భావన

భావన – ప్రగతి

భావన – వస్తు భావ పరంపర భావన
ఈ భావన ప్రగతికి మూలం.
అజ్ఞానమే శత్రువు.
జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం.

Thought & Progress

CONCEPT - Thought leads to ideas.
Ideas form a chain of understanding.
This awareness is the root of progress.
Ignorance is the enemy.
Light the lamp of knowledge
And remove the darkness of ignorance.

సమాజం – తాత్వికులు

సమాజం వసుదైకకుటుంబం నమూన.
తాత్వికులు సమాజంతో మమేకమై
వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు.
సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

— Chinta Ramamohan

భాస్కరుడు సా.శ. 1114

భాస్కరుడు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను.ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది. అదేమంటే భాస్కరుడు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరుడు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు. సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు. భాస్కరుని వంశ వృక్షము: త్రివిక్రమ -----> భాస్కరభట్ట-----> గోవింద-----> ప్రభాకర----> మనోరధ----> మహేశ్వర----> భాస్కరాచార్య----> లక్ష్మీధర. (సా.శ.. 499), వరాహమిహిరుడు చంద్ర, గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు. అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది. హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా","కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్రలో పేరుపొందిన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ఎక్కువగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ.. 78 లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ.. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. క్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి (సా.శ.. 1) విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57) శాలివాహనశకం - శాతవాహనులలో పేరొందిన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ.. 78) తెలుగు సంవత్సరాలు మొత్తం 60. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం.దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు 354 రోజులు. అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది. ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు. తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: 1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం). 2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. ఉదాహరణ ;- పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము. పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము . పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము. పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల శ్రావణము . పౌర్ణమి రోజున పూర్వాభాద్ర నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల భాద్రపదము. పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆశ్వయుజము. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల కార్తీకము. పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మార్గశిరము . పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల పుష్యము. పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల మాఘము. పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఫాల్గుణము. హిందూ తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులు: అవి వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి. శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును. వసుస సంఖ్య ఋతువు కాలాలు హిందూ చంద్రమాన మాసాలు ఆంగ్ల నెలలు లక్షణాలు ఋతువులో వచ్చే పండగలు 1 వసంతఋతువు Spring చైత్రం, వైశాఖం ~ ఏప్రిల్13 నుండి జూన్ 10 సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి 2 గ్రీష్మఋతువు Summer జ్యేష్టం, ఆషాఢం ~ జూన్ 11 నుండి ఆగస్టు 8 బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, వటపూర్ణిమ, రధసప్తమి, గురుపూర్ణిమ 3 వర్షఋతువు Monsoon శ్రావణం, భాద్రపదం ~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6 చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, 4 శరదృతువు Autumn ఆశ్వయుజం, కార్తీకం ~ అక్టోబరు 7 నుండి డిసంబరు 4 తక్కువ ఉష్ణోగ్రత నవరాత్రి, విజయదశమి, దీపావళి,శరత్ పూర్ణిమ , బిహు, కార్తీక పౌర్ణమి, 5 హేమంతఋతువు Winter మార్గశిరం, పుష్యం ~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1 చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం పంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ 6 శిశిరఋతువు Winter & Fall మాఘం, ఫాల్గుణం ~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1 బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ తిరుగుతున్నప్పుడు ఈ ఎక్స్పోజర్ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. సంవత్సరంలో సగం వరకు (మార్చి 20 నుండి సెప్టెంబరు 22 వరకు), ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు చిట్కాలు, గరిష్ఠ మొత్తం జూన్ 21 న సంభవిస్తుంది. సంవత్సరంలో మిగిలిన సగం వరకు, అదే జరుగుతుంది, కానీ ఉత్తరాదికి బదులుగా దక్షిణ అర్ధగోళం, గరిష్ఠంగా డిసెంబరు 21 చుట్టూ ఉంటుంది. సూర్యుడు భూమధ్యరేఖ వద్ద నేరుగా ఓవర్ హెడ్ అయినప్పుడు రెండు సందర్భాలు విషువత్తులు. ఆ సమయంలో, ఉత్తర ధ్రువం భూమి దక్షిణ ధ్రువం రెండూ కేవలం టెర్మినేటర్‌లో ఉన్నాయి, అందువల్ల పగలు రాత్రి రెండు అర్ధగోళాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. మార్చి విషువత్తు చుట్టూ, ఉత్తర అర్ధగోళం పగటి గంటలు పెరిగేకొద్దీ వసంతాన్ని అనుభవిస్తుంది పగటి గంటలు తగ్గిపోతున్నందున దక్షిణ అర్ధగోళం శరదృతువును అనుభవిస్తోంది. సంవత్సరంలో సౌర మధ్యాహ్నం సూర్యుని రోజు పొడవు ఎత్తులో మార్పుగా అక్షసంబంధ వంపు ప్రభావం గమనించవచ్చు. శీతాకాలంలో సూర్యుని తక్కువ కోణం అంటే ఇన్కమింగ్ సౌర వికిరణం భూమి ఉపరితలం పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది, కాబట్టి అందుకున్న కాంతి మరింత పరోక్షంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. ఈ ప్రభావం తక్కువ పగటి గంటల మధ్య, భూమి అక్షసంబంధ వంపు రెండు అర్ధగోళాలలో వాతావరణంలో కాలానుగుణ వైవిధ్యానికి కారణమవుతుంది. దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. CONCEPT ( development of human relations and human resources )

నా కవితలు Part II

Ch. RamaMohan Kavithalu & Concepts

Ch. RamaMohan, BA.

CONCEPT: Development of Human Relations & Resources

Human values, relationships, and philosophical awareness form the foundation of progress. Ignorance is the enemy. Knowledge lights the path forward.

🌾 అప్పుడు – ఇప్పుడు

అప్పుడు విద్య వెలుగులు అందరికీ చేరేవి,
ఇప్పుడు జ్ఞానం దూరమై ధనం aaదారమైపోయింది.
అప్పుడు వైద్యం మనసుతో సేవ చేసేది,
ఇప్పుడు వ్యాపారంగా మారి మానవత మాయమైంది.
అప్పుడు సమయం విస్తారంగా విరజిమ్మేది,
ఇప్పుడు గడియారంలో క్షణం విలువై పోయింది.
అప్పుడు బంధాలు మనసుకు మధుర గీతాలు,
ఇప్పుడు అవి ఫోన్ స్క్రీన్‌ల ప్రతిధ్వనులయ్యాయి.

నీ చూపులు

నీ చూపులు వలపుల గాలాలు,
నీ పలుకులు సుస్వరా గీతాలు.
మౌనం చెప్పే భావాలు,
పాండిత్య ప్రకర్షలు.
నీకోసం చేసే నిరీక్షణ,
కలిగించు మధురానుభూతి.
నీ సంగమంలో గడిపే క్షణాలు,
జీవతం జీవనం.

Beloved / English

The stars shimmer in your form,
Like jewels sparkling in the sky,
Your voice is the cooing of the cuckoo,
A melody that echoes in my heart.
Your presence is the confluence of the three rivers,
Every moment spent with you is a heart's treasure.

