📚 Concept Library
| SL | Title | Author | Category | Action |
|---|
1. చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు,
కొంచెమైన నదియు కొదువ కాదు,
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత,
విశ్వదాభిరామ వినుర వేమా.
2. ఆత్మ శుద్ధి లేని యాచారమదియేల?
బాండాశుద్ధి లేని పాకమేల,
చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా?
విశ్వదాభిరామ వినుర వేమా.
3. గంగిగోవుపాలు గంటెడైనను చాలు,
కడివెడైననేమి ఖరముపాలు,
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.
4. నిక్కమైన మంచినీలమొక్కటిచాలు,
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల,
చాటుమిలను చాలదా యొక్కటి,
విశ్వదాభిరామ వినుర వేమా.
5. మిరపగింజచూడా మీద నల్లగనుండు,
గొరికిజూడ లోన జుఱుకు మనును,
సజ్జనులగువారి సారమిట్లుండురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
6. మృగదంబుజూడ (కస్తూరి మృగం )మీద నల్లగనుండు,
బరిఢవిల్లు దాని పరిమళంబు,
గురువులైనవారి గుణములీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
7. మేడిపండుచూడ మేలిమై యుండు,
పొట్టవిప్పిచూడ పురుగులుండు,
పిరికి వాని మదిని బింకమీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
8. నేరనన్నవాడు నెరజాణ మహిలోన,
నేర్తునన్నవాడు వార్తకాడు ,
ఊరుకున్నవాడే యుత్తమోత్తముండు
విశ్వదాభిరామ వినుర వేమా.
9. గంగ పారునెపుడు గదలని గతితోడ,
మురికివాగు పారు మ్రోతతోడ,
పెద్ద పిన్న తనము పేర్మియీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
10. నిండునదులు పారు నిలిచి గంభీరమై,
వెర్రివాగు పారు వేగంబొర్లి,
అల్పుడాడు రీతి అధికుండు నాడునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
11. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను,
సజ్జనుండు బల్కు జల్లగాను,
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
12. కులములోన నొకండు గుణవంతుడుండిన,
కులము వెలయు వాని గుణముచేత,
వెలయు వనములోన మలయజంబున్నట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.
13. పూజకన్నా నెంచ బుద్ధి ప్రధానంబు,
మాటకన్న నెంచ మనసు దృఢము,
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినుర వేమా.
14. ఉత్తముని కుడువున నోగు జన్మించిన,
వాడు జెఱచు వాని వంశమెల్ల,
జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
విశ్వదాభిరామ వినుర వేమా.
15. కులముల్లోన నొకడు గుణహీనుడుండిన,
కులము చెడును వాని గుణమువలన,
వెలయు జెఱుకునందు వేను వెడలినట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.
16. రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె,
కురుపతి జనియించి కులము జేరచె,
ఇలను పుణ్యపాప మీలాగు కాదొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.
17. హీన గుణమువాని నిలుసేరనిచ్చిన,
ఎంతవానికైనా నిడుము గలుగు,
ఈగ కడుపుజొచ్చి ఇట్టిట్ట సేయదా,
విశ్వదాభిరామ వినుర వేమా.
18. వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును,
చీడ పురుగు జేరి చెట్టు చేర్చు,
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
19. అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని,
ఘనుడుగాడు హీన జనుడేగాని,
పరిమళములు మోయ గార్దభము గజమౌనె,
విశ్వదాభిరామ వినుర వేమా.
20. విద్యలేనివాడు విద్యాధికుల చెంత,
నుండినంత పండితుండుకాడు,
కొలనిహంసలకడ గొక్కెర ఉన్నట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.
21. అల్పబుద్ధి వాని అధికారమిచ్చిన,
దొడ్డవారినెల్ల దొలగజేయు,
చెప్పుందినెడి కుక్క చెరుకు తీపెరుగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
22. అల్పుడైనవాని అధిక భాగ్యముగల్ల,
దొడ్డవారి దిట్టి దొలగొట్టు,
అల్పబుద్ధి మొప్పె యధికుల నెరుగునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
23. ఎద్దుకైనగాని ఏడాది తెలిసిన,
మాట దెలిసి నడచు మర్మమెరిగి,
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన,
విశ్వదాభిరామ వినుర వేమా.
24. ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికిన,
నలుపు నలుపేగాని తెలుపురాదు,
కొమ్మబొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
25. పాముకన్న లేదు పాపిష్టిజీవంబు,
అట్టిపాము చెప్పినట్లు వినును,
ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరునులేరు,
విశ్వదాభిరామ వినుర వేమా.
26. వేము పాలు వోసి ప్రేమతో బెంచిన,
చేదు విరిగి తీపి జెందబోదు,
ఓగునోగెగాక యుచితజ్ఞు డెటులౌను,
విశ్వదాభిరామ వినుర వేమా.
27. ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు,
బరగ మూలికలకు పనికివచ్చును,
నిర్దయాత్మకుండు నీచుడెందులాకౌను,
విశ్వదాభిరామ వినుర వేమా.
28. పాలు పంచదార పాపర పండ్లలో,
చాలపోసి వండ చవికి రాదు,
కుటిల మానవులకు గుణ మేల గల్గురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
29. పాల నిడిగింట గ్రోలుచుండేనా,
మనుజులెల్ల గూడి మధ్యమండ్రు,
నిలువదగని చోట నిలువ నిందలువచ్చు,
విశ్వదాభిరామ వినుర వేమా.
30. కానివాని తోడు కలిసి మెలుగుచున్న,
గానివాని వలె కాంతురవని,
తాడి క్రింద బాలు తాగిన చందమౌ,
విశ్వదాభిరామ వినుర వేమా.
31 నుండి 50 వరకు కొనసాగుతుంది...
31. తామాశించి చేయ తగదెట్టి కార్యంబు,
వేగిరింప నదియు విషమేయగును,
పచ్చికాయ దెచ్చి బడవేయ ఫలమౌనె,
విశ్వదాభిరామ వినుర వేమా.
32. కోపమునను ఘనత కొంచమైపోవును,
కోపమును మిగుల గోడు గల్గు,
కోపమడచనేని కోర్కెలీడేరు,
విశ్వదాభిరామ వినుర వేమా.
33. నీళ్లలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు,
బయట కుక్క చేత భంగపడును,
స్థాన బలిమి గాని తన బలిమి గాదురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
34. నీళ్లలోన మీను నిగిడి దూరము పారు,
బయట మూరెడైన బారలేదు,
స్థాన బలిమి గాని తన బలిమి గాదురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
35. నీళ్ళమీద నొడ నిగిడి తిన్నగా బ్రాకు,
బయట మూరెడైన బారలేదు,
నెలవు దప్పుచోట నేర్పరి కోరగాడు,
విశ్వదాభిరామ వినుర వేమా.
36. కులము లేని వాడు కలిమిచే వెలయును,
కలిమి లేని వాడు కులము దిగును,
కులముకన్న భువిని గలిమియెక్కువసుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా.
37. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు,
విద్యచేత విర్రవీగువాడు,
పసిడి గలుగు వాని బానిస కొడుకులు,
విశ్వదాభిరామ వినుర వేమా.
38. కనియు గానలేడు కదలపడనోరు,
వినియు వినగాలేడు విస్మయమున,
సంపద తలవాని సన్నిపాతం బిది,
విశ్వదాభిరామ వినుర వేమా.
39. ఏమి గొంచు వచ్చె నేమి తాంగొని పోవు,
బుట్టువేళ నారడు గిట్టువేళ,
ధనము లెచటికేగు తానే చ్చటికినేగు,
విశ్వదాభిరామ వినుర వేమా.
40. తనువ దేవరి సొమ్ము తనదని పోషింప,
ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ,
ప్రాణ మెవరి సొమ్ము పారిపోవక నిల్వ,
విశ్వదాభిరామ వినుర వేమా.
41. గొడ్డుటావు బితుక గుండగొంపోయిన,
పండ్లు రాలదన్ను బాలవిదు,
లోభివాని నడుగ లాభంబు లేదయా,
విశ్వదాభిరామ వినుర వేమా.
42. మేక కుతుక బట్టి మెడచన్ను గుడవగా,
ఆకలేక మాను నాశగాక,
లోభివాని నడుగ లాభంబు లేదయా,
విశ్వదాభిరామ వినుర వేమా.
43. పెట్టి పోయలేని వట్టినరులు భూమి,
బుట్టనేమి వారు గిట్టనేమి,
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా,
విశ్వదాభిరామ వినుర వేమా.
44. ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు,
తిరుగుచుంద్రు భ్రమను త్రిప్పలేక,
మురికి కుండమందు ముసురు నీగల భంగి,
విశ్వదాభిరామ వినుర వేమా.
45. నీళ్లలోన మీను నెరమాంస మాశించి,
గాలమందు జిక్కు కరణి భువిని,
ఆశదగిలి నరుడు నాలాగు చెడిపోవు,
విశ్వదాభిరామ వినుర వేమా.
46. ఆశ పాపజాతి యన్నిటికంటెను,
ఆసచేత యతులు మోసపోరే,
చూచి విడచువారె శుద్ధాత్ములెందైన,
విశ్వదాభిరామ వినుర వేమా.
47. అన్నిదానములను అన్నదానమే గొప్ప,
కన్నతల్లికంటే ఘనములేదు,
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా,
విశ్వదాభిరామ వినుర వేమా.
48. ఆశకోసి వేసి యనలంబు చల్లార్చి,
గోచి బిగియగట్టి గుట్టుదెలిసి,
నిలిచినట్టు వాడే నెఱయోగి ఎందైన,
విశ్వదాభిరామ వినుర వేమా.
