CONCEPT
బాలుర నైతిక శారీరక శిక్షణా శిబిరం
వస్తు భావ పరంపర భావన . ఈ భావన, ప్రగతికి మూలం . అజ్ఞానమే శత్రువు. జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం . ఈచిరుప్రయత్నాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ రామమోహన్ చింతా (development of human relations and human resources)
CONCEPT
బాలుర నైతిక శారీరక శిక్షణా శిబిరం
Obesity is a chronic, but treatable, disease associated with excess weight. For people living with obesity, there is more to weight management than just the pounds we can see.
People with a body mass index (BMI) greater than or equal to 30 are usually considered to have obesity. Obesity can have a negative impact on your health. But there’s good news: weight loss may improve some weight-related conditions.
Knowing your BMI is a great first step when starting the conversation about weight management with a health care provider
CONCEPT ( development of human relations and human resources )
|
పలుకుబడి అంటే ఒకప్రాంతo లోని యాసలో ఉపయోగించే పదం,నుడికారం అంటేఒకప్రాంత ప్రజల అనుభవం నుండి పుట్టిన మాట చమత్కారం,విసేష పదం.జాతియం అంటే ఒకమాట ప్రత్యేక అర్త్దంలో ఉపయోగించడం అన్నమాట.
చెప్పదలుచుకున్న భావాన్ని మనసుకు హత్తుకొనే విధంగా చెప్పడానికి మనం "నుడికారాలు ప్రయోగిస్తాం. "జాతీయం అంటే విశిష్ట పద బంధం.భాష కేవలం భావ వ్యక్తీకరణ కే కాక మనోరంజన సాధనంగా మార్చినపుడు అది కళగా మారుతుంది.ఆవిధంగా భాష కళగా మారాలంటే అది సాధారణంగా కాక చమత్కారంగా,నిగుడార్ధం వచ్చేటట్లు ఉండాలి.అలా ఉండడానికి దోహదం చేసే అంశాలే పలుకుబళ్ళు,నుడికారాలు,జాతీయాలు.ఇవన్ని భాషకు మాత్రమే సాధ్యం.అందుకే అవి భాషకు అలంకారాల వలె ,ఏంతో సొగసును యిస్తాయి.
దెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున(మనస్సున)
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,(నీటి )
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?
తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
అనే మకుటంతో అంతమవుతాయి.*
***
మానవాళిని పునరుద్ధరించే అంశాలు ." “మన ఆలోచనల ద్వారా మనం రూపుదిద్దుకున్నాం; మనం అనుకున్నట్లు అవుతాము. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది. "గతం ఇప్పటికే పోయింది, భవిష్యత్తు ఇంకా ఇక్కడ లేదు.-గౌతమ్ బుద్ధ
భావజాలం మనిషిని నడిపిస్తుంది మనం మన భావజాలాకానికి లోబడి నడుస్తుంటాం (భావజాలం గతి తార్కికం). భావజాలాన్ని నవీకరించుకోవాలి ( update చేసుకోవాలి ) మనం విజేతలం కావాలంటే మన భావజాలాన్ని తదనుగుణంగా మార్పు చేసుకోవాలి.
మన ప్రగతి మన విజయం మన భావజాలం మీద ఆధారపడి ఉంటుంది
సరైన దృక్కోణం,మానసికపరివర్తన, భావజాల మార్పు ద్వారా మనం అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.
