2.It is available in continuous stream and is never absent
3.We are forced to spend it and once lost is lost for ever
4.Today never comes again.
5.There is no substitute for time.
6.It can not be stored or accumulated.
7.It is available all round the clock.
సంక్రాతి శుభాకాంక్షలు
గుంటూరు: కొండవీడు
ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. కొండవీడు కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షిత కట్టడంగా గుర్తించింది.[5]
కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.
కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ. సంఖ్య 1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త) ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. ఇది కొంత ఆక్రమణలకు లోనైంది. .
కొండవీడు కోట | |
---|---|
కట్టిన సంవత్సరం | 14 శతాబ్థం |
కట్టించింది | కొండవీడు రెడ్డిరాజులు |
వాడిన వస్తువులు | గ్రానైట్, రాతి, సున్నం |
Battles/wars | రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తానులు, ప్రెంచి రాజులు, బ్రిటీసు రాజులు |
మనిషి ఊహల్లో పుట్టిన భావన
గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకూ కాకతీయులు పరిపాలించేవారు. 1336లో ముసునూరి నాయకులు మహ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాను మహ్మద్ షా కు అప్పగించాడు. అప్పటి నుంచి 1512 వరకూ బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తరువాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది.
కుతుబ్ షాహీ వంశస్తులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, ఒర్లఫ్, హోప్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల-కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులగా మార్చింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమయ్యింది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంత మేర నాశనం చేశాడు.
బ్రాహ్మీ లిపి
ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ అశోకుని శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల శ్రీలంక, తమిళనాడులలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్, థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.
***
బొమ్మల లిపి
సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని 1853లో కనుగొన్నారు. ఇది స్వదేశీ లిపి. దీన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక వరుసను ఎడమ నుంచి కుడికి, తర్వాత వరుసను కుడి నుంచి ఎడమకు రాసేవారు. ఈ విధానాన్ని ‘సర్పలేఖనం’ అంటారు. ఇది మెసపటోమియా, ఈజిప్ట్ దేశాల ప్రాచీన లిపిని పోలి ఉంది.
సింధూ నాగరికత లేదా హరప్పా నాగరికతను క్రీ.శ.1921లో కనుగొన్నారు. ఆనాటి పురావస్తు శాఖ అధిపతి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో ఈ నాగరికత గురించి తెలుసుకోవడానికి తవ్వకాలు జరిగాయి. మనదేశంలో ఈ నాగరికత ఆనవాళ్లు లభించే ప్రాంతాలు ఎక్కువగా గుజరాత్లో ఉన్నాయి. క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు సింధూ నాగరికత విరాజిల్లింది. క్రీ.పూ. 2500 నుంచి క్రీ.పూ.1750 వరకు ఈ నాగరికత ఉన్నత దశలో ఉంది. హరప్పా నాగరికతకు కేంద్రస్థానం సింధూ నది. సింధు ప్రజలు కాంస్య యుగానికి చెందినవారు. వీరిది పట్టణ నాగరికత. ఈ కాలంలోనే తొలి నగరీకరణ జరిగింది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉత్తరాన జమ్మూ నుంచి దక్షిణాన నర్మద వరకూ, పశ్చిమాన బెలూచిస్థాన్ కోస్ట్లోని మాక్రాన్ నుంచి ఈశాన్యంలో మీరట్ వరకు వ్యాపించి ఉంది. ఆ కాలంలో ప్రపంచంలో ఏ నాగరికతా ఇంత పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి లేదు. తవ్వకాల్లో మొదట బయటపడిన నగరం హరప్పా. పలు ధాన్యాగారాల ఉనికి కూడా హరప్పాలోనే లభ్యమైంది. హరప్పా సంస్కృతికి చెందిన కాళీభంగన్ రాజస్థాన్లో ఉంది. మొహంజొదారో, చన్హుదారో, బన్వాలీ, లోథాల్.. నాటి ఇతర ప్రసిద్ధ నగరాలు. మొహంజొదారో అతి పెద్ద పట్టణం. మత, కర్మకాండలకు ఉపయోగించిన అద్భుత స్నానఘట్టం, పెద్ద ధాన్యాగారం, గుర్రాల ఉనికి తెలియజేసే అస్పష్టమైన సాక్ష్యాధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి.