49. కనకమృగము భువిని గుద్దులే,
ధనకయె తరుణి విడచి చనియె,
దాసారథియు దెలివిలేనివాడు దేవుడెట్లాయెరా,
విశ్వదాభిరామ వినుర వేమా.
50. చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి,
పెరకి తినును బరుగ గ్రద్ద,
గ్రద్దవంటివాడు గజపతి కాడొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.
51. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను,
కలనుం గాంచు లక్ష్మి కల్లయగును,
ఇలను భోగ భాగ్య మీతీరు కాదొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.
52. కోతి నొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి,
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు,
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు,
విశ్వదాభిరామ వినుర వేమా.
53. కల్లలాడువాని గ్రామకర్త యెరుగు,
సత్యమాడువాని స్వామి యెరుగు,
బెద్దతిండిపోతు బెండ్లామెరుంగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
54. కల్ల నిజములెల్ల గరళకంఠుడెఱుంగు,
నీరు పల్లమెరుగు నిజాముగాను,
తల్లితానెఱుంగు తనయుని జన్మము,
విశ్వదాభిరామ వినుర వేమా.
55. మైలాకోకతోడ మాసిన తలతోడ,
నొడలు మురికి తోడ నుండెనేని,
నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు,
విశ్వదాభిరామ వినుర వేమా.
56. ఉప్పులేని కూర యెప్పుడు రుచులకు,
పప్పులేని తిండి ఫలము లేదు,
అప్పులేనివాడే అధిక సంపన్నుడు,
విశ్వదాభిరామ వినుర వేమా.
57. చెట్టుపాలు జనులు చేదందు రెలలోన,
నేనుపగొద్దు పాలవెంత హితము,
పదురాడు మాట పాటియై ధర్మ జెల్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.
58. పట్టుపట్లరాదు వట్టి విడువరాదు,
పట్టెనేని బిగియ బిట్టవలెను,
పట్టిడుచుకన్న బడి చచ్చుటయే మేలు,
విశ్వదాభిరామ వినుర వేమా.
59. తప్పులెన్నువారు తండోప తండంబు,
లుర్విజనులకెల్ల నుండు దప్పు,
తప్పులెన్నువారు తమతప్పులెఱుగరు,
విశ్వదాభిరామ వినుర వేమా.
60. అనగా ననగ రాగ మాతిశయిల్లుచునుండు,
దినగదినగ వేము తియ్యగనుండు,
సాధనమున పనులు సమకూరు ధరలోన,
విశ్వదాభిరామ వినుర వేమా.
61 నుండి 100 వరకు ఇదే విధంగా కొనసాగుతుంది.
61. తనకుగల్గు పెక్కు తప్పులుండగా,
ఒరుల నేరమెంచు నొరులగాంచి,
చక్కిలంబు గాంచి జంతిక నగినట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.
62. ఇనుము విరిగెనేని యిమారు ముమ్మారు,
కాల్చి యతుకవచ్చు క్రమముగాను,
మనసు విరిగెనేని మరికూర్చ వచ్చునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
63. ఓరుని జెఱదమని యుల్లమందెంతురు,
తమకు జేరురుగని ధరణి నరులు,
తమ్ము జెఱచువాడు దైవంబులేడొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.
64. కానివానిచేత గాను వీనంబిచ్చి,
వెంట దిరుగువాడే వెఱ్ఱివాడు,
పిల్లి తిన్న కోడి బిలిచిన పలుకునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
65. మాటలాడ నేర్చి మనసు రంజిల్లజేసి,
పరగ ప్రియము చెప్పి బడలకున్న,
నొకరిచేతి సొమ్ము లూరక వచ్చునా,
విశ్వదాభిరామ వినుర వేమా.
66. చంపదగిన యట్టి శత్రువు తనచేత,
జిక్కెనేని గీడు సేయరాదు,
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.
67. వాన కురియకున్న వచ్చును క్షామంబు,
వాన కురిసెనేని వరదపారు,
వరద కరువు రెండు వారసతో నెఱుగుడీ,
విశ్వదాభిరామ వినుర వేమా.
68. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన,
బుట్టునా జగంబు పట్లడెప్పుడు,
యముని లెక్కరీతి నరుగుచు నుందురు,
విశ్వదాభిరామ వినుర వేమా.
69. వాన రాకడయును ప్రాణంబు పోకడ,
కానబడ వెంత ఘనునకైనా,
గానబడినమీద గలియెట్లు నడచురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
70. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే,
నీటిబడ్డ చినుకు నీటగలిసి,
ప్రాప్తి కలుగుచోట ఫలమేల తప్పురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
71. ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను,
అంటనీయక శని వెంటదిరుగు,
భూమి క్రొత్తదైనా భోక్తలు క్రొత్తలా,
విశ్వదాభిరామ వినుర వేమా.
72. కర్మమెప్పుడైన గడచిపోవగరాదు,
ధర్మరాజు దెచ్చి తగనిచోట,
గంకుభట్టు జేసే గాటకటా దైవంబు,
విశ్వదాభిరామ వినుర వేమా.
73. అనువుగానిచోట నధికుల మనరాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ యద్దమందు గొంచెమై యుండదా,
విశ్వదాభిరామ వినుర వేమా.
74. ఇమ్ము దప్పువేళ నెమ్మలన్నియు మాని,
కాలమొక్క రీతిగల గడపవలయు,
విజయడిమ్ము దప్పి విరటుని గొల్వడా,
విశ్వదాభిరామ వినుర వేమా.
75. చిక్కియున్నవేళ సింహంబునైనను,
బక్క కుక్క కఱచి బాధ పెట్టు,
బలమిలేని వేళ వంతంబు చెల్లదు,
విశ్వదాభిరామ వినుర వేమా.
76. లక్ష్మియేలినట్టి లంకాపతి పురమ్ము,
పిల్లకోతి పౌజు కొల్లబెట్టె,
చేటుకాలమయిన జేరప నల్పులే చాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.
77. మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను,
పరమలోభులైన పాపులకును,
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా,
విశ్వదాభిరామ వినుర వేమా.
78. ఇచ్చువానియొద్ద నీనివాడుండేనా,
చచ్చుగాని యీవి సాగనీడు,
కల్పతరువు క్రింద గచ్చుపోదున్నట్లు,
విశ్వదాభిరామ వినుర వేమా.
79. అరయ నాస్తియనక యడ్డుమాటాడక,
తట్టువడక మదిని దన్నుకొనక,
తనది గాదనుకొని తాబెట్టునదే పెట్టు,
విశ్వదాభిరామ వినుర వేమా.
80. ధనముగూడ బెట్టి దానంబు చేయక,
తాను దినక లెస్స దాచుకొనక,
తేనెటీగ కూర్చి తెరువర కియ్యదా,
విశ్వదాభిరామ వినుర వేమా.
81 నుండి 100 వరకు తదుపరి భాగం.
81. కొంకణంబు పోవ గుక్క సింహముగాదు,
కాశికారుగా బంది గజముకాదు,
వేరుజాతివాడు విప్రుండు కాలేడు,
విశ్వదాభిరామ వినుర వేమా.
82. తవిటి కరయవోవ దండులంబుల గంప,
శ్వాసమాక్రమించు సౌమ్యామగును,
వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.
83. దాతకానివాని దఱచుగా వేడిన,
వాడు దాతయౌనె వసుధలోన,
ఆవురు దర్భయౌనె యబ్ధిలో ముంచిన,
విశ్వదాభిరామ వినుర వేమా.
84. పరగ రాతిగుండు బగులగొట్టగ వచ్చు,
గొండలన్ని పిండి గొట్టవచ్చు,
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు,
విశ్వదాభిరామ వినుర వేమా.
85. వంపుకర్ర గాల్చి వంపు దీర్చగవచ్చు,
గొండలన్ని పిండి గొట్టవచ్చు,
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు,
విశ్వదాభిరామ వినుర వేమా.
86. విత్తముగలవాని వీపున బుండైన,
వసుధలోన జాలా వార్త కెక్కు,
బేదవానియింట బెండైన నెఱుగరు,
విశ్వదాభిరామ వినుర వేమా.
87. మగని కాలమందు మగువ కష్టించిన,
సుతుల కాలమందు సుఖమునొందు,
గలిమి లేమి రెండు గల వెంతవారికి,
విశ్వదాభిరామ వినుర వేమా.
88. తనకులేని నాడు దైవంబు దూరును,
దనకు గలిగెనేని దైవమేల,
తనకు దైవమునకు దగులాట మెట్టిదో,
విశ్వదాభిరామ వినుర వేమా.
89. గాజు కుప్పెలోన గదలక దీవంబు,
దెట్టులుండు జ్ఞాన మట్టులుండు,
తెలిసినట్టి వారి దేహంబులందున,
విశ్వదాభిరామ వినుర వేమా.
90. అంతరంగమందు నపరాధములు చేసి,
మంచివానివలెనే మనుజుడుండు,
ఇతరులెఱుగకున్న ఈశ్వరుడెఱుగడా,
విశ్వదాభిరామ వినుర వేమా.
91. చదివి చదివి కొంత చదువంగ చదువంగ,
చదువు చదివి యింక జదువు,
చదివి చదువు మర్మములను చదువలేడయ్యను,
విశ్వదాభిరామ వినుర వేమా.
92. జననమరణములకు సర్వస్వతంత్రుడు,
కాడు మొదట గర్త కాండే,
తుదనుకాడు నడుమగర్త ననుట నగుబాటు కాదొకో,
విశ్వదాభిరామ వినుర వేమా.
93. నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు,
పాటి జగతిలేదు పరములేదు,
మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు,
విశ్వదాభిరామ వినుర వేమా.