Philosophical Inspirations

  • Buddha: Pratityasamutpada, guiding humanity through wisdom.
  • Socrates: Pursuit of truth at all costs.
  • Vemana: Social reform through poetic wisdom.
  • Ambedkar: Justice, equality, and constitutional vision.

శీర్షిక: మొదటి చూపులో ప్రేమ

మొదటి చూపులో ప్రేమగా పడ్డాను,
నీ హృదయంలో స్థానం పొందాను.
నువ్వు నేనూ ఒకటే కదా,
ఎప్పటికీ వేరుకాలం ఇదా!

CONCEPT ( development of human relations and human resources )
తెలుగు గురించి వెబ్‌సైట్.. తెలుగు సాంప్రదాయ ానికి సంబంధించిన వెబ్ సైట్.. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. ద్రావిడ భాషల్లో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడేభాష తెలుగు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష తెలుగు. తెలుగు భాషా వ్యవహర్తలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనేకాక భారతదేశంలోని పెక్కు రాష్ట్రాల్లో, విదేశాల్లో అనేక ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. https://cesct.ciil.org/index.html

తెలుగు సాహిత్యం యుగ విభజన

ప్రాఙ్నన్నయ యుగము

సా.శ. 1000 వరకు

నన్నయ యుగము

1000 – 1100

శివకవి యుగము

1100 – 1225

తిక్కన యుగము

1225 – 1320

ఎఱ్ఱాప్రగడ యుగము

1320 – 1400

శ్రీనాధుని యుగము

1400 – 1500

రాయల యుగము

1500 – 1600

దక్షిణాంధ్ర యుగము

1600 – 1775

క్షీణ యుగము

1775 – 1875

ఆధునిక యుగము

1875 – ఇప్పటి వరకు

21వ శతాబ్దపు సాహిత్యం

2000 తరువాత

CONCEPT ( development of human relations and human resources )

తెలుగు సాహిత్యం

తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు సాహిత్యాన్ని అధ్యయన సౌలభ్యం కోసం పండితులు అనేక యుగాలుగా విభజించారు. ఈ విభజనలో కొందరు పరిశోధకులు కవుల పేర్లు, కొందరు పాలకుల పేర్లు, మరికొందరు కాలానుగుణ పరిస్థితులను ఆధారంగా తీసుకున్నారు.

తెలుగు సాహిత్యం యుగాలు

  • ప్రాఙ్నన్నయ యుగము – సా.శ. 1000 వరకు
  • నన్నయ యుగము – 1000 నుండి 1100 వరకు
  • శివకవి యుగము – 1100 నుండి 1225 వరకు
  • తిక్కన యుగము – 1225 నుండి 1320 వరకు
  • ఎఱ్ఱాప్రగడ యుగము – 1320 నుండి 1400 వరకు
  • శ్రీనాధుని యుగము – 1400 నుండి 1500 వరకు
  • రాయల యుగము – 1500 నుండి 1600 వరకు
  • దక్షిణాంధ్ర / నాయకరాజుల యుగము – 1600 నుండి 1775 వరకు
  • క్షీణ యుగము – 1775 నుండి 1875 వరకు
  • ఆధునిక యుగము – 1875 నుండి ఇప్పటి వరకు
  • 21వ శతాబ్దపు తెలుగు సాహిత్యం – 2000 తరువాత

పాలకుల ఆధారంగా యుగ విభజన

  • చాళుక్య యుగము
  • కాకతీయ యుగము
  • పద్మనాయక యుగము
  • రెడ్డి రాజుల యుగము
  • తొలి రాయల యుగము
  • మలి రాయల యుగము
  • నవాబుల యుగము
  • నాయక రాజుల యుగము
  • కడపటి రాజుల యుగము
  • కుంఫిణీ యుగము
  • జమీందారీ యుగము
  • ఆధునిక యుగము

సాహిత్య ప్రక్రియల ఆధారంగా యుగ విభజన

  • ప్రాఙ్నన్నయ యుగము (అజ్ఞాత యుగము / శాసన యుగము)
  • భాషాంతరీకరణ యుగము (పురాణ కావ్య యుగము)
  • కావ్య యుగము
  • ప్రబంధ యుగము
  • గద్య, గేయ, యక్షగాన యుగము
  • దక్షిణాంధ్ర యుగము
  • ఆధునిక యుగము – ఖండకావ్య (భావకవితా) యుగము

తెలుగు సాహిత్యానికి సంబంధించిన ముఖ్య విభాగాలు

  • తెలుగు భాష
  • తెలుగు లిపి
  • తెలుగు వ్యాకరణం
  • తెలుగు పద్యం
  • తెలుగు నవల
  • తెలుగు కథ
  • తెలుగు నాటకం
  • జానపద సాహిత్యం
  • శతక సాహిత్యం
  • పురాణ సాహిత్యం
  • తెలుగు పత్రికలు
  • తెలుగు నిఘంటువు
  • తెలుగు బాలసాహిత్యం
  • తెలుగు సామెతలు
  • తెలుగు విజ్ఞాన సర్వస్వం

తెలుగు సాహిత్య అభివృద్ధికి కవులు మాత్రమే కాకుండా, పాలకులు మరియు సాహిత్య పోషకులు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ విధమైన యుగ విభజనను ఆరుద్ర తన "సమగ్రాంధ్ర సాహిత్యం" గ్రంథంలో ఉపయోగించాడు.



తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.

తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు
సా.శ. 1000 వరకు
నన్నయ యుగం
1000 - 1100
శివకవి యుగం
1100 - 1225
తిక్కన యుగం
1225 - 1320
ఎఱ్ఱన యుగం
1320 – 1400
శ్రీనాధ యుగం
1400 - 1500
రాయల యుగం
1500 - 1600
దాక్షిణాత్య యుగం
1600 - 1775
క్షీణ యుగం
1775 - 1875
ఆధునిక యుగం
1875 – 2000
21వ శతాబ్ది
2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యం • తెలుగు నవల
తెలుగు కథ • తెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యం • శతక సాహిత్యం
తెలుగు నాటకం • పురాణ సాహిత్యం
తెలుగు పత్రికలు • పద కవితా సాహిత్యము
అవధానం • తెలుగు వెలుగు
తెలుగు నిఘంటువు • తెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలు • తెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధన • అధికార భాషగా తెలుగు

ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు
నన్నయ యుగము : 1000 - 1100
శివకవి యుగము : 1100 - 1225
తిక్కన యుగము : 1225 - 1320
ఎఱ్ఱాప్రగడ యుగము : 1320 - 1400
శ్రీనాధుని యుగము : 1400 - 1500
రాయల యుగము : 1500 - 1600
దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775
క్షీణ యుగము : 1775 - 1875
ఆధునిక యుగము : 1875 నుండి

సాహిత్యాభివృద్ధికి పోషకులు కూడా ముఖ్య కారణం గనుక ఈ విభజన చేయబడింది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ పద్ధతి వాడాడు.