నేర్చి నడతునన్న నేరమి తావచ్చు
ఓర్చి నడతు నన్న ఓర్పు రాదు
కూర్చి నడతు నన్న కూడంగ నియ్యదు
విశ్వదాభిరామ వినురవేమ
నాకంతా తెలుసు అని పని మొదలు పెట్టేవాడు క్రమంగా తన తెలియని తనాన్ని తెలుసుకుంటాడు
సహనశీలి చిరాకు పడవచ్చు
పెద్దనిర్వాహకుడ్ని అనుకొన్న వాడికి కూడ అపజయం ఎదురవుతుంది
క్రియాశీలి కార్యక్రమ విధానంలో ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవాలి-వేమన
.ఆర్థిక సమస్య : Money does'nt matter. ప్రయత్నం చేస్తే వయస్సుతో పనిలేకుండా సంపాదించవచ్చు. Time is money. ఇప్పుడు Information is money. మనం సమాచారం యుగంలో ఉన్నాము. (ఆనందానికి డబ్బుకు సంబంధం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నా ఆనందంగా లేనివాళ్లు ఉన్నారు. మనం ప్రకృతిని ప్రేమించాలి. సమాజాన్ని ప్రేమించాలి అక్కడే మనం ఆనందం వుంది. ముందు మనం మానసికంగా మార్పు పొందితేనే ఆనందాన్ని పొందుతాం ) (ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసిక శిక్షణ చాలా అవసరం ) మనం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతాం.ఆర్థికంగా ఎదగాలి . అనేక మార్గాలలో ఆర్థిక అభివృద్ధి కై వెతకాలి ఉదాహరణ 1. ఉద్యోగం a) ప్రభత్వ b ) ప్రైవేటు 2. వ్యాపారం మనం ఏ ఒక్కరంగానికి పరిమితం కాకూడదు.మనం కొన్ని రంగాలకు పరిమితమనే భావన సరియైనది కాదు.
(యద్భావం తత్భవతి : గీత )
మనము మనస్సులో ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది
( విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది.(బైబిల్ మార్కు 11: 23)
నీ సక్సెస్ కు అవకాశాలు నువ్వే క్రియేట్ చేసుకో
పతనానికి పదిహేడు మార్గాలు
1. బాధ్యతా రాహిత్య స్వేచ్ఛ
2. అనాలోచిత క్రియలు
3. పర నింద
4. ఆత్మనింద
5. మూఢ ప్రేమ
6. ఆరోగ్యం పై శ్రద్ధ లేకపోవడం
7. శారీరక శ్రమ లేకపోవడం
8.పొదుపు నేర్వకపోవడం
9. ఇతరులను గ్రుడ్డి గా నమ్మడం
10. ఇతరులమీద ఆధార పడటం
11. స్వంతభావాలు లేకపోవడం
12. ఇతరుల (సలహాల) పై ఆధారపడటం
13. మన జీవితానికి మనమే బాధ్యత వహించకపోవడం
14. అనాలోచిత వ్యయాలు
15. అయాచిత ఆదాయాలకై పాకులాడటం
16. ప్రయత్న లోపం
17.అవకాశాలు లేవనే భావన
ప్రపంచంలో నిత్య సంతోషి గాని నిరంతర దుఃఖజీవి గాని ఉండజాలడు కరుణారస ప్రధానమైన ధర్మం జీవనాన్ని కోరుకోవడం అందరకు అవసరం -బుద్ధుడు
ధ్యానంమనసుకేంద్రీకరించడంఆలోచనలని నియంత్రించడంప్రపంచం. నుండి మనలను వేరుచేసుకోవడంఅంతః సాక్షత్కారం.శారీరక మానసిక ఆరోగ్యాన్నపొందవచ్చు
చైత్ర మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
వైశాఖ మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
జ్యేష్ట మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -- ఉత్తరాయణం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
భాద్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
కార్తీక మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు
పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు
మాఘ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు
రాగి ఖనిజాలకు కూడా చాలా గొప్ప మూలం. ఇది ఇతర తృణధాన్యాలలో కనిపించే కాల్షియం కంటెంట్ కంటే 5-30 రెట్లు మధ్య ఉన్నట్లు కనుగొనబడింది. ఇందులో ఫాస్పరస్, పొటాషియం మరియు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఎముక సాంద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాల్షియం ఒక ముఖ్యమైన భాగం. అందువల్ల, ఫింగర్ మిల్లెట్ ఓవర్-ది-కౌంటర్ సప్లిమెంట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది, ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి లేదా తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిల ప్రమాదం ఉన్న వ్యక్తులకు.