94. తల్లియున్న యపుడె తనదు గారాబము,
లామె పోవదన్ను నరయరెవరు,
మంచికాలమపుడె మర్యాదనార్జింపు,
విశ్వదాభిరామ వినుర వేమా.
95. మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు,
తెలువవచ్చుదన్ను తెలియలేడు,
సూర్యబట్టవచ్చు సూరుడు కాలేడు,
విశ్వదాభిరామ వినుర వేమా.
96. శాంతమే జనులను జామునొందించును,
శాంతముననే గురుని జాడతెలియు,
శాంత భావ మహిమ జర్చించలేమయా,
విశ్వదాభిరామ వినుర వేమా.
97. ఆడితప్పువారల అభిమాన హీనులు,
గోడెఱుగని కొద్దివారు కూడి,
కీడు సేయగ్రూరుండు తలపోయు,
విశ్వదాభిరామ వినుర వేమా.
98. తరచూ కల్లలాడు ధనీసుల ఇండ్లలో,
వేళవేళ లక్ష్మి వెడలిపోవు,
నోటికుండలోన నుండునా నీరంబు,
విశ్వదాభిరామ వినుర వేమా.
99. చంపగూడదెట్టి జంతువునైనను,
చంపవలయు లోక శత్రుగుణము,
తేలుకొండి గొట్టందే లేమి చేయురా,
విశ్వదాభిరామ వినుర వేమా.
100. ఆత్మయందే దృష్టి ననువగా నొనరించి,
నిశ్చలముగా దృష్టి నిలిపెనేని,
అతడునీవె నమ్మి యనుమానమేలరా,
విశ్వదాభిరామ వినుర వేమా.
వేమన పద్యాలలో ఎక్కువగా లోకనీతులు, సామాజిక చైతన్యం ప్రతిఫలిస్తాయి. సమాజంలోని ప్రతి సమస్యను భిన్న కోణాల్లో దర్శించి, తన పద్యాలలో ప్రతిబింబించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరిగే దోపిడీలు, విగ్రహారాధన, కుహనా గురువులు, దొంగ సన్యాసులు వంటి సామాజిక అస్థవ్యస్థతలపై వేమన తన కలాన్ని ఝళిపించాడు.
వేమన పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి ప్రధాన కారణం ఆయన ఉపయోగించిన సరళమైన భాష. ప్రజలకు పరిచితమైన పదాలతో, స్పష్టంగా, సూటిగా, తేటతెల్లంగా నీతిని బోధించాడు. సామాన్యులలో తానొకడిగా భావించి చేసిన ఉపదేశం ఆయన పద్యాల ప్రధాన గుణం.
హాస్యం, వ్యంగ్యం, చమత్కారం, అధిక్షేపం కలగలిపి, నవ్విస్తూ లోపాలను గుర్తుచేసే శైలిని వేమన అనుసరించాడు. అందుకే ఆయన పద్యాలు నేటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి.
వేమన పద్యాలన్నీ ప్రధానంగా ఆటవెలది ఛందస్సులో చెప్పబడ్డాయి. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పారు.
సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యాన్ని చూపిస్తాడు. నాలుగో పాదం మకుటంగా ఉంటుంది:
కొన్ని పద్యాలలో ముందుగా సామ్యాన్ని చెప్పి, తరువాత నీతిని తెలియజేస్తాడు.
“విశ్వదాభిరామ వినురవేమ” అనే మకుటానికి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి:
ఇంగ్లీషు పండితుడు బ్రౌన్ రెండో అర్థాన్నే స్వీకరించి వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు.
వేమన పద్యాలు కేవలం సాహిత్యం కాదు; అవి ప్రజలకు మార్గదర్శకాలు. నీతి, చైతన్యం, సామాజిక సంస్కరణ, హాస్యం, సరళత – ఇవన్నీ కలిసిన అమూల్య సంపద వేమన సాహిత్యం.
పాట: Yeh Zindagi Usiki Hai (Part 1)
సినిమా: Anarkali
గాయని: Lata Mangeshkar
🔹 Yeh zindagi usiki hai jo kisi ka ho gaya, pyar hi mein kho gaya
ఈ జీవితం అతనిదే / ఆమెదే — ఎవరికైనా పూర్తిగా అంకితమై, ప్రేమలో లీనమైపోయినవారిదే.
🔹 Yeh bahaar yeh sama keh raha pyar kar
ఈ వసంత కాలం, ఈ అందమైన వాతావరణం — “ప్రేమించు” అని చెబుతోంది.
🔹 Kisiki aarzu mein apne dil ko beqarar kar
ఎవరో ఒకరి కోరిక కోసం నీ హృదయాన్ని ఆత్రుతతో నింపుకో.
🔹 Zindagi hai bewafa, lut pyar ka maza
జీవితం తాత్కాలికం. అందుకే ప్రేమలోని ఆనందాన్ని ఆస్వాదించు.
🔹 Dhadak raha hai dil toh kya, dil ki dhadkane na gin
గుండె వేగంగా కొట్టుకుంటే ఏమైంది? ప్రేమలో భయపడకు.
🔹 Phir kahan yeh fursate, phir kahan yeh raat din
ఇలాంటి రోజులు మళ్లీ రావు. అవకాశాన్ని వదులుకోకు.
🔹 Aa rahi hai yeh sada, mastiyon mein jhoom ja
ఆనందంలో మునిగి తేలిపో.
జీవితమే సఫలము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగ సుధా భరితం
ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు మాటలా
అనారు పూల తోటలా
ఆశ దెలుపు ఆటలా
వసంత మధుర సీమలా
ప్రశాంత సంజ వేళలా
అంతులేని వింతలా
అనంతప్రేమ ప్రేమ లీలగా
పరించు భాగ్యశీలలా
తరించు ప్రేమ జీవులా
జీవితమే సఫలము
ఈ పాట ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ప్రేమలో మునిగిపోయినవారికే జీవితం సార్థకం. జీవితం తాత్కాలికం కాబట్టి, ప్రేమను ఆలస్యం చేయకుండా ఆస్వాదించమని ఈ గీతం చెబుతోంది.
✨ Abraham (అబ్రహాము)
Father of faith. Followed God’s call and moved to a new land with complete trust.
Lesson: Faith leads life to a new direction.
👑 David (దావీదు)
Shepherd boy became king. Defeated Goliath and wrote Psalms with devotion.
Lesson: Courage and faith bring victory.
🏛️ Solomon (సొలొమోను)
Wisest king. Wrote Proverbs and built the great temple in Jerusalem.
Lesson: Wisdom elevates life.
🧠 Esau (ఏసావు)
Sold his birthright for a small need, losing something very valuable.
Lesson: Never underestimate important life opportunities.
💪 Samson (శాంసన్)
Man of great strength but lost everything due to lack of discipline.
Lesson: Without control, strength becomes weakness.
✨ Joseph (యోసేపు)
Interpreted Pharaoh’s dreams and saved Egypt from famine using wisdom.
Lesson: God-given wisdom transforms lives.
🧠 Daniel (దానియేలు)
Explained king’s dreams and revealed future kingdoms with divine insight.
Lesson: Faith and wisdom lead to greatness.
Faith, courage, wisdom, discipline, and right choices shape human life.
Dream understanding gives direction for future and success.
At the age of 14, life feels like a new sunrise. Dreams begin to grow, ideas become stronger, and the future opens slowly.
14 ఏళ్ల వయస్సులో జీవితం కొత్త ఉదయంలా అనిపిస్తుంది. కలలు మొలకెత్తుతాయి, ఆలోచనలు బలపడతాయి, భవిష్యత్తు తలుపులు తెరుచుకుంటుంది.
Teenagers discover talents in science, art, sports, writing, and technology. Innovation starts with imagination.
యువత విజ్ఞానం, కళలు, క్రీడలు, రచన, సాంకేతికతలో ప్రతిభను కనుగొంటారు. ఊహాశక్తితో ఆవిష్కరణ ప్రారంభమవుతుంది.
At 14, young minds explore books, hobbies, friendships, and knowledge. Every experience becomes a lesson.
14 ఏళ్ల వయస్సులో పుస్తకాలు, అభిరుచులు, స్నేహాలు, జ్ఞానం అన్వేషిస్తారు. ప్రతి అనుభవం ఒక పాఠమవుతుంది.
Teenagers admire parents, teachers, leaders, and successful people. Role models inspire growth.
తల్లిదండ్రులు, గురువులు, నాయకులు, విజయవంతులైన వారిని అభిమానిస్తారు. ఆదర్శ వ్యక్తులు ఎదుగుదలకు ప్రేరణనిస్తారు.
Small victories such as prizes, skills, or confidence become the first steps toward success.
బహుమతులు, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం వంటి చిన్న విజయాలే పెద్ద విజయాలకు మొదటి అడుగులు.
With hard work, patience, and belief, dreams slowly become reality.
కృషి తొ పాటు, సహనం, విశ్వాసంతో కలలు క్రమంగా నిజమవుతాయి.
సమాజం వసుదైకకుటుంబం యొక్క నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు.
ప్రసిద్ధ వాక్యం "There are no facts, only interpretations." — Friedrich Nietzsche (1844–1900)
(Development of Human Relations and Human Resources)By CH Ramamohan
Blog: ramamihanchinta.blogspot.com
చరిత్రలో మతాలు పూర్తిగా వేరుగా పెరగలేదు. వాణిజ్యం, యుద్ధాలు, వలసలు, తాత్విక చర్చల ద్వారా ఒకదాని భావనలు మరొకదానికి చేరాయి.