  1. చాళుక్య యుగము
  2. కాకతీయ యుగము
  3. పద్మనాయక యుగము
  4. రెడ్డి రాజుల యుగము
  5. తొలి రాయల యుగము
  6. మలి రాయల యుగము
  7. నవాబుల యుగము
  8. నాయక రాజుల యుగము
  9. కడపటి రాజుల యుగము
  10. కుంఫిణీ యుగము
  11. జమీందారీ యుగము
  12. ఆధునిక యుగము

ప్రాఙ్నన్నయ యుగము (అజ్ఞాత యుగము, శాసన యుగము)
భాషాంతరీకరణ యుగము (పురాణ కావ్య యుగము)
కావ్య యుగము
ప్రబంధ యుగము
గద్య, గేయ, యక్షగాన యుగము
దక్షిణాంధ్ర యుగము
ఆధునిక యుగము - ఖండకావ్య (భావ కవితా) యుగము

CONCEPT ( development of human relations and human resources )

#భావజాలబంధీ #మనిషిభావాలు #TeluguPhilosophy #ConceptExplorer #LifeConcepts #SocialChange #TeluguBlog #Philosophy

భావజాల బంధీ – మనిషి భావాల చక్రం

పరిచయం

మనిషి తన భావాలు, నమ్మకాలు, అభిప్రాయాల ఆధారంగా ఒక భావజాలాన్ని నిర్మించుకుంటాడు. ఆ భావజాలమే ఒక చక్రంలా మారి మనిషిని తనలోనే బంధిస్తుంది. ఈ భావాల చక్రంలో చిక్కుకున్న మనిషి, చాలా సార్లు తన ఆలోచనలను మార్చుకోలేకపోతాడు. అలా భావాల బంధీగా మారి అదే విధమైన జీవనాన్ని కొనసాగిస్తాడు.

మార్పులో ఉన్న సమాజం

సమాజం నిరంతరం మార్పుకు లోనవుతోంది. కాలం మారుతున్న కొద్దీ విలువలు, ఆలోచనలు, జీవన విధానాలు కూడా మారుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకునే మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకపోతే సమాజం ముందుకు వెళ్లినా, వ్యక్తి మాత్రం తన పాత భావాల చక్రంలోనే చిక్కుకుపోతాడు.

మనిషి మార్పు

మనిషి శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మార్పుకు లోనవుతాడు. అనుభవాలు, విద్య, సమాజం, పరిసరాలు – ఇవన్నీ మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. వస్తువులు మారుతున్నట్లే వాటిని గమనించే మనిషి కూడా మారాలి. అప్పుడే నిజమైన అవగాహన ఏర్పడుతుంది.

చక్రం లో బంధనం

ఒక వ్యక్తి తన భావజాల చక్రంలో బంధీ అయితే, కొత్త ఆలోచనలు స్వీకరించలేడు. అదే పాత ఆలోచనల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఈ పరిస్థితిలో వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక ప్రగతి కూడా నిలిచిపోతుంది.

చక్రాల విస్తరణ

ప్రగతి కోసం మనిషి తన భావాల చక్రాన్ని విస్తరించాలి. కొత్త ఆలోచనలు, కొత్త అనుభవాలు, విభిన్న అభిప్రాయాలను అంగీకరించడం ద్వారా మన ఆలోచనల పరిధి పెరుగుతుంది. అప్పుడు మనిషి భావజాల బంధీగా కాకుండా, స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిగా మారుతాడు.

SEO Keywords

భావజాల బంధీ, మనిషి భావాల చక్రం, సామాజిక మార్పు, తాత్విక ఆలోచనలు, తెలుగు తత్వశాస్త్రం, Human Mind Philosophy, Social Change Concepts

#భావజాలబంధీ #మనిషిభావాలు #TeluguPhilosophy #ConceptExplorer #LifeConcepts #SocialChange #TeluguBlog #Philosophy
CONCEPT ( development of human relations and human resources )

Weight Loss Food Patterns

Simple Weight Loss Food Patterns

Introduction

Weight loss depends mainly on three factors: mind control, food habits, and eating time. If we control our food pattern and eat simple natural foods like fruits and vegetables, the body naturally maintains a healthy weight. Simple eating habits practiced in villages in earlier times were often healthier than modern lifestyles.

Pattern I – Four Times Food

Breakfast → Lunch → Snacks → Dinner

  • Breakfast: Idli, oats, fruits, lemon water.
  • Lunch: Rice or chapati, dal, vegetables, salad.
  • Snacks: Fruits, almonds, walnuts, green tea.
  • Dinner: Chapati, soup, light vegetables.

This is the most common eating pattern followed by many people.

Pattern II – Three Times Food

Breakfast → Lunch → Dinner

  • Morning healthy breakfast.
  • Balanced lunch with vegetables and protein.
  • Light dinner without snacks.

This pattern reduces extra calories and helps maintain body balance.

Pattern III – Morning Food, Lunch, Dinner

Avoid heavy breakfast and snacks.

  • Morning: Fruits and dry fruits.
  • Lunch: Rice or chapati with vegetables.
  • Dinner: Soup, salad, or light food.

This method is similar to simple intermittent fasting.

Pattern IV – One Meal a Day

Only one main meal in the day.

  • Morning: Water, fruits, dry fruits.
  • Afternoon: Main meal with rice or chapati, vegetables and dal.
  • Night: Fruits or herbal tea.

This method is also known as OMAD (One Meal A Day).

Pattern V – Two Meals a Day

  • Morning: Fruits and dry fruits.
  • Lunch: Main meal.
  • Dinner: Light meal.
  • Between meals: Fruits only.

This pattern helps reduce overeating and improves digestion.

Weight Loss Simple Rules

  • Drink 2–3 liters of water daily.
  • Reduce sugar and oil.
  • Eat more fruits and vegetables.
  • Walk at least 30 minutes daily.
  • Eat slowly and avoid stress.

Conclusion

Weight loss is not about starving the body but about following a simple and balanced lifestyle. Mind control, natural food, and regular physical activity are the key factors. Simple eating patterns practiced with discipline can naturally lead to a healthy and balanced life.