నిర్మాణ శైలి
ప్రజలు కాల్చిన ఇటుకలతో ఇళ్లను నిర్మించుకున్నారు. పాలక వర్గాల భవనాలకు విశేష రక్షణ కల్పిస్తూ గోడలు నిర్మించారు. దిగువన సామాన్యుల గృహాలు ఉండేవి. సామాన్యుల ఇళ్లు రెండు గదులు, సంపన్నుల ఇళ్లు ఐదారు గదులతో విశాలంగా ఉండేవి. ప్రతి ఇంటికీ బావి, పెద్ద ఇళ్లకు మరుగుదొడ్లు ఉండేవి. అద్భుతమైన భూగర్భ డ్రైనేజీ ఉంది. మురుగు కాల్వలపై ఇటుకలను కప్పి ఉంచేవారు. ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను సింధూ నాగరికత ప్రత్యేకతగా చెప్పవచ్చు. లోథాల్ పట్టణాన్ని ఇటుకలతో కృత్రిమంగా నిర్మించారు. సింధూ ప్రజలు స్నానప్రియులు. అందుకే మొహంజొదారోలో మహాస్నానవాటికను నిర్మించారు. ఇది ఇటుకలతో రూపుదిద్దుకుంది. 180 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు కలిగి 8 అడుగుల లోతులో ఇది నిర్మితమైంది. స్నానవాటిక అడుగుభాగం నీరు ఇంకిపోకుండా జిప్సమ్ - బిటూమెస్ పదార్థాలతో నిర్మించారు. హరప్పాలో అతిపెద్ద ధాన్యాగారాన్ని నిర్మించారు. దశాంశ పద్ధతిని కొలతలకు ఉపయోగించారు. ‘ఇంగ్లిఘ బాండ్’ అని పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టిందీ వీరే.
వ్యవసాయం
సింధు ప్రజలకు నాగలి తెలియదు. భూములను దున్నకుండా తవ్వేవారు. దీని కోసం తేలికపాటి గొర్రును ఉపయోగించేవారు. వ్యవసాయం కోసం నీటిని నిల్వ చేయడానికి గబర్ బంద్ల (డ్యామ్లు) నిర్మించారు. నాడు ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి పండించినట్లు లోథాల్, రంగాపూర్ల్లో ఆధారాలు లభించాయి. తివాచీల తయారీకి పత్తిని ముఖ్యంగా ఉపయోగించారు. దీన్ని బట్టి వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని తెలుస్తోంది.
మత విశ్వాసాలు
సింధూ ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని అంటే శక్తిని ఆరాధించేవారు. పశుపతి అనే పురుష దేవుడిని కూడా కొలిచేవారు. పశుపతిని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉండేవి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, సర్పాలను కూడా పూజించేవారు. మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదాల ఆధారంగా శివారాధన, శక్తి పూజ, లింగారాధన వంటివి సింధూ నాగరికత వారసత్వాలుగా చెప్పుకోవచ్చు.