వేదకాలంలో యజ్ఞాలు, దేవతారాధన ప్రధానంగా ఉండేవి. తరువాత ఉపనిషత్తులు “బాహ్య యజ్ఞం కంటే అంతర్గత జ్ఞానం గొప్పది” అని చెప్పాయి.
బుద్ధుడు కాలంలో భారతదేశంలో తాత్విక వాతావరణం ఉండేది. ధ్యానం, సంసారం, కర్మ భావనలపై చర్చలు జరిగేవి.
యేసు యూదు సంప్రదాయంలో జన్మించారు. అందువల్ల క్రైస్తవ మతానికి యూదు మతంతో బలమైన సంబంధం ఉంది.
మంచి-చెడు పోరాటం, స్వర్గం-నరకం, తీర్పు దినం వంటి భావనలు తరువాతి మతాలపై ప్రభావం చూపాయి.
బౌద్ధం శ్రీలంక, చైనా, జపాన్, థాయ్లాండ్ వంటి దేశాలకు వ్యాపించింది.
వేదం → ఉపనిషత్తులు → బౌద్ధం
యూదు → క్రైస్తవం
జరథుష్ట్ర → యూదు / క్రైస్తవ భావాలు
ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిన కవుల్లో దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రముఖులు. తెలుగు కవిత్వానికి కొత్త భావజాలం, సున్నితమైన అనుభూతి, ఆధునిక మనస్తత్వం అందించిన కవిగా తిలక్ గుర్తింపుపొందారు. సాంప్రదాయ కవిత్వ శైలికి భిన్నంగా వ్యక్తి అంతర్ముఖ ప్రపంచాన్ని, సమాజంలోని మార్పులను, జీవిత వాస్తవాలను తన కవిత్వంలో ప్రతిబింబించారు.
తిలక్ కవిత్వంలో భావుకత, అందం, తాత్వికత, బాధ, ప్రేమ, ప్రకృతి, మానవ సంబంధాలు సమన్వయంగా కనిపిస్తాయి. అతని పద ప్రయోగం సున్నితంగా ఉండి పాఠకుని మనసును తాకుతుంది. సాధారణ సంఘటనలలో కూడా లోతైన భావాన్ని గుర్తించి కవిత్వంగా మలచగల శక్తి తిలక్కు ప్రత్యేకత.
ఆధునిక యుగంలో మనిషి ఎదుర్కొనే ఒంటరితనం, ఆశలు, నిరాశలు, సంఘర్షణలు ఆయన రచనల్లో ప్రతిఫలించాయి. అందువల్ల ఆయన కవిత్వం కేవలం అలంకారభరితం కాకుండా జీవనానుభవాలకు దగ్గరగా ఉంటుంది. తిలక్ రచనలు చదివినప్పుడు మనసులోని నిశ్శబ్ద భావాలు పదాలుగా వినిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వానికి మార్గదర్శకులలో తిలక్ ఒకరు. సాంప్రదాయ ఛందస్సును గౌరవిస్తూ, కొత్త భావవ్యక్తీకరణకు దారి చూపారు. అందుకే ఆయనను ఆధునిక భావకవిగా, సున్నిత హృదయ కవిగా సాహిత్య ప్రపంచం గౌరవిస్తుంది.
తిలక్ కవిత్వం మనసును ఆలోచింపజేస్తుంది, జీవితాన్ని అనుభూతి పరచిస్తుంది, సాహిత్యానికి కొత్త దిశ చూపిస్తుంది.
ఈ రచయితలందరూ తెలుగు మరియు భారతీయ సాహిత్యాన్ని వివిధ కోణాలలో సమృద్ధి పరిచారు.
ఈ అంశాలు తెలుగు సాహిత్యానికి పునాది వంటివి. రచనలో భావం, భాష, శిల్పం, రసం కలిసినప్పుడు సాహిత్యం మహోన్నతమవుతుంది.
సాహిత్యం అనేది మానవ హృదయంలో కలిగే భావాలు, ఆలోచనలు, అనుభవాలు, ఆశలు, ఆశయాలు, సమాజ జీవన విధానాలను భాష ద్వారా కళాత్మకంగా వ్యక్తపరచే ప్రక్రియ. ఇది కేవలం పదాల సమాహారం కాదు; మనిషి మనసును మేల్కొలిపే ఆత్మీయ శక్తి. ఒక సమాజపు సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విలువలు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. అందువల్ల సాహిత్యాన్ని సమాజానికి అద్దమని అంటారు.
సాహిత్యం అనేక రూపాలలో కనిపిస్తుంది. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం, పద్యం, గద్యం వంటి ప్రక్రియలు సాహిత్యంలోని ప్రధాన శాఖలు. కథ ద్వారా జీవన సత్యాలు తెలియజేయబడతాయి. కవిత ద్వారా హృదయ భావాలు సున్నితంగా వ్యక్తమవుతాయి. నవల ద్వారా సమాజంలోని విభిన్న కోణాలు విశదీకరించబడతాయి. నాటకం ద్వారా పాత్రల జీవితం మన ముందే సజీవంగా కనబడుతుంది.
సాహిత్యం మనిషికి జ్ఞానాన్ని మాత్రమే కాదు, సద్గుణాలను కూడా అందిస్తుంది. మంచి చెడు మధ్య తేడాను గుర్తించడానికి తోడ్పడుతుంది. ప్రేమ, కరుణ, ధైర్యం, నీతి, సేవా భావం వంటి విలువలను పెంపొందిస్తుంది. కష్టకాలంలో ఓదార్పునిస్తుంది. ఆనంద సమయంలో మరింత ఆనందాన్ని పంచుతుంది.
తెలుగు సాహిత్యం ఎంతో వైభవవంతమైనది. నన్నయ, తిక్కన, యేర్రప్రగడ, శ్రీనాథుడు, పోతన, వేమన, గురజాడ, విశ్వనాథ, శ్రీశ్రీ వంటి మహాకవులు తెలుగు భాషను సమృద్ధిగా తీర్చిదిద్దారు. వారి రచనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకాలు.
సాహిత్యం కాలానుగుణంగా మారుతూ వచ్చినా దాని ప్రాధాన్యం ఎప్పటికీ తగ్గదు. మంచి సాహిత్యం చదివిన మనిషి మంచి ఆలోచనలు కలిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదుగుతాడు. అందువల్ల సాహిత్యం మన జీవన వికాసానికి శాశ్వత సంపద.
భాస్కరుడు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్రలోని విజ్జదిత్ (విజ్జలబిడ / విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడు. ఇతని గ్రంథాలలో వైష్ణవ ప్రార్థనలు కనిపించుటవల్ల కొందరు ఇతడిని వైష్ణవుడని పేర్కొన్నారు.
చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. ప్రపంచప్రఖ్యాతి పొందడానికి కారణమైన ఒక విశేష సంఘటన ఉంది. భాస్కరుడు జ్యోతిష్యంలో కూడా ప్రావీణ్యం కలవాడు. కుండలలో నీరు, ఇసుక వేసి క్రింద చిన్న రంధ్రాల ద్వారా పడే చుక్కల సమయాన్ని బట్టి ముహూర్తాలు నిర్ణయించేవాడు.
తన కుమార్తె లీలావతి పెళ్లి కొరకు శుభముహూర్తం నిర్ణయించాడు. కానీ ఒక రోజు లీలావతి ఆడుకుంటూ ఉండగా ముక్కుపుడకలోని ముత్యం పై కుండలో పడింది. ఆ ముత్యం రంధ్రానికి అడ్డుపడి నీటి చుక్కల లెక్క మారింది. ఫలితంగా నిర్ణయించిన ముహూర్తం తప్పిపోయింది. పెళ్లైన కొద్దికాలానికే లీలావతి భర్త మరణించాడు.
ఈ దుఃఖం నుండి బయటపడేందుకు భాస్కరుడు లీలావతికి గణితం నేర్పించాడు. తాను కూడా గణితంపై తీవ్ర పరిశోధనలు కొనసాగించి ఎన్నో కొత్త సూత్రాలు, ప్రక్రియలు కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాడు. తన కుమార్తె పేరు మీదే ప్రసిద్ధ గ్రంథం లీలావతి రచించాడు.
సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణిత సూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. బీజగణితం, గ్రహగణితం వంటి విభాగాల్లో అతని సేవలు విశేషమైనవి.
వరాహమిహిరుడు సా.శ. 499 ప్రాంతంలో జీవించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రాహు, కేతువుల వల్ల కాక భూమి నీడ కారణంగా జరుగుతాయని వివరించాడు. తోకచుక్కలు మరియు వాటి రకాల గురించి కూడా తెలిపాడు.
అనేక సందర్భాలలో గర్గ, పరాశర, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషులను ప్రస్తావించాడు. దీనివల్ల ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి తెలుస్తాయి.
హిందూ కాలగణన కాలక్రమేణా అనేక మార్పులు చెందింది. ప్రస్తుతం వివిధ ప్రాంతీయ విధానాలు ఉన్నాయి. అధికంగా ఈ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ. 3వ శతాబ్దంలో ప్రామాణిక రూపం పొందినట్లు భావిస్తున్నారు.
వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రంలో హిందూ కాలగణనకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆర్యభట్టుడు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. భారతీయ విజ్ఞాన చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. గణితం, ఖగోళ శాస్త్రం, సంఖ్యా శాస్త్రం వంటి అనేక రంగాలలో విశిష్ట కృషి చేశాడు.
ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రం వంటి గ్రంథాలను రచించాడు. ఈ రచనలు భారత గణిత శాస్త్రానికి బలమైన పునాది వేశాయి.
ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుగొన్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ భావనలను ఇతను “జ్యా”, “కొ జ్యా”గా నిర్వచించాడు.