Weight Loss Food పట్టేర్న్స్
 (బరువు తగ్గించే ఆహార పద్ధతులు)
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి అధిక బరువు. జీవన విధానం మారడం, ఎక్కువసేపు కూర్చునే పనులు చేయడం, వ్యాయామం తగ్గడం, అధికంగా నూనె మరియు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల శరీర బరువు పెరుగుతోంది. అధిక బరువు కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బరువును నియంత్రించడం చాలా ముఖ్యమైన విషయం.
బరువు తగ్గడం అంటే కేవలం తక్కువ తినడం కాదు. సరైన ఆహార పద్ధతి (Food Pattern), మనస్సు నియంత్రణ, మరియు శారీరక చలనం అనే మూడు అంశాలు కలిసి పనిచేస్తేనే ఆరోగ్యకరమైన బరువు తగ్గడం సాధ్యమవుతుంది. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం సమతుల్యతలో ఉంటుంది. అందుకే కొందరు ఆరోగ్య నిపుణులు వివిధ రకాల ఆహార పద్ధతులను అనుసరించాలని సూచిస్తారు.
1. నాలుగు సార్లు భోజనం చేసే పద్ధతి
ఈ పద్ధతి సాధారణంగా చాలా మంది అనుసరించే ఆహార విధానం. ఇందులో రోజుకు నాలుగు సార్లు ఆహారం తీసుకుంటారు. అవి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం.
ఉదయం అల్పాహారం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇడ్లీ, ఉప్మా, దోశ, ఓట్స్ లేదా పండ్లు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా చపాతీతో పాటు పప్పు, కూరగాయలు మరియు సలాడ్ తీసుకోవడం మంచిది. సాయంత్రం ఆకలి వేస్తే పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. రాత్రి భోజనం తేలికగా ఉండాలి.
ఈ పద్ధతి శరీరానికి అవసరమైన శక్తిని సమతుల్యంగా అందిస్తుంది. అయితే ఎక్కువగా స్నాక్స్ తీసుకుంటే అదనపు కేలరీలు పెరగవచ్చు.
2. మూడు సార్లు భోజనం చేసే పద్ధతి
ఈ పద్ధతిలో రోజుకు మూడు సార్లు మాత్రమే భోజనం చేస్తారు. అవి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం. ఈ విధానంలో సాయంత్రం స్నాక్స్ ఉండవు.
ఈ పద్ధతి వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం సమతుల్యమైన భోజనం తీసుకోవాలి. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
భోజనాల మధ్యలో ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
3. రోజుకు రెండు సార్లు భోజనం చేసే పద్ధతి
ఈ పద్ధతిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రధాన భోజనం తీసుకుంటారు. ఉదయం ఎక్కువగా భోజనం చేయకుండా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. తరువాత మధ్యాహ్నం మొదటి ప్రధాన భోజనం చేస్తారు. రాత్రి రెండవ భోజనం తేలికగా తీసుకుంటారు.
ఉదయం పండ్లు తినడం వల్ల శరీరానికి విటమిన్లు మరియు సహజ శక్తి లభిస్తుంది. మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా చపాతీతో పాటు పప్పు మరియు కూరగాయలు తీసుకోవాలి. రాత్రి భోజనం తేలికగా ఉండాలి. ఉదాహరణకు సూప్, సలాడ్ లేదా ఒకటి రెండు చపాతీలు తీసుకోవచ్చు.
ఈ పద్ధతి వల్ల శరీరానికి జీర్ణక్రియకు ఎక్కువ సమయం లభిస్తుంది. అదనంగా మధ్యలో ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. క్రమంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
4. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం (One Meal a Day)
కొంతమంది వ్యక్తులు రోజుకు ఒకసారి మాత్రమే ప్రధాన భోజనం చేసే పద్ధతిని అనుసరిస్తారు. దీనిని సాధారణంగా One Meal a Day (OMAD) అని అంటారు.
ఈ పద్ధతిలో ఉదయం నీరు తాగడం, పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒకసారి పూర్తి భోజనం చేస్తారు. రాత్రి మళ్లీ పండ్లు లేదా తేలికపాటి పానీయాలు మాత్రమే తీసుకుంటారు.
ఈ విధానం వల్ల శరీరానికి ఎక్కువ సమయం ఉపవాస స్థితి లభిస్తుంది. కొంతమందికి ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇది సరిపోదు. అందువల్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి పాటించాలి.
పండ్లు మరియు సహజ ఆహారం యొక్క ప్రాముఖ్యత
బరువు తగ్గడంలో పండ్లు మరియు సహజ ఆహారం చాలా ముఖ్యమైనవి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
ఆపిల్, పపయ్య, జామ, నారింజ, పుచ్చకాయ వంటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే బాదం, వాల్‌నట్స్, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
బరువు తగ్గడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు
బరువు తగ్గడానికి కొన్ని సరళమైన అలవాట్లు పాటించాలి. రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగాలి. ఎక్కువ నూనె మరియు చక్కెర ఉన్న ఆహారం తగ్గించాలి. కూరగాయలు మరియు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
రోజూ కనీసం అరగంట నడక లేదా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మనసును నియంత్రించుకోవడం చాలా అవసరం. ఆకలి లేకపోయినా తినే అలవాటు తగ్గించాలి. నెమ్మదిగా తినడం వల్ల తక్కువ ఆహారం తిన్నా తృప్తి కలుగుతుంది.
ముగింపు
బరువు తగ్గడం ఒకరోజులో జరిగే విషయం కాదు. అది ఒక సరళమైన జీవన విధానం. సరైన ఆహార పద్ధతిని ఎంచుకుని క్రమంగా పాటిస్తే ఆరోగ్యకరమైన బరువు సాధ్యమవుతుంది.
మన పూర్వకాలంలో గ్రామీణ జీవన విధానంలో సహజ ఆహారం మరియు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవి. అందువల్ల ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి. అదే సరళమైన జీవన విధానాన్ని మనం కూడా కొంతవరకు అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండగలం.
సరైన ఆహారం, సరైన సమయం, సరైన జీవనశైలి — ఈ మూడు కలిసి పనిచేస్తే ఆరోగ్యకరమైన జీవితం మరియు సమతుల్యమైన బరువు పొందడం సులభం అవుతుంది. 💚

Weight Loss Hashtags #WeightLoss #WeightLossTips #HealthyWeight #NaturalWeightLoss #SimpleDiet #HealthyLiving #FitnessTips #DietPlan #EatHealthy #HealthyLifestyle 🔹 Food Pattern Hashtags #FoodPattern #HealthyEating #MealPlan #IntermittentFasting #OneMealADay #TwoMealsADay #SimpleFood #MindfulEating 🔹 Fruits & Natural Diet #FruitsDiet #NaturalFood #DryFruits #HealthyFoodChoices #EatNatural 🔹 Telugu Blog Hashtags #TeluguBlog #TeluguHealth #TeluguWriting #TeluguContent #TeluguBlogger #IndianHealth #HealthyIndia 🔹 Concept / Philosophy Style #FoodPhilosophy #SimpleLiving #MindControl #HealthyMindHealthyBody CONCEPT ( development of human relations and human resources )

పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు part 2


పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు | PART 2

పల్లెటూరి చిన్నతనం జ్ఞాపకాలు అనగానే మనసులో ఒక అందమైన ప్రపంచం కనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో ఉన్న గ్రామ జీవితం, సంస్కృతి, సంప్రదాయం, ఆనందం – ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని నిర్మించాయి.

🌾 పల్లె జీవితం

పల్లెటూరి ఉదయం చాలా ప్రత్యేకంగా ఉండేది. పొలాలకు వెళ్తున్న రైతులు పాడే పల్లె పాటలు, కాపరులు పశువులతో వెళ్తూ వినిపించే స్వరాలు గ్రామాన్ని ఒక ఆహ్లాద భరిత గ్రామం గా మార్చేవి.

గ్రామంలోని బావి దగ్గర మహిళలు చేరి నీళ్లు తోడుకుంటూ పా డుకునే, మాట్లాడుకునే ఆ క్షణాలు గ్రామ జీవితం యొక్క అందమైన జ్ఞాపకాలు.

🎭 గ్రామ కళలు

ఆ రోజుల్లో గ్రామానికి తరచుగా వచ్చే కళాకారులు గ్రామానికి ఆనందాన్ని తెచ్చేవారు. కాటి కాపరి గారడీ విద్యలు చూపించే వారు చిన్న చిన్న మాయాజాలాలతో పిల్లలను ఆశ్చర్యపరచేవారు.

బుడబుక్కల వారు గ్రామంలో తిరుగుతూ పాటలు పాడేవారు. హరిదాసు ఇంటింటికీ తిరుగుతూ భక్తి గీతాలు పాడేవాడు. అతని గానం వినిపిస్తే గ్రామంలో ఒక భక్తి వాతావరణం ఏర్పడేది.