News:Lok Sabha Passes Women's Reservation Bill With 454-2 Majority-(20-9-23)
తథాగత బుద్ధుడు తన మొత్తం జీవితంలో 84,000 బోధనలు చేశారు.ఈ బోధనల జ్ఞాపకార్థం, చక్రవర్తి అశోకుడు 84,000 బౌద్ధ స్థూపాలను నిర్మించారు. తథాగత బుద్ధుని ధర్మ ప్రబోధాన్ని "ధమ్మసుత్త" అని కూడా అంటారు. ధమ్మసుత్త లేదా ధమ్మ స్థూపాలను రక్షించడం బౌద్ధుల పురాతన సంప్రదాయం. త్రిపిటకం వంటి బౌద్ధ గ్రంథాల ద్వారా తథాగత బుద్ధుని 84,000 ధర్మ సూత్రాలు సజీవంగా ఉంచబడ్డాయి. అంటే,ధమ్మ సూత్రాలు రక్షించబడ్డాయి, దీనిని "రఖా సుత్త దినం" అంటారు. ధమ్మ సూత్రాలు భద్రపరచబడిన రోజు సావన్ మాస పౌర్ణమి. బౌద్ధ సాహిత్యంలో ఈ రోజును "ధమ్మ సంగీతి" అని పిలుస్తారు. ప్రస్తుతం, "రక్షా బంధన్" అనే పండుగ ప్రతి సంవత్సరం సావన్ మాసం పౌర్ణమి రోజున వస్తుంది. అంటే రక్షా బంధన్ అనేది రక్కా సుత్త రోజు యొక్క వక్రీకరించిన రూపం.*
*భగవాన్ బుద్ధుని మహాపరినిర్వాణం తరువాత,బుద్ధుని శిష్యులు బుద్ధుని బోధనలైన 84 వేల సూత్రాలను సంకలనం చేసి, భద్రపరిచారు.బుద్ధుని మహాపరినిర్వాణం తరువాత భిక్ఖు సంఘంలో చేరిన సుబద్ధ భిక్షువు బుద్ధుని కఠిన నియమాలను ఆచరించకుండా, ఎవరికి నచ్చిన విధంగా వారు నడుచుకోవచ్చంటూ ,బుద్ధుడు విధించిన భిక్షువులు యొక్క కఠిన నియమాలను అంగీకరించలేదు.దీంతో సీనియర్ భిక్షువులు ఆందోళన వ్యక్తం చేశారు.45 సంవత్సరాలు పాటు బుద్ధుడు ఆచరించి,బోధించిన బోధనలు కేవలం స్మృతితోనే ముందుకు సాగుతున్నాయి. ఇలా మనం భిక్ఖు సంఘ నియమాలను ఉల్లంఘించినచో బుద్ధుని ధమ్మానికి నష్టం కలుగుతుంది అని సీనియర్ భిక్షువులు అంటారు.*
*బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత మూడు నెలల తరువాత,బుద్ధుని అనుచరుడు మగధ చక్రవర్తి అజాత శత్రు రాజగృహ పర్వతంలోని భారీ సప్త పర్ణి గుహలో మొదటి బౌద్ధ సంగీతి(సంగయాన,సమావేశం)ఏర్పాటు చేశారు. ఈ సంగీతిలో సుమారు 500 మంది సీనియర్ భిక్షువులు పాల్గొన్నారు. ఈ మొదటి బౌద్ధ సంగీతికి మహాకశ్యప్ అధ్యక్షత వహించారు.*
*ఈ మొదటి బౌద్ధ సంగీతికు బౌద్ధ ఉపాసకులు(గృహస్తులు) ,భిక్షువులు కలిసి వినయ(క్రమశిక్షణ) నియమాలను రూపొందించడానికి అరహంత భిక్ఖు ఉపాలిను అధిపతిగా ఎన్నుకున్నారు.ఉపాలి వినయ ధర్మానికి ఆధారం.*