త్రికోణమితి అభివృద్ధికి ఆయన చేసిన సేవలు విశేషమైనవి. సంఖ్యా గణనలో కూడా ఆయన పద్ధతులు విశేష ప్రాముఖ్యత పొందాయి.
భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు “ఆర్యభట్ట” పెట్టారు. ఇది భారతదేశం ఆయనకు ఇచ్చిన గొప్ప గౌరవం.
వరాహమిహిరుడు భారతదేశపు ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష పండితుడు. చంద్ర గ్రహణాలు రాహు, కేతువుల వల్ల కాక భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల కలుగుతాయని వివరించాడు.
అలాగే సూర్య గ్రహణం చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సంభవిస్తుందని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఇది ఆయన శాస్త్రీయ దృష్టికి గొప్ప ఉదాహరణ.
తోకచుక్కలు మరియు వాటి రకాల గురించి కూడా వరాహమిహిరుడు వివరించాడు. ప్రకృతి, ఖగోళ ఘటనలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ఈ రచనల ద్వారా తెలుస్తుంది.
అనేక సందర్భాలలో గర్గ, పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల అభిప్రాయాలను గౌరవంగా ప్రస్తావించాడు. ఇంకా “అన్యాన్ బహున్” అని చెప్పడం ద్వారా అనేకమంది పూర్వాచార్యులను అనుసరించినట్లు తెలుస్తుంది.
ఇది ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయం, జ్ఞాన సంపదకు నిదర్శనం. ఆ కాలంలో పూర్వ గ్రంథాలు, సిద్ధాంతాలు అందుబాటులో ఉండేవని కూడా తెలుస్తుంది.
హిందూ కాలగణన (Hindu Calendar) కాలక్రమేణా అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలు ఉన్నాయి.
అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు.
సూర్య సిద్ధాంతం వేదాంగాలలో ఒకటైన జ్యోతిషశాస్త్రానికి చెందిన ప్రముఖ గ్రంథంగా పరిగణించబడుతుంది.
ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరం ఎప్పుడు విడిచి పోతుందో ఎవరికీ తెలియదు. మనిషి వంద సంవత్సరాలు బ్రతుకుతాడని అంటారు గాని, అది నమ్మదగిన మాట కాదు.
బాల్యంలోనా, యౌవనంలోనా, వృద్ధాప్యంలోనా, ఇంటిలోనా, అడవిలోనా, నీటిలోనా – మరణం ఎప్పుడు, ఏ క్షణంలో వస్తుందో తెలియదు.
అందువల్ల బుద్ధిమంతుడు దేహం ఉన్నంతలోనే జీవన సత్యాన్ని తెలుసుకోవాలి.
శ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది. ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి.
ఈ పద్యాలన్నీ క్రింది మకుటంతో అంతమవుతాయి:
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగలమ్ !
సమదృష్టేస్తదా పుంసః సర్వాః సుఖమయా దిశః !!
ఏ జీవిపట్లా రాగద్వేషాలు లేని మానవుడికి, ఎల్లప్పుడూ మనస్సులో సమత్వ భావం కలిగివుండే మనిషికి అన్ని ప్రదేశాలూ ఆనందంతో నిండి ఉంటాయి.
స్థితప్రజ్ఞత అనేది భగవద్గీతలో ఉన్న ఒక ముఖ్యమైన భావన. ఇది ధ్యానం, జ్ఞానం, మరియు ఆత్మవిశ్వాసంతో సంబంధం కలిగిన ఒక శక్తివంతమైన సిద్ధాంతం.
శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు, స్థితప్రజ్ఞతను వివరిస్తూ చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైనవి.
స్థితప్రజ్ఞత అంటే మనస్సు, ఆత్మ, భావాలు స్థిరంగా ఉండటం. ఏ పరిస్థితిలోనూ ధర్మాన్ని అనుసరించడం.
ఇది ఆత్మానందం మరియు అశాంతి లేని జీవన శైలిని సూచిస్తుంది.
భగవద్గీతలో 2.55 శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞతను వివరిస్తాడు.
ప్రశ్నించినప్పుడు, స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని లక్షణాలు:
స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తి తన కర్మలు పూర్తిగా సమర్పణా భావంతో చేస్తాడు. ఫలితానికి ఆందోళన పడడు.
మంచి లేదా చెడు పరిస్థితులలో కూడా ఎటువంటి అశాంతి లేకుండా సమతుల్యంగా ఉంటుంది.
తన ఆశయాలను, సాధనలను నమ్ముతాడు. ఇతరుల పనులు తనపై ప్రభావం చూపవు.
అగ్రహం, కోపం, అసూయ వంటి ప్రతికూల భావనలను కలిగి ఉండదు.
1. నిర్భయం: సమయానికి అనుగుణంగా పనిచేస్తాడు.
2. ప్రమత్తత: పరిస్థితులపై అవగాహన కలిగి ఉంటాడు.
3. మానసిక స్థితి: అనుకూల, ప్రతికూల భావనలను సమంగా స్వీకరిస్తాడు.
4. సంకల్పం: తలపోసిన లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తాడు.
స్థితప్రజ్ఞత అనేది ఆత్మజ్ఞానంతో కూడిన ఓ స్థితి. దీని ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి, వివిధ పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఇది శాంతి, నియమం, ధర్మం మరియు పరిపూర్ణత దిశగా తీసుకెళ్లే మార్గం.
Ecclesiastes - ప్రసంగి 9:10
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
“Except a man be born again, he cannot see the kingdom of God.”
యెవరైనను మరల జన్మింపకపోతే దేవుని రాజ్యము చూడలేడు.
John 3:3
“Keep on asking... seeking... knocking...”
అడుగుడి – మీకు ఇవ్వబడును. వెదకుడి – మీరు కనుగొందురు. తట్టుడి – మీకు తలుపు తెరవబడును.
Luke 11:9-10
“Whoever wants to be a leader among you must be your servant.”
మీలో నాయకుడవలెననుకునే వాడు సేవకుడై యుండవలెను.
Mark 10:42-45
“Come, follow me...”
నా వెంట రండి; నేను మిమ్మును మనుష్యులను సంపాదించువారిగా చేయుదును.
Matthew 4:19
“Don’t worry about tomorrow...”
రేపటి విషయమై చింతింపకుడి; ఈ దినానికి ఈ దిన శ్రమ చాలును.
Matthew 6:34
“Whosoever drinketh of this water shall thirst again...”
నేను ఇచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు; అది నిత్యజీవ జలధార అవుతుంది.
John 4:13-14
“Let the little children come to me...”
చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి; వారిని అడ్డుకొనకుడి.
Matthew 19:14
“My Kingdom is not of this world.”
నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు.
John 18:36
“Father, forgive them, for they do not know what they are doing.”
“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.”
Luke 23:34
The type of person you are, shown by the way you behave, feel, and think.
వ్యక్తిత్వం అంటే మీరు ఏ రకం మనిషో అని మీ ప్రవర్తన, భావనలు, ఆలోచనలను బట్టి తెలిసేది.
1. ప్రేమ (Love)
2. క్షమ (Forgiveness)
3. సేవ (Service)
4. విశ్వాసం (Faith)
5. వినయం (Humility)
6. ధైర్యం (Courage)
మొదటి పద్యంలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, ఈ శ్మశానవాటికలో కొన్నివందల, వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటూ ప్రారంభించాడు.
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.
ఈ రుద్రభూమిలో తమ బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్లకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయాయని చింతిస్తున్నాడు.
కవి హృదయం చూడండి.
ఈ పద్యంలో జాషువ మరణం, మానవ దుఃఖం, తల్లుల బాధ, జీవితం యొక్క నశ్వరతను హృదయాన్ని కదిలించేలా చిత్రించాడు.
తన తాత్త్విక రచనలో, ముఖ్యంగా ప్రభోధకుడు (Ecclesiastes) లో, "వ్యర్థం! వ్యర్థం! అన్నీ వ్యర్థమే" అని పదే పదే చెప్పడం మన జీవితానికి విలువైన ఆలోచనను అందిస్తుంది.
సొలమన్ జీవన అనుభవాల ద్వారా చెప్పారు, ఎంత సంపద సంపాదించినా, ఎంత భోగభాగ్యాలు పొందినా, వాటికి శాశ్వతత ఉండదు.
"మనిషి చేసిన శ్రమలో ఫలితం ఏమిటి?" (Ecclesiastes 1:3)
సొలమన్ తన రాజరికంలో అత్యధిక శ్రేయోభిలాషల్ని అనుభవించారు. అయినప్పటికీ, వాటి అంతిమ ఫలితం నిరర్థకం అని గుర్తించారు.
"హాస్యం పిచ్చి మాత్రమే, ఆనందం శూన్యం." (Ecclesiastes 2:2)
"మనిషి రాత్రింబవళ్ళు శ్రమపడి సంపాదించిన ఆస్తిని మరొకరి చేతులలో విడిచిపెట్టాలి" అన్న భావన ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. (Ecclesiastes 2:18-21)
జ్ఞానం గొప్పదే అయినప్పటికీ, మరణం ద్వారా జ్ఞానులు మరియు మూర్ఖులు ఒకే స్థాయిలో నిలుస్తారని చెప్పారు.
"మూర్ఖుడు ఎలా చస్తాడో, నేను అలాగే చస్తాను." (Ecclesiastes 2:16)
జీవితంలోని అస్థిరతలను అంగీకరించడంలోనే నిజమైన శాంతి ఉందని సొలమన్ తేల్చారు.
"దేవుని భయపడండి, ఆయన ఆజ్ఞలను పాటించండి; ఇదే మనిషి యొక్క కర్తవ్యం." (Ecclesiastes 12:13)
"ప్రతిచర్యకు సమయముంది, ప్రతి కార్యం దేవుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది." (Ecclesiastes 3:1-8)
1. భౌతిక సంపదలు, ఆనందాలు, మరియు కీర్తి తాత్కాలికం.