🎉 పండుగల సంబరం

పల్లెటూరిలో పండుగలు అంటే ఒక పెద్ద ఆనందం. ఉగాది, శ్రీరామ నవమి, దసరా నవరాత్రులు, దీపావళి, వినాయక చవితి, శివరాత్రి వంటి పండుగలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవారు.

గ్రామంలో మత సామరస్యము ఎక్కువగా ఉండేది. క్రిస్మస్, నూతన సంవత్సరం, పీర్ల పండగ, రంజాన్, ఉరుసు పండుగలను అందరూ కలిసి ఆనందంగా జరుపుకునేవారు.

🎭 కళలు మరియు వినోదం

హరికథ, బుర్రకథ, పౌరాణిక నాటకాలు గ్రామ ప్రజలకు వినోదంతో పాటు జ్ఞానాన్ని అందించేవి. పిట్టలదొర, పగటి వేషగాళ్లు వచ్చినప్పుడు గ్రామం మొత్తం ఉత్సాహంగా మారేది.

📚 చదువు మరియు సినిమాలు

పిల్లలకి ఎంతో ఇష్టమైన పత్రికలు చందమామ, బాలమిత్ర. పెద్దలు మాత్రం ఆంధ్ర పత్రిక వార్తా పత్రికలు చదివేవారు. లైబ్రరీ లో కథలు, నవలలు, డిటెక్టివ్ కథలు ఉండేవి.

సినిమాలు చూడటం కూడా ఒక పెద్ద సంబరం. సినిమాల్లో పాటలు, డాన్సులు చూసి పిల్లలు వాటిని అనుకరించేవారు.

🌿 ముగింపు

పల్లెటూరి చిన్నతనం జ్ఞాపకాలు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు. అవి ఒక కాలం యొక్క సంస్కృతి, సంప్రదాయం, ఆనందం. సరళమైన జీవితం లోనే నిజమైన ఆనందం ఉందని మనకు గుర్తు చేసే అమూల్యమైన జ్ఞాపకాలు.


CONCEPT – Development of Human Relations and Human Resources

#TeluguBlog #TeluguWriting #VillageLife #Palleturu #TeluguCulture #BuddhaPhilosophy #Concepts #LifeLessons #IndianCulture #TeluguThoughts

పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలుpart I(1965 తర్వాత)

పల్లెటూరు – చిన్నతనం జ్ఞాపకాలు (1965 తర్వాత)

పల్లెటూరు… ఆ చిన్న ఊరు, చిన్న ఇల్లు, కానీ హృదయానికి ఎంతో దగ్గర. ఆ పూరి ఇల్లు, వెనుక భాగంలో ఉన్న చెరువు,ప్రక్కన బావి, వాటిలో నీళ్లు తాగుతూ, ఆ సరదా జ్ఞాపకాలు ఇప్పటికీ నా మధుర గుర్తింపు. పల్లెటూరిలో మన ప్రయాణం ఎప్పుడూ కాలి నడకతోనే ప్రారంభమైయ్యేది, సైకిల్ పై మెల్లగా కదులుతూ, సమీప పొలాలు, చెట్ల మధ్యలో చక్కగా ఊపిరి తీసుకునే అనుభవం.

చీకటి మరియు కిరోసిన్ దీపాలు

1962 కాలం, 1965 తరువాత… గ్రామానికి కరెంటు ఇంకా రాలేదు. రాత్రి కళ్లకు వెలుగు ఇచ్చేది కేవలం కిరోసిన్ దీపాలు. కానీ ఆ చీకటిలోనూ మనం కలిగే ఆనందం, అర్ధరాత్రి నక్షత్రాలను చూస్తూ తల్లిదండ్రులతో, స్నేహితులతో పంచుకునే కథలు, నిజంగా మధురమైనవి. టీవీ లేకపోయినా, రేడియో నుండి వచ్చే సంగీతం, వార్తలు మన ఊరికి ఒక వింత సంచలనం ఇచ్చేవి.

పల్లెటూరి ఆహారం

పల్లెటూరి ఆహారం సాదాసీదా అయినా రుచి తెలుసు. జొన్న అన్నం, రాగి ముద్ద, అక్కుల్ల బియ్యం… వీటికి సువాసన, మనసుకు ఆనందం ఉండేది. పల్లెటూరి భోజనంలో ప్రతి ఘడియా, ప్రతి విందు ఒక ఫొటో లాగా మన మధుర జ్ఞాపకాలలో నిలిచిపోతుంది. చిన్నప్పుడు మనం పల్లెలో ఆడుతూ, పొలాల్లో వర్షపు నీటితో ఆటలు ఆడిన క్షణాలు, ఇంకా గుర్తుకు వస్తే మధురంగా ఉంటుంది.

సాధారణ వస్తువులు, సామాన్య జీవనం

సాధారణ వస్తువులు, సామాన్య జీవనం మనకు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. సైకిల్ మీద ఊరంతా తిరగడం, సైను గుడ్డల నిక్కర్లను వేసుకుని మైదానంలో ఆడడం, Cotton చొక్కాలు వేసుకుని పొలాల్లో పని చేయడం – ఈ చిన్న విషయాలే ఆ కాలం జీవితానికి ప్రత్యేకత ఇచ్చేవి.

విద్యా రంగం

విద్యా రంగం కూడా చాలా సాదాసీదా. బడి సాధారణ, కానీ మనం శ్రద్ధతో చదివేది, స్నేహితులతో పాఠశాల రోడ్డుపై గడపడం, ఆటలు ఆడడం – ప్రతి క్షణం ఒక విలువైన జ్ఞాపకం.

స్నేహితులు, కుటుంబం మరియు పల్లెటూరి జీవనం

పల్లెటూరిలో ప్రతి రోజు ఒక కథ, ప్రతి క్షణం ఒక జ్ఞాపకం. చెట్లు, పొలాలు, ఆ పొడవాటి పల్లె రోడ్లు – ఇవన్నీ మనసులో ముద్రపెట్టినవి. చిన్నపాటి పిల్లలు కలిసి ఆడే ఆటలు, వృద్ధులు చెప్పే కథలు, గ్రామీణ పండుగలు – ఇవన్నీ జీవితాన్ని మధురంగా, స్ఫూర్తిగా మార్చేవి.

సాంప్రదాయ విలువలు మరియు జీవన పాఠం

కల్చరల్ మరియు సామాజికంగా కూడా పల్లెటూరు ఒక ప్రత్యేకత కలిగించేది. జ్ఞాపకాలలో, బౌద్ధిక, సామాజిక, మరియు సాంప్రదాయ విలువలు బలంగా ఉండేవి. ప్రతి ఇంట్లో ఆహారం, కష్టపడి ఉత్పత్తి చేసిన పంటలు, ప్రతి పండుగ, ప్రతి ఉత్సవం – జీవనపు సత్యాలను మనకు అందించేవి.

సాదాసీదా జీవితం, కానీ అంత లోతైన ఆనందం. ఇలాంటి జీవితం ఇప్పుడు మనం పెద్ద నగరాల్లో చూడలేం. ఎలక్ట్రానిక్ gadgets, ఆధునిక సౌకర్యాలు – ఇవన్నీ మనకు సౌకర్యాన్ని ఇస్తాయి, కానీ ఆ సంతృప్తి, ఆ సున్నితమైన ఆనందం ఇవ్వలేవు. పల్లెటూరిలో ప్రతి క్షణం సజీవం, ప్రతి అనుభవం మధురం, ప్రతి జ్ఞాపకం జీవితాన్ని ప్రేమతో నింపుతుంది.