*అరహంత ఆనంద్ భిక్ఖు బుద్ధుని బోధనలు యొక్క అన్ని సూత్రాలను జ్ఞాపకం చేసుకొన్నారు. ఈ మొదటి బౌద్ధ సంగీతిలో ఉపాలి వినయ.పిటకమును, ఆనందుడు సుత్త పిటకమును వ్రాసి సంకలనం చేసి, భద్రపరిచారు. ఆ తరువాత అభిధమ్మ పిటకమును తయారు చేశారు.*
*సుమారు ఏడు నెలల పాటు ఈ బౌద్ధ మొదటి సంగీతి జరిగింది. ఈ సంగీతి శ్రావణ పౌర్ణమి నాడు ప్రారంభమైంది. బౌద్ధ చరిత్రలో. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.పాళీ భాషలోని మొదటి త్రిపిటకము ఈ శ్రావణ పౌర్ణమి రోజున తయారు చేయబడింది.*
*భగవాన్ బుద్ధుని బోధనలలోని సూత్రాలు మానవ సంక్షేమానికి ఉపకరిస్తాయి. వర్షాకాలంలో భిక్షువులు చుట్టుపక్కల ఉన్న గృహస్తులకు బుద్ధ ధర్మాన్ని బోధిస్తారు.భిక్షువులు సుత్తాలు పఠిస్తారు.ఆ తరువాత నూతనంగా ధమ్మంలోకి వస్తున్న వారికి తెల్లటి దారాన్ని ఇస్తారు.ఈ దారాన్ని మెడలో కూడా వేసుకొనే వారు.ఆ తరువాత చేతికి కూడా కట్టడం మొదలు పెట్టారు.*
**శతాబ్దాల తరువాత మనదేశంలో బౌద్ధ ధమ్మం కనుమరుగు అయ్యేలా కొందరు దోపిడీ శక్తులు చేయడంతో ధమ్మం యొక్క అసలు స్వరూపం కోల్పోయాం.ఆనాటి బౌద్ధుల సాంప్రదాయం మైత్రీ దారం ఈనాడు రూపం మారిపోయింది. రక్షాబంధన్ పేరుతో ఆర్యీకరణ జరిగి,సంస్కృతీ కరణ చెందింది. అది వినిమయ సంస్కృతిలో భాగం అయింది.మార్కెట్ అవసరాల కోసంg ఈ రక్షాబంధన్ పేరుతో అన్నాచెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా అంటూ ఒక కథ అల్లారు.*
*శ్రావణ పౌర్ణమి బౌద్ధుల పండుగ.శ్రావణ పౌర్ణమి నుండి శ్రవణం అనే మాట.వచ్చింది. శ్రావణం అనగా బుద్ధుని ధమ్మ సూత్రాలు వినడం అని అర్థం.*
*క్రీ.పూ.400 లో అజాత శత్రువు కాలంలో మొదటి బౌద్ధ సంగీతి మహాకాశ్యపుడు అధ్యక్షతన రాజగృహలో జరిగింది.*
*రెండో బౌద్ధ సంగీతి క్రీ.పూ.383 కాలాశోకుడి కాలంలో వైశాలిలో సబకామి అధ్యక్షతన జరిగింది.*
*మూడో బౌద్ధ సంగీతి క్రీ.పూ.250 లో అశోకుని కాలంలో పాటలీపుత్రంలో మొగ్గలిపుత్త తిస్స అధ్యక్షతన జరిగింది.*
*నాలుగో బౌద్ధ సంగీతి క్రీ.శ.72 లో కనిష్కుడి కాలంలో జరిగింది. కాశ్మీర్ /కుందన వనంలో వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది.*
*ఐదో బౌద్ధ సంగీతి క్రీ.శ.1871 లో మయన్మార్ లోని మాండలే లో జరిగింది. ఈనాడు దీనిని బర్మా అని పిలుస్తున్నారు.బర్మా రాజు మిండన్ ఆధ్వర్యంలో ఈ సంగీతి జరిగింది.*
*ఆరో బౌద్ధ సంగతి 1954 లో బర్మాలోని రంగూన్ లో జరిగింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ సంగీతి లో పాల్గొన్నారు.*