2. శాశ్వతమైన సంతృప్తి దేవునిపై నమ్మకం, ధర్మబద్ధమైన జీవితం ద్వారా మాత్రమే పొందవచ్చు.
3. జీవితంలో ప్రతి క్షణం విలువైనదే, కానీ దానికి అర్థం ఇవ్వడం మన చేతుల్లోనే ఉంది.
సామెతలు పాతనిబంధనలోని అత్యంత ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథం జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించి నైతికత, జ్ఞానం, మరియు ఆధ్యాత్మిక దార్శనికతను బోధిస్తుంది.
1. జ్ఞానం మరియు భక్తి:
"యెహోవాకు భయపడుట జ్ఞానమునకు ఆద్యము." (సామెతలు 1:7)
2. ప్రమాదకరమైన మార్గాలు:
"సరియైనదని మనిషి దృష్టికి కనబడే మార్గము ఉంది, కానీ అది మరణ మార్గానికి దారి తీస్తుంది." (సామెతలు 14:12)
3. మాటల శక్తి:
"మృదువైన జవాబు కోపాన్ని అణచివేస్తుంది, కానీ పట్టు పదాలు కోపాన్ని రగిలిస్తాయి." (సామెతలు 15:1)
4. శ్రమ మరియు విజయం:
"సుమర్యపు హస్తములు ధనాన్ని తెస్తాయి, కానీ మోసపూరిత మార్గాలు పేదరికం తీసుకొస్తాయి." (సామెతలు 10:4)
5. క్రోధాన్ని నియంత్రించడం:
"క్రోధంలో ఉన్నవాడు మూఢుడు, తన భావాలను నియంత్రించగలవాడు జ్ఞానవంతుడు." (సామెతలు 29:11)
6. స్నేహం మరియు జ్ఞానం:
"ఇనుము ఇనుమును పదును చేస్తుంది; స్నేహితుల మధ్య సంబంధం కూడా ఇలాగే ఉంటుంది." (సామెతలు 27:17)
7. నీతిపరమైన జీవనం:
"ధర్మముతో నడిచే వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉంటుంది, కానీ చెడుకు దిగబడేవారు బంధనంలో పడతారు." (సామెతలు 10:9)
8. సహనం మరియు విజయం:
"సహనమున్నవాడు యుద్ధానికి గెలుస్తాడు, కానీ హుటాహుటిన ఆవేశపడ్డవాడు చీదరించుకుంటాడు." (సామెతలు 16:32)
9. దార్శనికత:
"దార్శనికత లేని చోట ప్రజలు నాశనమవుతారు." (సామెతలు 29:18)
10. పేదరికం మరియు ధనవంతులు:
"నిజాయితీగా పేదగా ఉండటం, మోసంతో సంపదను కూడబెట్టుకోవడం కంటే మంచిది." (సామెతలు 28:6)
ఈ సామెతలు జీవన నైతికతకు పునాది.
ధార్మికత, వినయం, మరియు బుద్ధితో జీవితాన్ని ఎలా గడపాలో చూపిస్తాయి.
వ్యక్తిగత సంబంధాలు, కుటుంబం, ఆర్థికం, మరియు సామాజిక జీవనానికి మార్గదర్శకత్వం అందిస్తాయి.
సైకాలజీకి సంబంధించిన విషయంపై ఆసక్తి చూపిస్తున్నట్లైతే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక ప్రసిద్ధ ఆస్ట్రియన్ నెవ్రాలజిస్ట్ మరియు మానసికశాస్త్రంలో సైకో అనాలిసిస్ (Psychoanalysis) పద్ధతిని అభివృద్ధి చేసిన వ్యవస్థాపకుడు.
మానవ మనస్సు మూడు స్థాయిలను కలిగి ఉంటుంది:
ఇడ్ (Id): ప్రాథమిక అభిలాషలు, కోరికలు (తక్షణ అవసరాలు).
ఈగో (Ego): తర్కబద్ధత, వాస్తవాన్ని అంగీకరించే భాగం.
సుపర్ ఈగో (Super Ego): నైతికత మరియు విలువలు.
చేతన స్థితి (Conscious): మనకు తెలిసిన భావాలు.
అవచేతన స్థితి (Subconscious): అస్పష్టమైన, కానీ మన ప్రవర్తనను ప్రభావితం చేసే భావాలు.
అచేతన స్థితి (Unconscious): పూర్తిగా దాగివున్న భావాలు, జ్ఞాపకాలు, మరియు కోరికలు.
ఫ్రాయిడ్ చెప్పినట్లుగా, స్వప్నాలు మన అచేతన భావాల ప్రతిబింబం. అవి మన కోరికలు, భయాలు, మరియు భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.
మనం కొన్ని దురభిరుచులను, కోరికలను మన అచేతనంలో నెట్టివేయడం.
పిల్లల వ్యక్తిత్వాభివృద్ధిలో మాతాపితలపై ఉండే భావోద్వేగ బంధాలపై ఫ్రాయిడ్ చేసిన విశ్లేషణ.
మానవ వ్యక్తిత్వాన్ని, కోరికలను, మరియు భావోద్వేగాలను విశ్లేషించడంలో ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాలు విప్లవాత్మకమైనవి.
అతని సిద్ధాంతాలు, మానసికశాస్త్రంలో గొప్ప పునాది వేసాయి.
సిగ్మండ్ ఫ్రాయిడ్ లైంగికత మరియు దాని ప్రభావం గురించి అభిప్రాయాలను వివరంగా పరిశీలించారు. ఫ్రాయిడ్ అభిప్రాయంలో, లైంగికత మనిషి వ్యక్తిత్వ వికాసంలో, భావోద్వేగాల్లో, మరియు మానసిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
లైబిడో (Libido):
ఫ్రాయిడ్ ప్రకారం, లైబిడో అంటే జీవశక్తి లేదా లైంగిక శక్తి. ఇది మానవ ప్రవర్తనను ఉద్భవింపజేసే ప్రధాన శక్తిగా ఉంటుందని ఆయన భావించారు.
లైబిడో బాల్యంలోనే ఆరంభమై, జీవితంలో వివిధ దశల్లో (Psychosexual stages) మానసిక వికాసానికి మౌలికంగా పనిచేస్తుంది.
ఫ్రాయిడ్ లైంగికత వికాసాన్ని ఐదు దశలుగా విభజించాడు:
1. ఔరల్ దశ (Oral Stage): శిశువులు నోటితో ఆనందాన్ని పొందుతారు.
2. ఆనల్ దశ (Anal Stage): 2-4 ఏళ్లలో, శిశువులు క్రమశిక్షణను నేర్చుకుంటారు.
3. ఫాలిక్ దశ (Phallic Stage): 3-6 ఏళ్ల వయసులో, పిల్లల లైంగిక అవగాహన మొదలవుతుంది.
4. లాటెన్సీ దశ (Latency Stage): లైబిడో శక్తి తాత్కాలికంగా తగ్గుతుంది.
5. జెనిటల్ దశ (Genital Stage): యౌవనంలో లైంగిక శక్తి ప్రబలంగా ఉంటుంది, ఇది సంబంధాలపై ప్రభావం చూపుతుంది.
వ్యక్తిత్వ వికాసం:
లైంగికతను సమర్థంగా అర్థం చేసుకుని నియంత్రించగలగటం వ్యక్తిత్వం పటిష్ఠతకు దోహదం చేస్తుంది. కానీ అణచివేత (Repression) లేదా అసమతుల్యత (Fixation) అభివృద్ధిని అడ్డుకోవచ్చు.
ఓడిపస్ కాంప్లెక్స్ (Oedipus Complex):
ఫ్రాయిడ్ ప్రకారం, బాల్యంలో తల్లితండ్రుల పట్ల పిల్లల దృక్పథంలో లైంగిక భావాలు ఉండవచ్చు. ఇది సరైన దిశలో పరిష్కరించకపోతే, పెద్దవారిగా సంబంధాలలో సమస్యలకు దారితీస్తుంది.
సమతుల లైంగిక జీవనం:
లైంగికతకు సంబంధించిన జ్ఞానం మరియు అవగాహన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అణచివేత (Repression):
లైంగిక ఆలోచనలను అణగదొక్కడం, అవి అవగాహనలోకి రాకుండా నిరోధించడం, ఆందోళన, నిస్ఫూర్తి, మరియు డిప్రెషన్కు కారణమవుతుందని ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు.
ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని కొందరు ఆమోదించినా, ఇతరులు అతని లైంగికతపై అధిక ప్రాముఖ్యతను విమర్శించారు. వారు లైంగికత తప్ప మానసిక వికాసానికి ఇతర అంశాలు కూడా ముఖ్యమని సూచించారు.
ఫ్రాయిడ్ లైంగికతను మానసిక మరియు శారీరక ప్రవర్తనలో కేంద్ర స్థానంలో ఉంచి, వ్యక్తిత్వ వికాసాన్ని విశ్లేషించాడు.
Jesus Christ and Buddha comparison in Telugu | Philosophy | Teachings | Religion | Ethics
ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలులైన ఇద్దరు మహనీయులు యేసు క్రీస్తు మరియు బుద్ధుడు. ఇద్దరూ ప్రేమ, దయ, నీతి, మానవ సంక్షేమం గురించి బోధించారు. అయితే వారి తత్వాలు, దైవ దృక్పథం, మోక్ష మార్గం, బోధనా విధానాల్లో తేడాలు ఉన్నాయి.
