అశ్వఘోషుని కాల నిర్ణయం
అశ్వఘోషుని బుద్ధచరితం క్రీ. శ. 5 వ శతాబ్దంలో 'ధర్మరక్షక' అనే భారతీయ బౌద్ధ పండితునిచే చైనా భాషలోనికి అనువదించబడింది.
దీనిని బట్టి అశ్వఘోషుడు సా.శ. 5 వ శతాబ్దానికి పూర్వమే వున్నవాడని తెలుస్తుంది.
చైనా Otherwise ప్రకారం అశ్వఘోషుడు కుషాణుల రాజైన కనిష్కుని ( క్రీ. శ. 75–150) సమకాలికుడు. చారిత్రిక స్పృహా గల చైనీయుల సంప్రదాయం సత్యమే అని పాశ్చాత్యులు అంగీకరిస్తున్నారు.
ఇ. హెచ్. జాన్సన్ ప్రకారం అశ్వఘోషుని కాలం క్రీ. పూ. 50 నుండి క్రీ. శ. 150 మధ్య ఉండవచ్చని భావించాడు. మధ్య ఆసియాలో లభించిన అశ్వఘోషుని సారిపుత్ర ప్రకరణం నాటకపు మూల సంస్కృత ప్రతి కుషాణుల కాలానికి (కనిష్కుడు లేదా హావిష్కుడు) చెందినదని ప్రముఖ జర్మన్ ప్రాచ్య పరిశోధకుడు, ఇండాలజిస్ట్ అయిన లూడర్స్ (Heinrich Lüders) పండితుడు నిర్ణయించాడు.
దీన్ని బట్టి అశ్వఘోషుడిని క్రీ. శ. 80-150 మధ్య కాలంలో జీవించిన కవిగా, కుషాణుల చక్రవర్తి కనిష్కుని సమకాలికునిగా నిర్ణయించారు.