*నమో బుద్ధాయ*
*(ఎం.ఎల్.పరిహర్ హిందీలో ఫేస్బుక్ లో వ్రాసిన పోస్టు స్ఫూర్తితో వ్రాసిన పోస్టు ఇది.)*
*✍️అరియ నాగసేన బోధి*
*భవతు సబ్బ మంగలమ్*
ఏ రాతి ప్రతిమవో
ప్రాణం నింపుకొని
నాదరికి చేరావు
నా హృది వీణ మీటి
నా బ్రతుకు లో
సరాగాలు పలికించావు
వెనుదిరిగి చూచేలోగా
ప్రతిమగా మారావు
జీవితం క్షణ భంగురం
By Ch రామమోహన్
***
అమ్మ వళ్లో నేను కళ్లు తెరిచేటప్పటికి అడవి నిండా పాలపూల సుగంధం
పూసిన కొండమామిడి కొమ్మలమీద అడవికోయిలలు పాటలు పాడేవి,
భూమి కోసం ఆకాశం నుంచి నిత్యం శుభవార్తలు వర్షించేవి
ఆదివాసి యువతుల ఆటల్తో ఊరు గలగల్లాడేది
అమ్మ నాకొక్కటే అన్నం ముద్ద పెట్టినప్పుడల్లా ఆకలి రుచి తెలిసేది,
పొదుగుల్లో పొంగుతున్న క్షీరధారలు తాము తాగి లేగలు నాకు కొంతమిగిల్చేవి
నేను ఆడుకోవడం కోసం సూర్యుడు దారిపొడుగునా వెలుతురు పరిచేవాడు,
వెన్నెలపందిరి మీద సన్నజాజులు పూచినట్టు తారకలుదయించేవి
నా కోసం ప్రతి అరుగు మీదా ఆ ఊరు ఆహ్వాన పత్రిక రాసి ఉంచేది,
నా కోసం శుభాకాంక్షల్తో ప్రతి ఇంటి కిటికీ తెరిచి ఉండేది
వాకిట్లో రాధామనోహరాలు నా కోసం మరికొన్ని మకరందాల్ని మనసున నింపుకునేవి
ఎడ్లమెడల్లో గంటల సవ్వడి నేను వినాలని రాత్రులు బళ్లు నడక తగ్గించేవి,
అడవి ఎప్పటికప్పుడు నా కోసం కొత్త వస్త్రాల్ని ధరించేది.
నా కళ్ల ముందు రంగులు పోస్తూ పూలు పూసేవి
ఊరంతా నా కోసం పిల్లల బొమ్మల కొలువు,
ఏ దేశాల్నుంచో ప్రతి పండక్కీ గంగిరెద్దులొచ్చేవి
జక్కుల వాళ్లు నాట్యం చేసేవారు,
ఊరి వెలుపల జాగరాలమ్మ సంధ్యా దీపం వెలిగించుకుని నను రమ్మనేది
అడవి, ఏరు, పొలం, పాట, వెన్నెల వూటల సాక్షిగా
మేం పీటని పల్లకి చేసి బొమ్మలకి పెళ్లి చేసాం
ఉత్తుత్తి వంటలతో బాల్యకాల సఖి ఎవరో
నాకు అన్నం వండి చెలిమిని వడ్డించేది.
నన్నెవరు ప్రేమించినా ఆ ఊరికి తీసుకుపోదామనిపిస్తుంది
నా చెలిమినెవరు కోరినా ఆ లోకానికెగరాలనిపిస్తుంది
(పునర్యానం:1-1-1) (vadrevu chinaveerabhadrudu)సౌజన్యంతో
కవిత్వం లోతులు
వియోగినీ అవస్థ (కవయిత్రి )శీల భట్టారిక
ప్రియ విరహితస్యాయ హృది చింతాసమాగతా
ఇతి మత్వా గతా నిద్రా కే కృతఘ్నముపాసతే.
(ప్రియుడినుంచి దూరంగా ఉన్నప్పుడు అతడి తలపు మదిలో మెదిలిందో లేదో నిద్ర కూడా వదిలిపెట్టేసింది. కృతఘ్నుల్ని ఎవరు మటుకు ఆరాధిస్తారు గనుక?)
No comments:
Post a Comment