బుద్ధుడు (సిద్ధార్థ గౌతముడు) (563–483 BCE): నేపాల్లోని లుంబినిలో రాజకుమారుడిగా జన్మించారు. భౌతిక జీవితాన్ని వదిలి, ధ్యానం ద్వారా సత్యాన్ని గ్రహించి, ధర్మ బోధనలో జీవితం గడిపారు.
యేసు క్రీస్తు (4 BCE – 30 CE): బెత్లహేమ్లో జన్మించి, నజరేత్లో పెరిగారు. ప్రేమ, క్షమాభావం, మోక్షం గురించి బోధించారు. శిలువ వేయబడటం, పునరుత్థానం క్రైస్తవ మతానికి ఆధారం అయ్యాయి.
బుద్ధుడు: దుఃఖం మరియు దాని నివారణ గురించి బోధించారు. చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గం ద్వారా శాంతి సాధ్యమని చెప్పారు.
యేసు: ప్రేమ, క్షమ, విశ్వాసం, మోక్షం పై బోధించారు. పర్వత ప్రసంగం ద్వారా స్వీయ త్యాగం, దైవభక్తి, పరలోక జీవితం గురించి చెప్పారు.
బుద్ధుడు: సృష్టికర్త దేవుడిని ప్రధానంగా ప్రస్తావించలేదు. కర్మ, పునర్జన్మ, నిర్వాణం పై దృష్టి పెట్టారు.
యేసు: దేవుడు తండ్రి అని చెప్పారు. దైవభక్తి, క్షమాభావం, నిత్య జీవితం గురించి బోధించారు.
బుద్ధుడు: అహింస, సత్యవచనం, ధర్మాచరణం, దయను ప్రోత్సహించారు. కోరికలు, సంపద పట్ల అసక్తి లేకుండా జీవించమన్నారు.
యేసు: శత్రువులను క్షమించాలి, ప్రేమించాలి, సేవా భావంతో ఉండాలి, పేదవారిని ఆదుకోవాలని చెప్పారు.
బుద్ధుడు: తార్కికత, సంభాషణలు, ఉపమానాల ద్వారా బోధించారు.
యేసు: పరబుల్స్ (ఉపమాన కథలు), అద్భుతాలు, ఉదాహరణల ద్వారా బోధించారు.
బుద్ధుడు: బౌద్ధ మత స్థాపకుడిగా ధ్యానం, ఆత్మజ్ఞానం ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేశారు.
యేసు: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం విస్తరించింది. పాశ్చాత్య నాగరికతపై గొప్ప ప్రభావం చూపారు.
యేసు మరియు బుద్ధుడు ఇద్దరూ మానవాళికి ప్రేమ, దయ, నీతి, ఆత్మపరిశీలన మార్గాలను చూపిన మహనీయులు. ఇద్దరి బోధనల్లో భిన్నతలు ఉన్నా, మానవ శ్రేయస్సు అనే లక్ష్యం సామాన్యంగా కనిపిస్తుంది.
వారి ఉపమానాలు, ధర్మచర్చలు, సులభమైన భాష మన వాక్చాతుర్యాన్ని, ఆలోచనా శక్తిని పెంచుతాయి.
సంగీతం: మాష్టర్ వేణు
రచన: సముద్రాల
గానం: జిక్కి, భానుమతి
ఈ గీతంలో జీవితం అనేక ప్రశ్నల సమాహారమని, మన కళ్లకు కనిపించే ప్రతిదీ అందుబాటులో ఉండదని చెప్పబడింది.
సృష్టిలోని అసమానతలు, బాధలు, సందేహాలు మనిషిని ఆలోచింపజేస్తాయి.
ప్రతి ప్రశ్నకు సమాధానం వెదుకుతూ కాలం గడపడం కంటే, జీవితం అర్థవంతంగా బ్రతకడమే న్యాయం అని ఈ గీతం సందేశం.
ప్రసంగి 1:18 –
“జ్ఞానము అధికమైనంత మాత్రమున బాధయు అధికమైయుండును;
జ్ఞానము పెంపొందించువాడు దుఃఖమును పెంపొందించును.”
“వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విలాసం.”
– బాటసారి
మన చుట్టూ ఉన్న అన్యాయాలు, అసమానతలు, మనిషి స్వార్థం, అసత్యం — ఇవన్నీ అజ్ఞానంలో కనిపించవు. కానీ జ్ఞానం పెరిగితే అవన్నీ స్పష్టంగా కనపడతాయి.
పెరిగిన జ్ఞానంతో ఎంతో చేయాలనిపిస్తుంది. కానీ మన శక్తి పరిమితమైనప్పుడు... మనం చూసే బాధలను మనం తొలగించలేనప్పుడు... శోకంగా మారుతుంది.
సొలొమోను తాత్విక దృష్టిలో:
“సమస్తమును వ్యర్థమే.”
ఇది వైరాగ్యపు మొదటి అంచు — జీవితం యొక్క స్వరూపం నిరంతరం మారుతుంది, ఏది శాశ్వతం కాదు.
సొలొమోను ఇలా చెప్పినా, ఇది నిస్సహాయత కాదు. అతని సందేశంలో ఒక తాత్విక పరిష్కారం ఉంది.
జ్ఞానం మొదట్లో శోకం కలుగ చేస్తే, చివరికి తత్వాన్వేషణకు దారి చూపుతుంది.
శాశ్వతం కానిదానిపై ఆశలు పెట్టుకుంటే శోకం. కాని శాశ్వతమైన పరమార్థాన్ని గ్రహించినపుడు శాంతి.
“జ్ఞానం వల్ల శోకం కలుగుతుంది” అనే వాక్యం వైరాగ్యానికి ద్వారం. శోకాన్ని మాత్రమే కాదు, దాని ద్వారా శాంతి, పరిపక్వత, పరిష్కారం పొందడం — ఇదే సొలొమోను చూపిన తత్త్వం.
“వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం”
“బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై... బ్రతుకుటయే న్యాయం”
వీటి ద్వారా ఒక నిశ్చలమైన నిజం వెల్లడవుతుంది — జీవితం అనేక ప్రశ్నల సమాహారంగా మారుతుంది. అన్ని సమాధానాల కోసం అన్వేషించడం సహజ మానవ గుణం.
కాని సమాధానాలు అన్నీ ఒకేసారి, ఒకే స్థలంలో దొరకవు. చదువు, శాస్త్రాలు, వేదాలూ గొప్పవే అయినా — అనుభవాల అంచనాల ముందు అవి అప్పుడప్పుడూ చిన్నవిగా అనిపించవచ్చు.
సొలమన్ చేసిన వ్యాఖ్యలు — “జీవితం వ్యర్థమేమో” అనే సందేహం — మనం పొందే జ్ఞానాన్ని సంశయాత్మకంగా చూసే దృక్పథానికి ప్రతిబింబం.
కాని అది నిరాశ కాదు — ఒక నిజమైన అవగాహన. బ్రతుకే ప్రశ్న అయితే, జీవించడమే సమాధానాల వెదకడం అనే మితమైన తాత్వికం ఇందులో కనిపిస్తుంది.
ప్రసంగి 1:2
“వ్యర్థము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే” అని ప్రసంగి సెలవిచ్చెను.
ప్రసంగి 2:16
జ్ఞానిని మరచిపోవడము మూర్ఖునికంటె ఏమైనా ఎక్కువా? కాలక్రమములో వారిద్దరును మరచివేయబడుదురు; నిశ్చయముగా జ్ఞాని మూర్ఖునికి కలుగునట్లు మరణించును.
ప్రసంగి 2:14
జ్ఞానికిగల దృష్టి అతని తలలో ఉండును; మూర్ఖుడు అంధకారమందు నడుచును; అయితే వారిద్దరినీ ఒకే విధి కలుగును అని నేనెరిగితిని.
ప్రసంగి 1:18
ఎందుకనగా జ్ఞానము అధికమైనంత మాత్రమున బాధయు అధికమైయుండును; జ్ఞానము పెంపొందించువాడు దుఃఖమును పెంపొందించును.
ప్రసంగి 9:10
నీ చేయి చేయగలిగినది ఏదైనను అగ్రహస్తముతో చేయుము; నీవు పోవు పాతాళమందు కార్యమును ఆలోచనను జ్ఞానమును బుద్ధిని చేయలేవు.
ఎరుక – చైతన్యం, నిజమైన అవగాహన
Awareness – Consciousness, true understanding
జీవితం వర్తమానంలో ప్రతిత్య సముత్పదం (Dependent Origination) పై ఆధారపడి ఉంటుంది; ఏదీ స్వతంత్రంగా ఉండదు, అన్ని విషయాలు కారణ-ఫల సంబంధాలతో బంధించబడ్డాయి.
Life in the present is based on Pratītyasamutpāda (Dependent Origination), meaning nothing exists independently; everything is interconnected through cause and effect.
సాధన: జీవితంలో దుఃఖం అనివార్యం. దానికి మూలం "తృష్ణ".
Suffering (dukkha) is inevitable in life. Its root is desire (tṛṣṇā).
Way / మార్గం: మధ్యమార్గాన్ని అనుసరించి ధ్యానాన్ని బోధించాడు.
Awareness / ఎరుక: అనిత్యత (Impermanence) మరియు ఆత్మలేనితనం (Non-self)ను గ్రహించడం.
“నిన్ను నీవు తెలుసుకో” అంటే, మన అంతర్మనస్సును పరిశీలించి నిజాన్ని గ్రహించాలి.
"Know thyself" means to examine your inner self and realize the truth.
నిజమైన జ్ఞానం అంటే “తనకి తెలియదని తెలుసుకోవడం”.
True wisdom is knowing that you know nothing.
Way / మార్గం: ప్రశ్నల సంభాషణ ద్వారా బోధన (Dialogues and questioning).