ఇది కేవలం గుర్తింపు మాత్రమే కాదు, జీవన పాఠం కూడా. జ్ఞాపకాలను తేలికగా గుర్తుంచుకోవడం, చిన్న విషయాల్లో ఆనందం పొందడం, మన సమాజాన్ని, మన సంస్కృతిని ప్రేమించడం – ఇవన్నీ పల్లెటూరి జీవితంలోనే మనకు నేర్పించబడేవి. జొన్న అన్నం రుచి, రాగి ముద్ద తినడం, కిరోసిన్ దీపాల కాంతిలో కుటుంబం మరియు స్నేహితులతో గడపడం – ఇవన్నీ మాకు విలువైన జీవన పాఠాలు.

2025లో కూడా ఆ జ్ఞాపకాలు మనసులో మిగిలి, ఆ సౌందర్యాన్ని, సాదాసీదా ఆనందాన్ని గుర్తు చేస్తాయి. పల్లెటూరి జీవితం ఎప్పటికీ మధురం, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి పల్లెటూరి చిన్నతనం, ప్రతి ఇంటి వాసస్థలం, ప్రతి పొలంలో ఆడిన ఆటలు – ఇవన్నీ జీవితాన్ని ఎంతో మధురంగా, శాంతియుతంగా గుర్తు చేస్తాయి.

CONCEPT ( development of human relations and human resources )

Lipi

భారతదేశంలో లిపి పరిణామం | Evolution of Scripts in India

భారతదేశంలో లిపి పరిణామం (Evolution of Scripts in India)

భాషకు శరీరం లిపి (Script). మాటల ద్వారా భావాలు వ్యక్తం చేయవచ్చు కానీ వాటిని తరతరాలకు నిలుపుకోవడానికి లిపి అవసరం. భారతదేశం ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి. అందువల్ల ఇక్కడ లిపుల పరిణామం కూడా చాలా ప్రాచీనమైనది. భారతదేశంలో లిపి అభివృద్ధి అనేక దశలలో జరిగింది. ఆ దశలను పరిశీలిస్తే భారతీయ సంస్కృతి, జ్ఞానం, సాహిత్యం ఎలా అభివృద్ధి చెందిందో తెలుస్తుంది.

1. లిపి అంటే ఏమిటి?

లిపి అనేది భాషలోని శబ్దాలను గుర్తులు లేదా అక్షరాల రూపంలో రాసే విధానం. మనం మాట్లాడే భాషను రాతగా నిలిపే సాధనం లిపి.

  • తెలుగు భాషకు – తెలుగు లిపి
  • హిందీ భాషకు – దేవనాగరి లిపి
  • తమిళ భాషకు – తమిళ లిపి

లిపి వల్ల జ్ఞానం తరతరాలకు చేరుతుంది. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, సాహిత్యం అన్నీ లిపి వల్లే నిలిచాయి.

2. సింధు నాగరికత లిపి

భారతదేశంలో అత్యంత పురాతనంగా కనిపించిన లిపి సింధు నాగరికత లిపి (Indus Script). ఇది సుమారు క్రీస్తుపూర్వం 2600–1900 మధ్యకాలానికి చెందినది.

హరప్పా, మొహెంజోదారో ప్రాంతాలలో లభించిన ముద్రలపై చిన్న చిన్న గుర్తులు కనిపిస్తాయి. ఇవే సింధు లిపి గుర్తులు. అయితే ఈ లిపిని ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు.

  • చిన్న గుర్తులు మరియు చిహ్నాలు
  • జంతువుల బొమ్మలు
  • ముద్రలపై చెక్కిన గుర్తులు
  • ఇప్పటికీ పూర్తిగా డీకోడ్ కాలేదు

3. బ్రాహ్మీ లిపి

భారతదేశంలోని ముఖ్యమైన ప్రాచీన లిపి బ్రాహ్మీ లిపి. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి శాసనాలలో కనిపిస్తుంది.

  • సరళమైన అక్షర నిర్మాణం
  • రాతి శాసనాలలో ఉపయోగం
  • ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో విస్తరణ
  • అనేక భాషలకు ఆధారం

బ్రాహ్మీ నుంచి తరువాత అనేక లిపులు అభివృద్ధి చెందాయి.

4. ఖరోష్టి లిపి

బ్రాహ్మీతో పాటు భారతదేశంలో మరో ప్రాచీన లిపి ఖరోష్టి.

  • ఉత్తర పశ్చిమ భారతదేశంలో వినియోగం
  • గంధార ప్రాంతంలో విస్తరణ
  • అరామిక్ లిపి ప్రభావం
  • కుడి నుండి ఎడమకు రాయబడేది

ఖరోష్టి లిపి తరువాత క్రమంగా కనుమరుగైంది.

5. గుప్త లిపి

గుప్త సామ్రాజ్య కాలంలో (4వ–6వ శతాబ్దాలు) గుప్త లిపి అభివృద్ధి చెందింది. ఇది బ్రాహ్మీ నుంచి పరిణామం చెందింది మరియు తరువాతి లిపులకు పునాది వేసింది.

6. దేవనాగరి లిపి

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లిపులలో ఒకటి దేవనాగరి.

  • హిందీ
  • సంస్కృతం
  • మరాఠీ
  • నేపాలి

దేవనాగరి లిపిలో అక్షరాలపై ఒక సూటి గీత (Shirorekha) ఉంటుంది. ఈ లిపి శాస్త్ర గ్రంథాలలో విస్తృతంగా ఉపయోగించబడింది.

7. దక్షిణ భారత లిపులు

బ్రాహ్మీ నుంచి దక్షిణ భారతదేశంలో అనేక లిపులు అభివృద్ధి చెందాయి.

  • తెలుగు లిపి
  • తమిళ లిపి
  • కన్నడ లిపి
  • మలయాళం లిపి

ఈ లిపులు దక్షిణ భారత సంస్కృతి మరియు సాహిత్యానికి ప్రధాన ఆధారం.

8. తెలుగు లిపి అభివృద్ధి

తెలుగు లిపి కూడా బ్రాహ్మీ నుంచి అభివృద్ధి చెందింది. మొదట ఇది తెలుగు-కన్నడ లిపి రూపంలో ఉండేది. తరువాత రెండు వేర్వేరు లిపులుగా మారాయి.

  • గుండ్రని ఆకారాలు
  • స్పష్టమైన అక్షర నిర్మాణం
  • సాహిత్యానికి అనుకూలం

9. భారతదేశ లిపుల వైవిధ్యం

భారతదేశం భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి. అందువల్ల ఇక్కడ అనేక లిపులు ఉన్నాయి.