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడెమీస్ ప్రచురించిన “ది లాస్ట్ క్రాప్స్ ఆఫ్ ఆఫ్రికా” అనే అధ్యయనం ఫింగర్ మిల్లెట్ను సంభావ్య “సూపర్ సెరియల్”గా చూస్తుంది మరియు “ ఫింగర్ మిల్లెట్ పట్ల ప్రపంచం యొక్క వైఖరిని తిప్పికొట్టాలి . అన్ని ప్రధాన తృణధాన్యాలలో, ఈ పంట అత్యంత పోషకమైనది." ఉగాండా మరియు దక్షిణ సూడాన్లోని ప్రజలు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసినప్పటికీ ఆరోగ్యకరమైన, స్ట్రాపింగ్ ఫిజిక్లను కలిగి ఉంటారని అధ్యయనం పేర్కొంది మధుమేహం, క్యాన్సర్, బోలు ఎముకల వ్యాధి మరియు మరెన్నో నియంత్రించడంలో సహాయపడే అద్భుతమైన “సూపర్ సెరియల్” గురించి చూద్దాం.
మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచెయుంచుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం
*యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మొదటి మాట*
✅ *క్షమాపణ*
*తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను."* లూకా 23:34
ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
•సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గొల్గొతాలో ముగియనుంది.
•39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
• వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
• ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
•గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
•కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
• ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
• ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న మొదటిమాట.
"తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".
యేసు ప్రభువు వారు ఏమి భోధించారో? దానిని తప్పకుండా చేసి చూపించారు. తాను చెయ్యడానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44
ఆయన భోధించినట్లుగానే,
•శత్రువులను ప్రేమించాడు.
•ఆయనను హింసించే వారికొరకు ప్రార్ధించాడు. "తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".
ఈ మాట వింటుంటే? శరీరం జలదరిస్తుంది. కాని ఆ దినాన్న బండలుగా మారిన ఆ రాతి హృదయాలు చలించలేదు. స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికేమాత్రమూ తీసిపోలేదు. అనుక్షణమూ ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాము. అయినప్పటీ, నేటికినీ నీ గురించి, నాగురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే వున్నాడు. ''వీరిని క్షమించమని" అట్లా అని, మార్పు లేకుండా ఇట్లానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులవుదామా? ఆయన దేవుడు కాబట్టి అట్లా చెయ్యగలిగాడు. నా వల్ల కాదులేనని నీకు నీవే సర్దిచెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. యేసు ప్రభువు అడుగు జాడల్లో నడచిన స్తెఫెను కూడా మరణ సమయాన్న కూడా ఆయనను అనుసరించ గలిగాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. అపో.. 7:59,60
గ్లాడిస్ తనభర్త గ్రాహం స్టెయిన్స్ ను, తన ఇద్దరి కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి వారిని దేవుని దగ్గరకు నడిపించ గలిగింది.
క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి.
ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్ర పరచబడదాం! ఆయన సమరూపంలోనికి మార్చబడదాం!
ఆయన వలే, మన శత్రువులను సహితం క్షమిద్దాం! వారి కొరకు ప్రార్ధిద్దాం!
*యేసు ప్రభువు వారు సిలువలో పలికిన రెండవ మాట*
✅ *అభయం*
*నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43*
ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించు కోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా వున్నారంటే? అతడు. "ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే".
యేసుప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చింది. ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందరచేసింది. ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చెయ్యక "యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము". అంటూ అర్ధిస్తున్నాడు. అది అతని పెదవుల నుండి వచ్చిన మాటకాదు. అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలివస్తున్న ఆవేధన. కారణం? అతనికి రెండు విషయాలు అర్ధమయ్యాయి.
1. ఆయన రాజు
2. ఆయనకొక రాజ్యముంది.
అది శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో నేను కూడా వుండాలని.
యేసు ప్రభువువారు ఆదొంగ యొక్క గతచరిత్రను ఎత్తి చూపలేదు. తర్వాత నీగురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు.
అతని హృదయంలో నుండి పెల్లుబుకుతున్న పశ్చాత్తాపాన్ని గ్రహించిన ప్రభువువారు "నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను."
అని అభయమిచ్చారు. నీవు నాతో వుండే అవకాశం వుంది అనడం లేదు. "నిశ్చయం". ఇది ఎవ్వరూ మార్చలేని తిరుగులేని సత్యం. ఒక్క చిన్నమాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పంధించాడు. ఆ ప్రతిస్పందన అతనిని పరదైసుకు చేర్చింది. సంవత్సరాల తరబడి, గంటలకొద్దీ వాక్యం వింటున్నామే? మన రాతి హృదయాలు మాత్రం స్పందించుట లేదు. ఆయన ఒక రాజు, ఆయనది శాశ్వత రాజ్యం అనే గ్రహింపులేదు. సరికదా, ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? ప్రభు రాత్రి భోజనం లో పాలుపొందలేదు కదా? నేనెందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు ప్రభు రాత్రి భోజనం ఆచరించాలి? ఆ దొంగ ప్రార్ధించినప్పుడు అతడు పరదైసుకు చేరాడు కదా? ప్రార్ధిస్తే నేనెందుకు చేరను? అంటూ లెక్కలేనన్ని ప్రశ్నలు.
