు 1333–1368
• ఓఢ్ర గజపతులు 1513
• రేచెర్ల పద్మనాయకులు 1368–1461
• కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
• బహమనీ రాజ్యము
• విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
• అరవీటి వంశము 1572–1680
• పెమ్మసాని నాయకులు 1423–1740
• కుతుబ్ షాహీ యుగము 1518–1687
• నిజాము రాజ్యము 1742–1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము 1800–1947
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
• ఆంధ్ర ప్రదేశ్ అవతరణ 1953–1956
• ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
No comments:
Post a Comment
CONCEPT
( DEVELOPMENT OF HUMAN RELATIONS AND HUMAN RESOURCES )