  • దేవనాగరి
  • తెలుగు
  • తమిళ
  • కన్నడ
  • మలయాళం
  • బెంగాలి
  • గురుముఖి
  • ఒడియా

10. లిపి పరిణామం ప్రాముఖ్యత

  • జ్ఞానం తరతరాలకు చేరుతుంది
  • చరిత్రను నమోదు చేయవచ్చు
  • సాహిత్యం అభివృద్ధి చెందుతుంది
  • సంస్కృతి పరిరక్షణ జరుగుతుంది

ముగింపు

భారతదేశంలో లిపి పరిణామం చాలా ప్రాచీనమైనది. సింధు నాగరికత గుర్తుల నుంచి ప్రారంభమై బ్రాహ్మీ, గుప్త, దేవనాగరి మరియు దక్షిణ భారత లిపుల వరకు ఇది అభివృద్ధి చెందింది. లిపి మన సంస్కృతికి అద్దం. భాషను నిలుపుకోవడానికి లిపి అత్యంత ముఖ్యమైన సాధనం.

రాధికా సాంత్వనం : ముద్దుపళని

పడగ్గది కవిత్వమా? మదిని మత్తెక్కించే పరిమళమా?

రాధికా సాంత్వనం : ముద్దుపళని[మార్చు]

కావ్య గాథ

సరసం అంటే క్రిష్ణుడు, క్రిష్ణుడు అంటే సరసాలు గుర్తుకొస్తే అది మన తప్పో క్రిష్ణుడి తప్పో కానే కాదు. వీనులకు విందుగా, కంటికి ఇంపుగా, మనసుకు హాయిగా, చెప్తున్న కొద్దీ మరీమరీ చెప్పాలని అనిపించేలా చేసిన క్రిష్ణుడి రచయితలదే ఆ పాపపుణ్యమంతా. రాధ, సత్యభామ, జాంబవతి మొదలుగాగల క్రిష్ణుడి సతుల జాబితాకు ముందో వెనకో గోపికలను చేరిస్తే, చేంతాడు చిన్నపిల్లల మొలతాడు అయిపోతుంది. వీళ్లందరిలోనూ క్రిష్ణ సాహిత్యంలో రాధ పాత్ర ప్రత్యేకమైనది. ఆమె వయసుకూడా అతడి కంటే ఐదో ఆరో ఏళ్లు పెద్ద కాదు. ఆమె ప్రౌఢ కాగా అతడు బాలుడు. మరి మాధవుడు తన పెదవుల్ని రాధ పెదవులకు ఆనించిందెప్పుడు? గోపాలుడితో మనకెవ్వరికీ అంతగా పరిచయం లేదు గాని, మన సరస సార్వభౌముడు శ్రీనాధుడు భీమఖండంలో ఈ మొదటి ముద్దు సీన్ క్రియేట్ చేసాడని ఆరుద్ర అంటారు. అంతవరకు అచుంబితంగా వున్న రాధామాధవుల సంబంధం ముద్దులను దాటించి మురిపాల వరకు చేర్చారు తరువాతి కవులు. ఈ ముద్దు మురిపాలను మరికాస్త ఘాటెక్కించి ఇద్దర్నీ మంచమెక్కించి పఠితలను మత్తెక్కించింది మాత్రం ముద్దుపళని. ఇలా క్రిష్ణుల భార్యాభర్తల ప్రణయం మధ్యలో రాధిక చేరిందా? లేదంటే రాధాక్రిష్ణ ప్రేయసీప్రియుల సరససల్లాపాల నడుమ ఇలా చేరిందా? పానకంలో పుడక ఎవరు?


టూకీగా ఈ శృంగార కావ్యాన్ని ఏక వాక్యంలో చెప్పాలంటే ఆరుద్ర మాటల్లోనే చెప్పాలి: ” ఓ సారి రాధ అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం, అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం ” ఇదే రాధికా సాంత్వనం కావ్య గాధ.


ప్రభుత్వ నిషేధం

మరి ఇదిలాగే ఉంటే కందుకూరి వీరేశలింగం నుండి బ్రిటిష్ ప్రభుత్వం వరకు అందరూ దీన్ని ‘చీ..బూతు ‘ అని ఎందుకు ఈసడించుకున్నట్టో? ప్రభుత్వమైతే ఏకంగా ఈ గ్రంథాన్ని నిషేధించింది కూడా. (మనకు స్వతంత్రం వచ్చేక నిషేధాన్ని తొలగించు కున్నామనుకోండి, అది వేరే కథ)


నాలుగు ఆశ్వాసాలలో నడిచిన ఈ కథనంలో ప్రతి పద్యమూ ఒక ఆణిముత్యమే. తంజావూరు రాజు కొలువులో ఉండిన ముద్దుపళని సంస్కృతం, తెలుగు, తమిళ సాహిత్యాలలో అద్భుతమైన పరిచయం ఉండడంతో భాష-భావాలపై బిగువైన పట్టుతో కథ నడిపించడం విశేషం.

బాల్యవివాహాలు ముద్దుపళని కాలానికి సహజమైన విషయం. పాపం అదే తీరులో గోపాలుడికీ ఇళా ఈడేరక మునుపే భార్య కావడంతో మేనత్త వరసైన రాధ ఇంటిలో ఇళాతో మకాం పెడతాడు క్రిష్ణుడు. ఇళ సంసారానికి సిద్ధమయ్యేలోగా అందులోని మళకువలన్నీ క్రిష్ణుడికి కంఠతా వచ్చేస్తాయి. రాధ వాటిని నేర్పిందో, క్రిష్ణుడే వాటిని నేర్చుకున్నాడో ముద్దుపళని మనకెక్కడా చెప్పరుగాని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ. కామం. ఇళాను రాధే పెంచుతుంది. వయసొచ్చిన ఇళాతో క్రిష్ణుడికి శోభనం ఏర్పాట్లు చేయాలి. చేయడమే కాదు ఇద్దరికీ విడివిడిగా ఎన్నో జాగ్రత్తలు, మెలకువలు చెప్తుంది. ఇళా క్రిష్ణులను ఒకటి చేస్తుంది గాని, రాధ మనసు మనసులో లేదు. ఇంకా తెల్లవారకముందే వారి గదిని చేరుకుని ఇళాను పక్కకు పంపించి కృష్ణుడి చెంత వాలిపోతుంది. తనతో కూడా కూడాక తొలిరాత్రి ముచ్చట్లు అడుగుతుంది. కృష్ణుడు అత్యంత సరసుడు కదా- గడుసుగా లేలేత మొగ్గ, చిన్న పిల్ల ఇళా దగ్గర అంత సుఖమేం ఉంటుందని, రాధకూ ఇళాకు పోలికే లేదని రాదను మెప్పించబోతాడు. విననట్టే నటించిన చిన్నారి, గడసు ఇళా అన్నీ వినేసిందని ముద్దుపళని ఒక్క వాక్యంలో రెండో ఆశ్వాసపు తొలి పద్యంలో చెప్తారు. అదికూడా ఇలా-

”అటు లా రాధిక, గోపీ
విటు నటు రతికేళి నేలి విడువంగ, నిలా
కుటిలాలక జేరి తనదు
కుటిలత్వ మెఱుంగనీక కూరిమి చెలగన్ “