అతడయితే, జీవిత చివరి క్షణాల్లో వున్నాడు. అతనికి ఎట్లాంటి అవకాశాలూ లేవు. నీకేమయ్యింది? నీవేమి సిలువలో వ్రేలాడడం లేదు కదా? రక్షించ బడడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి నీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. దేవునికి లోబడకుండా, నీకు నచ్చినట్లు జీవించి, ఆయన దయామయుడు కదా! జీవితం చివరిక్షణంలో క్షమించమని ఒక్కమాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వుండవద్దు. నీ జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్ధముగా దొర్లిపోయాయేమో?
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
2 కొరింది 6:2
కనీసం నేడైనా, పశ్చాత్తాపముతో ఆయన పాదాల చెంతచేర గలిగితే? నీ గత జీవితం ఎట్లాంటిదైనా, ఆయన ప్రశ్నించడు. ఆ నిత్య రాజ్యానికి వారసుని చేస్తాడు.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్
*యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మూడవ మాట*
✅ *ఆదరణ*
*"అమ్మా,యిదిగో నీ కుమారుడు ......యిదిగో నీ తల్లి" యోహాను 19:26*
ఒక తల్లి పదిమంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ పదిమంది పిల్లలు కలసి ఆఒక్క తల్లిని పెంచలేక అనాధనుచేసి విడచి పెట్టేసిన పిల్లలెందరో? అనాధ ఆశ్రమాలలో, వృద్ధ ఆశ్రమాలలో తలదాచుకొంటున్న తల్లులెందరో? అట్లాఅని, వారి ఆర్ధికస్థితి తల్లిని పోషించ గలిగేదిగా లేదా అంటే? కానేకాదు. అన్నీ సమృద్ధిగా కలిగినవారే. లేదంటే, వారు
తమ భాద్యతను, దేవుని ఆజ్ఞను మరచినవారు. వారి జాబితాలో మనమూ వున్నామా? అయితే ఒక్క మాట!
యేసుప్రభువు వారు కల్వరి గిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మూడు మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన భాద్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని 'యేసు ప్రభువు రొమ్మును ఆనుకొనియున్న శిష్యుడు'గా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంధం తలిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి తలిదండ్రుల కోసమే.
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమ 20:12
సన్మానించడం అంటే? శాలువాలు కప్పి, పూల బొకేలు ఇవ్వాలని కాదుగాని, వారి అవసానదశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం.
•తలిదండ్రులకు విధేయత చూపాలి. వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలొ మొదటిది.
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము,
అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెస్సి 6:1-3
నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను."
సామెతలు 23:25
అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి, వారిని దూషించినట్లయితే?
"తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును."
సామెతలు 20:20
కారు చీకట్లో నీ దీపం ఆరిపోతే? నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందుకోగలవు?
ఆలోచించు?
ఒక్కటి మాత్రము గుర్తుంచుకోవాలి! నేడు మన తలిదండ్రులను ఎట్లా చూస్తున్నామో? రేపు మన పిల్లల చేత అట్లానే చూడబడతాము. "నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును."ఒబెద్యా 1:15
మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7
కొబ్బరి చెట్టు నుండి, ఖర్జూరాలు ఆశించలేము. అట్లానే, మనము నేడు మన తలిదండ్రులను నిర్లక్ష్యము చేసి రాబోయే దినాలలో మనము సంతోషాన్ని పొందగలము అనుకోవడం మన జీవితాలకు శ్రేయష్కరము కాదు. ఒకవేళ ఇంత వరకూ వారిని నిర్లక్ష్యం చేసామేమో? యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తుచేస్తున్నారు. సరిచేసుకుందాం! వారి అవసరాలు గుర్తెరిగి మన బాధ్యతను నెరవేర్చుదాం! ఆయన మాటకు లోబడదాము. ఆమెన్
*యేసు ప్రభువు వారు సిలువలో పలికిన నాల్గవ మాట.*
✅ *"తండ్రితో ఎడబాటు"*
*నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి 27:46*
యేసుప్రభువు వారు భరిస్తున్న సిలువ భారము కంటే, ఆ ఘోర అవమానము కంటే, ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏమిటంటే? "తండ్రితో ఎడబాటు".
