భాస్కరాచార్యుడు – జీవిత చరిత్ర

భాస్కరాచార్యుడు

భాస్కరాచార్యుడు – జీవిత చరిత్ర

భాస్కరుడు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్రలోని విజ్జదిత్ (విజ్జలబిడ/విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడు. ఇతనిని కొందరు వైష్ణవుడని పేర్కొన్నప్పటికీ, “ఆచార్య” అనే పదం ఆయన పాండిత్యానికి గుర్తుగా భావించబడుతుంది.

చిన్నప్పటి నుంచే గణితంలో పరిశోధనలు ప్రారంభించిన భాస్కరుడు జ్యోతిష్యంలో కూడా నిపుణుడు. కుండలలో నీరు, ఇసుకతో ముహూర్తాలను లెక్కించే ప్రత్యేక విధానం ఉపయోగించేవాడు. ఒకసారి తన కుమార్తె లీలావతి వివాహ ముహూర్తం నిర్ణయించే సమయంలో జరిగిన సంఘటన వల్ల ఆయన జీవితం మారిపోయింది.

ఆ సంఘటన తరువాత భాస్కరుడు తన దుఃఖాన్ని మరిచేందుకు కుమార్తెకు గణితం నేర్పించాడు. ఈ సమయంలో ఆయన “లీలావతి” అనే ప్రసిద్ధ గణిత గ్రంథాన్ని రచించాడు. దీని ద్వారా ఆయన ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు.

భాస్కరాచార్యుడు బీజగణితం, ఖగోళ శాస్త్రం, గ్రహగణితం వంటి రంగాల్లో గొప్ప పరిశోధనలు చేశాడు. ఆయన సూత్రాలు ఇప్పటికీ ఆధునిక గణితాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

వంశ వృక్షము

త్రివిక్రమ → భాస్కరభట్ట → గోవింద → ప్రభాకర → మనోరధ → మహేశ్వర → భాస్కరాచార్య → లక్ష్మీధర

CONCEPT ( development of human relations and human resources )