ఆనక ఇళా పుట్టింటికి క్రిష్ణుడు వెళ్లాల్సివస్తుంది. తన దరిని గోపాలుడు లేకపోవడం రాధది వెలుతురు లేని ప్రపంచం. విరహ వేదన భరించలేక తప్పనిసరి మానసికావస్థలో చిలకను రాయబారంగా పంపుతుంది. అలా వెళ్లిన చిలక మూడు రాత్రులు ముగిసేనాటికి గడసరి ఇళా తన కొంగున క్రిష్ణుని కట్టేసుకోవడం చూసి అదే రాధకు విన్నవిస్తుంది. అక్కడితో రెండో ఆశ్వాసం ముగుస్తుంది. ఈ రెండో అధ్యాయంలోనే శృంగారం పాలు శృతిమించిందని విమర్శకులు గగ్గోలు పెడతారు. రసవత్తరమైన మూడో ఆశ్వాసంలో టైటిలుకు న్యాయం చేసే అసలు సిసలు కథ జరుగుతుంది. చిలుక చెప్పిన సంగతులు విని రాధ అసూయతో భగ్గున రగిలిపోతుంది. ఇళా క్రిష్ణుల సఖ్యత విని కలవరపడుతుంది. అన్నింటిని మించి గడసు ఇళా రాధికను పరిత్యజించమని మాధవుని బతిమాలడం చిలక చేరవేస్తుంది. అంతే రాధకు మండుతుంది. అలకపానుపు ఎక్కుతుంది. నాలుగో ఆశ్వాసంలో రేపల్లె చేరిన గోపాలుడు రాధికను ఇదీ అదీ అని చెప్పలేని విధంగా బతిమాలుకుంటాడు. రగిలిపోతున్న రాధ మాధవుని తూలనాడుతుంది. అవేవీ పట్టించుకోని గోపాలుడు తనదైన శైలిలో కాళ్ల బేరానికి వస్టాడు. అనుకోకుండా ఒక్కసారి హటాత్తుగా క్రిష్ణుడు రాధ కాళ్ల మీద పడిపోతాడు. కావ్యం చదువుతున్న మనం ఒక్కమారు కలవరపడతాం. భార్యల కోపం పోగొట్టే కొత్త టెక్నిక్ కదా అని సంబరపడతాం, కాని తన ప్రియాతి ప్రియమైన ప్రియుణ్ణి రాధ ఎడమ కాలితో తోసేసరికి ఖంగుతింటాం. కాని ఇంతలోనే తేరుకుని ప్రసన్నమవుతుంది. రాధామాధవులు ఒకటవుతారు. ఏకమైన ప్రియ జంట ఆనందంగా ఉంటారు. ఇదీ వివరంగా కథ.


ఎటు తాళనున్నదో యీ కొమ్మ కెమ్మావి
కై టభారాతి ప ల్గాటునకును?
ఎటు లోర్వ నున్నవో యీ కన్నె చన్నులు
గోపసిమ్హుని గోటి కుమ్ములకును?
ఎటు లాన నున్నవో యీ తన్వి లే.దొడల్
చాణూరహరు మారు సాదనలకు?
ఎటు లాగ నున్నదో యీ నాతి నును మేను
దంతిమర్దను కౌగిలింతలకును

(మొదటి ఆశ్వాసం 65వ పద్యం)

అంటూ బెంగపడిన రాధ ఇళాదేవికి ఎన్నో కామ శాస్త్ర రహస్యాలు చెప్పినపుడు కాస్త పచ్చిగా ముద్దుపళని యీ మాటలు వాడారని మనమూ ఒప్పుకోక తప్పదు. అలాంటి మరి నాలుగు పద్యాలు .

ఇళా గోపాలురను శోభనం గదిలోకి పంపించి తాను వగచివగచి తలచిన పద్యమిది (1లో 75)


“నాతి యింతకు మున్నె, నా సామి మధు రాధ
రామృతమ్మును జూఱలాడ కున్నె?
యతివ యింతకు మున్నె, హరి విప్పు టురముపై
గుబ్బల కసిదీఱ గ్రుమ్మ కున్నె?
రమణి యింతకు మున్నె, రమణు కౌగిట జేరి
పారావత ధ్వనుల్ పలుక కున్నె?
చాన యితకు మున్నె, శౌరి పై కొన వెను
దియ్యక యెదురొత్తు లియ్య కున్నె? “


పుట్టింటిలో క్రిష్ణుఇ భోగం గురించి చిలుక రాధకు వర్ణించి చెప్పే ఘట్టం ఇది: (2 లో 139, 140)

కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప,
జేరి తొడ లేచి పురికొల్పె గీరవాని,
నీలవర్ణిడి పైకొని కేళి నేల,
బాళి నెదురొత్తు లిచ్చె నిళా లతాంగి. (139)
కిలకిల నవ్వులు, గిలిగింతలును, బంధ
భేదపు రవములు, వింత వగలు,
పావురా పలుకులు, వాతెర నొక్కులు,
చిగురు మకారముల్, మరుగు తిట్లు,
దురుసు పైసరములు, తొందర ముద్దులు,
బిగి కౌగిలింతలు, బింకములును,
గొనగోటి మీటులు, గోర్గింపు, లుబుకులు,
కొసరులు, బొమ ముళ్ళు, కురుచ సన్న, (140)
రాధ అలకను తీర్చిన మాధవుడు ఆమెతో కూడినపుడు (4లో 103)
హత్తుకొని, యిన్ని విధముల
దత్తఱపడ ననగి పెనగి, తనివారక యా
బిత్తరి పై కొనె హరిపై,
మత్తేభముమీద నెక్కు మావంతు డనన్.

కవయిత్రి ముద్దుపళని[మార్చు]

కవయిత్రి ముద్దుపళని గురించి రెండు మాటలు : 1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసిం హుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో “రాధికా సాంత్వనం ” రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండిత పామరులు క్షమార్హులు కారు. మన అదృష్టం కొద్దీ బెంగుళూరుకు చెందిన నాగరత్నం గారు తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. గాని బ్రిటిష్ ప్రభుత్వంతో పుస్తకన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారు. 1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నిషేధం ఎత్తేయించారు. కాని అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారట. తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనం ను ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది. మరో మాట - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు. అదో పెద్ద విచిత్రం. మీకు ముద్దుపళని గురించి మరిన్ని వివరాలు కావాలంటే సుసీ థారు, కే.లలితల సంపాదకత్వంలో వెలువడిన విమన్ రైటింగ్ ఇన్ ఇండియా (క్రీ.పూ. 600-ఇప్పటివరకు)గ్రంథంలో చదవండి. ఇలాంటి కవిత్వాన్ని బూతు బూతని కారుకూతలు కూసేవారికి ఒక్కటే చెప్పగలం. నరాలని మెలిపెట్టించి, కోరికతో బుసలు కొట్టించి, మనసును పెడదోవ పెట్టించే సాహిత్యం మాత్రం ఖచ్చితంగా బూతు సాహిత్యం (ఎరోటిక్ లిటరేచర్). కాని హృదయానికి ఆహ్లాదం కలిగించి, ఊహలకు ఉత్తేజం అందించి, మనసుకు కొత్త రెక్కలిచ్చే మాటైనా, పాటైనా, బొమ్మైనా అది మంచి సాహిత్యమే అవుతుంది. ఆ లెక్కన చూస్తే ముద్దుపళని కవిత్వం ముచ్చటైన కవిత్వం.

ఆరుద్ర చెప్పిన ఒక్క మాట - కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే తిరుపతి వేంకట కవులు, మల్లాది రమక్రిష్ణ శాస్త్రి తదితరులు మాత్రం రాధికా సాంత్వనానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు.

Collection
CONCEPT ( development of human relations and human resources )