ఆయన మరి కొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించ బోతున్నాడు. తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తున్నాడు. అది ఒక గొప్ప 'ఆర్తనాధం'.అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు. అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. అయినా, దానిని కూడా ఆయన భరించ లేకపోతున్నాడు. తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసెయ్యడానికి ఇష్టపడ్డాడు. కావాలనే అట్లా చేస్తున్నాడు.
"అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను" యెషయా 53:10
ఒకవేళ అతనిని నలుగగొట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే? ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్పత్యాగం వుంది.
"మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను." 1 కొరింది 5:21
ఏదేను వనములో మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునఃరుద్దరించడానికి మన ప్రియ రక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నాడు.
ఎందుకంటే? ఆ సిలువ యాగమే తండ్రితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునఃరుద్దరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయత, రెండూ కలసి ఆదినాన్న తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి. ఇంతకీ, నెలకొల్పబడిన ఆ సహవాసం కొనసాగుతుందా? ఆగిపోయి ఎంత కాలమయ్యింది? ఎంత కాలమయ్యిందో కూడా గుర్తులేనంత కాలమయ్యిందా?
దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం! మంచిదే. మరి సహవాసం మాటేంటి..?సంబంధానికి, సహవాసానికి వున్న వ్యత్యాసమేమిటి?
ఆదాము ఏదేనులో నుండి గెంటి వేయబడినప్పటికీ అతడు దేవుని కుమారుని గానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల 'సంబంధం'.
కాని, గెంటి వేయబడడం ద్వారా అతడు దేవునితో 'సహవాసాన్ని' కోల్పోయాడు.
మనము కూడా ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడి దేవుని బిడ్డలుగా, దేవునితో 'సంబంధాన్ని' కలిగియున్నాము. కాని, తిరిగి పాపం చెయ్యడం ద్వారా ఆయనతో 'సహవాసం' కోల్పోతున్నాము.
సంబంధం మాత్రమే కలిగియుండి, సహవాసం లేకపోతే? ఆ నిత్య రాజ్యాన్ని చేరలేము. సహవాసము కోల్పోవడానికి గల ఏకైక కారణం? మన పాపమే. అట్లా అయితే?
పాపం లేని యేసు ప్రభువు వారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు?
మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా చెయ్యబడ్డాడు గనుక. అందుకే ఆయన ఆక్రందన. ఆ సిలువ ప్రేమను అర్ధం చేసుకుందాం! మన జీవితాలను సరి చేసుకుందాం! కోల్పోయిన సహవాసాన్ని ప్రారంభిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్
✅ *"దప్పిగొనుచున్నాను."*
యోహాను 19:28
యేసుప్రభువు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు.
*నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు;* యోహాను 4:14
"దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను."
యోహాను 7:37
ఆయనిచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడునూ దప్పిగొనమట. దాహం వేస్తే నాదగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండని చెప్పిన ప్రభువు వారే దప్పిక గొనడమేమిటి? ఆయన దప్పికను ఆయన తీర్చుకోలేనప్పుడు, ఇక, మన దప్పికను ఎట్లా తీర్చగలడు?
*యేసయ్య సిలువలో దప్పిగొనడానికి గల కారణాలు?
🔹• యేసు ప్రభువు వారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే, అనేకమైన ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. వాటిలో ఒక్కటైననూ తప్పిపోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన నేరవేర్పులో భాగముగా ఆయన దప్పిగొన్నారు.
"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి."
కీర్తనలు 69:21
🔹•అప్పటికే, యేసుప్రభువువారు
ఆ మండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోసారు. ఒకవైపు శరీరంనుండి రక్తం కారుతూనే వుంది. అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజము.
ఎందుకంటే?