Awareness / ఎరుక: ఆత్మపరిశీలన (Self-examination) ద్వారా జీవితం యొక్క అర్థాన్ని గ్రహించడం.
“ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు; వీరిని క్షమించుము.”
ఇది Jesus Christ సిలువపై వేయబడుతున్నప్పుడు చెప్పిన క్షమాభావ వాక్యంగా Bible లో ప్రసిద్ధి చెందింది.
అర్థం:
తనను హింసించిన వారిపైనా ద్వేషం చూపలేదు.
అజ్ఞానం వల్ల చేస్తున్నారు అని భావించాడు.
క్షమ, దయ, ప్రేమకు ఇది గొప్ప ఉదాహరణ.
Love, forgiveness, and service are the essence of life.
Way / మార్గం: ఉపమానాల ద్వారా బోధించి, తానే మాదిరిగా జీవించాడు.
Awareness / ఎరుక: సేవే దైవం – ఇతరులకు సేవ చేయడమే ఆధ్యాత్మికత (To serve others is divine).
మనసులో కనిపించని అవచేతన శక్తులు మన ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి.
The unconscious mind deeply influences our behavior.
Way / మార్గం: మానసిక విశ్లేషణ (Psychoanalysis) ద్వారా దాగిన భావాలను వెలికితీశాడు.
Awareness / ఎరుక: దాగిన భావాలను తెలుసుకోవడం వల్ల మానసిక స్పష్టత (Mental clarity) వస్తుంది.
సమాజాన్ని ప్రపంచాన్ని ఎలా చూడాలో, మూఢనమ్మకాల మీద విమర్శలు చేసి ప్రజలలో చైతన్యం కలిగించాడు. సమాజాన్ని మేల్కొల్పాడు.
He criticized blind beliefs and awakened social awareness.
Way / మార్గం: సరళమైన పద్యాల (Simple poems) ద్వారా మేల్కొలిపాడు.
Awareness / ఎరుక: సత్యం, సరళతే అంతర్ముఖ స్పష్టతకు మార్గం (Truth and simplicity lead to inner clarity).
ఈ తాత్వికులు ఎరుకను కేవలం ఆలోచనల ద్వారా కాదు – జీవితాన్ని నిజంగా అనుభవించి, జీవిస్తూ సాధించారు.
These philosophers achieved awareness not just through thought, but by living it fully.
సోక్రటీసు గురించి కచ్చితమైన సమాచారాన్ని రాబట్టడంలో పండితులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్నే సోక్రటిక్ సమస్య అంటారు. సోక్రటీసు గురించి సమాచారాన్ని జెనోఫోన్, ప్లేటో, అరిస్టాటిల్, అరిస్టోఫేన్స్ రచనల ఆధారంగా సేకరిస్తున్నారు. కానీ ఈ రచనలు చాలా కళాత్మకమైనవై, తత్వశాస్త్ర భావనలతో కూడుకొని ఉండడం వలన వీటిని అర్థం చేసుకోవడానికి పండితులకు మంచి సృజనాత్మకత, ఊహాశక్తి అవసరమౌతున్నాయి.
సోక్రటీస్ స్వయంగా ఎలాంటి గ్రంథాలు రాయలేదు. అందువల్ల అతని శిష్యులు, సమకాలీనులు రాసిన రచనలే ప్రధాన ఆధారాలు.
సోక్రటీస్ మరణించిన వెంటనే అతని సర్కిల్లోని అనేక మంది సభ్యులు అతని జ్ఞాపకాలను కాపాడటానికి రచనలు చేశారు. అతని సంభాషణల్లో పాల్గొన్న వ్యక్తులు, అనుచరులు, ప్రముఖ రాజకీయ నాయకులు, ఆలోచనాపరులు ఈ రచనల్లో కనిపిస్తారు. ఈ రచనలను తరువాత కాలంలో సోక్రటిక్ డైలాగ్స్ అని పిలిచారు.
యాంటిస్తనీస్, ఎస్కైన్స్, ఫేడో, యూక్లిడెస్ రచనలు ఎక్కువగా లభించలేదు. కాని ప్లేటో మరియు జెనోఫోన్ రచనలు పూర్తిగా మనుగడలో ఉన్నాయి. అందువల్ల సోక్రటీస్ గురించి మనకు తెలిసిన జ్ఞానం ప్రధానంగా వీరి రచనలపై ఆధారపడి ఉంది.
సోక్రటీస్ తత్వశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులలో ఒకడు. ఆయన బోధనలు ముఖ్యంగా సోక్రటిక్ పద్ధతి ద్వారా ప్రసిద్ధి చెందాయి. ఈ పద్ధతి ప్రశ్నలు అడగడం ద్వారా జ్ఞానాన్ని ఆవిష్కరించే మార్గం.
సోక్రటీస్ తన పూర్తి అజ్ఞానాన్ని ప్రకటించడానికి ప్రసిద్ధి చెందాడు. తాను తన అజ్ఞానం గురించి మాత్రమే తెలుసునని చెప్పేవాడు. మన అజ్ఞానాన్ని గ్రహించడం తత్వశాస్త్రంలో మొదటి మెట్టు అని సూచించాడు.
సోక్రటీస్ పాశ్చాత్య తత్వానికి పునాది వేశాడు. నైతికత, తర్కం, విమర్శనాత్మక ఆలోచన, మానవ సంబంధాల అభివృద్ధిలో అతని ఆలోచనలు గొప్ప మార్గదర్శకత్వం చేశాయి.
CONCEPT: Development of Human Relations and Human Resources
అతను ఓడిపోయాడు చనిపొయాడు క్రీస్తు కి పూర్వమే పుట్టాడు గిట్టాడు . కానీ అతని పేరు చెప్తే దోపిడీదారులందరికీ బెదురు. ఎందుకా ? వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు . కానీ ఆజనాలు ఉగ్రనరసింహులుగా మారి విజృంభించగలరన్న సత్యాన్ని చరిత్రలో మొదటిసారిగా చెప్పినవాడు స్పోర్టకస్.(రాచకొండ విశ్వనాధశాస్త్రి)
స్పార్టకస్ జీవితానికి సంబంధించిన ప్రధాన వృత్తాంతాలు ప్లూటార్క్ మరియు అప్పియన్ రచనల ద్వారా లభించాయి.
ప్లూటార్క్ రచించిన క్రాసస్ జీవితం, అప్పియన్ రచించిన పౌర యుద్ధాలు బానిసల తిరుగుబాటుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను అందిస్తాయి.
అయితే ఇవన్నీ స్పార్టకస్ మరణం తర్వాత చాలా కాలానికి వ్రాయబడ్డాయి. సమకాలీన ప్రత్యక్ష ఆధారాలు లేవు.
స్పార్టకస్ థ్రేస్ ప్రాంతంలో (ప్రస్తుతం బల్గేరియా ప్రాంతం) స్ట్రైమోన్ నది సమీపంలో జన్మించినట్లు భావిస్తారు.
అతను మేడి తెగకు చెందినవాడై ఉండవచ్చని చరిత్రకారులు సూచిస్తారు.
బానిసగా మార్చబడే ముందు అతను రోమన్లకు సైనికుడిగా పనిచేసినట్లు సమాచారం.
క్రీ.పూ. 73లో కాపువా సమీపంలోని గ్లాడియేటర్ పాఠశాల నుండి సుమారు 70 మంది ఇతర గ్లాడియేటర్లతో కలిసి తప్పించుకున్నాడు.
ఇదే తిరుగుబాటుకు ఆరంభం.
చిన్న సమూహంగా మొదలైన ఈ బలగం తరువాత 70,000 మందికి పైగా పెరిగింది.
విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన అనుచరులకు అధికారిక శిక్షణ లేకపోయినా, స్పార్టకస్ ఒక సమర్థవంతమైన వ్యూహకర్తగా నిలిచాడు.
అతని దళాలు అనేక రోమన్ సైనిక విభాగాలను ఓడించాయి.
ఈ తిరుగుబాటు రోమన్ అధికారానికి పెద్ద సవాలుగా మారింది. దీనిని అణచివేయడానికి వరుసగా సైనిక దండయాత్రలు జరిగాయి.
చివరకు ఈ బాధ్యత మార్కస్ లిసినియస్ క్రాసస్కు అప్పగించబడింది.
క్రీ.పూ. 71లో స్పార్టకస్ సైన్యాలు ఓడిపోయాయి.
చివరి యుద్ధంలో స్పార్టకస్ మరణించినట్లు భావిస్తారు. కానీ అతని శరీరం ఎన్నడూ కనుగొనబడలేదు.
పట్టుబడిన 6,000 మంది తిరుగుబాటుదారులను అప్పియన్ వే మార్గంలో శిలువ వేశారు.
కొన్ని ఆధారాలు అతను ఇటలీ నుండి తప్పించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని చెబుతాయి.
మరికొన్ని ఆధారాలు అతను సామాజిక న్యాయం మరియు స్వేచ్ఛ కోసం పోరాడాడని సూచిస్తాయి.
స్పార్టకస్ పేరు ప్రతిఘటన, స్వేచ్ఛ, విప్లవానికి చిహ్నంగా నిలిచింది.
కార్ల్ మార్క్స్, టూసైంట్ లూవర్టూర్ వంటి వ్యక్తులపై అతని ప్రభావం ఉందని చెప్పబడుతుంది.
సాహిత్యం, టెలివిజన్, చలనచిత్రాలలో అతని కథ అనేకసార్లు చిత్రీకరించబడింది.
వోల్టేర్ మూడవ బానిస యుద్ధాన్ని “చరిత్రలో ఏకైక న్యాయమైన యుద్ధం”గా అభివర్ణించాడు.