26.8.24

37.page2-చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు బుద్దుడు


(చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు -బుద్డుడు)
సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజం తో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు . సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు .

అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పెకమేడలై పరస్పరం సంఘర్షించినశక్తులతో చరిత్ర పుట్టెను. శ్రీ శ్రీ 

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ) -శ్రీ శ్రీ 
చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు
1.బుద్డుడు - (563 - 483 BCE) గతి తార్కిక భౌతికవాదం 
2.సోక్రటీస్ - (469 - 399 BCE)
నిన్నునీవు తెలుసుకో
(method of arriving at truth )
3.స్పొర్టకస్ - (71 BC) తిరుగుబాటు
(the first revolutionist inthe history)
4.జీసస్ - మానవసంబంధాలు
 (human relations )
5.వేమన -(1650) భావవిప్లవం
6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం
(చారిత్రికగతి తార్కిక భౌతిక వాదం)
7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ (psychoanalysis)
8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924) పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం
(the last refuge of capitalisum is imperialisom )
9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) రాజ్యరహిత సమాజం ( ది లేగసీ ఆఫ్ స్టేటలెస్ నెస్ )
10.మావొ - కమ్యూనిజం - (1893 - 1976)
సాంస్కృతిక విప్లవం(cultural revolution)

చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులలో బుద్ధుడు ఒకరు

తాత్వికుల  భావాలు, భావజాలాలు  కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి. 

1.బుద్డుడు - (563 - 483 BCE) ప్రతిత్యసముత్పాద/పటిచ్చసముప్పద
కార్యకారణత్వం 
ఒక దాని కారణంగా మరొకటి జరగడం
(గతి తార్కిక భౌతికవాదం )

తనకాలపు పరిస్తుతుల మానసిక సంఘర్షణ లోనుంచి స్వీయ సాక్షాత్కారం,స్వీయ ప్రభోదాన్ని పొందిన బుద్ధుడు ప్రపంచానికి మార్గదర్శకుడై చరిత్ర గతిని నిర్దేశించాడు

2.సోక్రటీస్ - నిన్నునీవు తెలుసుకో
(469 - 399 BCE)
గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది... అది తాగి మీరు మరణిస్తారు. కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యం మీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది? అని శిష్యులు ప్రశ్నించారు. దీనికి సోక్రటీస్‌ నవ్వి జీవితమంటే నేర్చుకోవడం... మరణం గురించి ఆలోచించడం కాదు. నువ్వు, నేను అందరం ఏదో ఒక రోజు చనిపోతాం.... కానీ జీవితంలో ప్రతిక్షణం విలువైందే... తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంట కిందటి వరకు నాకు ఆ పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయం ఉంది... అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముందని అన్నాడు.
ఎరుక ( ప్రశ్నించే )తో జీవితం సాగాలని దానికోసం తన జీవితాన్నే ఫణంగా పెట్టి చరిత్ర గతిని నిర్దేశించిన తాత్వికుడు సోక్రటిస్

3.స్పొర్టకస్ - (71 BCE) తిరుగుబాటు 
అతను ఓడిపోయాడు చనిపొయాడు క్రీస్తు కి పూర్వమే పుట్టాడు గిట్టాడు . కాని అతని పేరు చెప్తే దోపిడీదారులందరికీ బెదురు. ఎందుకా ? వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు . కాని ఆజనాలు ఉగ్రనరసింహులు గా మారి విజృంభించగలరన్న సత్యాన్ని చరిత్రలో మొదటిసారిగా చెప్పినవాడు స్పోర్టకస్.(రాచకొండ విశ్వనాధశాస్త్రి)

4.జీసస్ - మానవసంబంధాలు 
మాటలకు, ప్రభోదాలకు,నీతి సూక్తులకు చరిత్ర గతినే మార్చేంత బలం ఉంటుందా? తప్పక ఉంటుంది. అన్నది యేసుప్రభువు జీవితాన్నిబట్టి తెలుస్తుంది. ఒకరోజున శిష్యులంతా తగవులాడుకొంటున్నారు.తమలోఎవరు గొప్ప? అన్నది తేల్చుకోవాలన్న వాళ్ళ ప్రయాస .వాళ్ళని ప్రభువు తనవద్దకు పిలిచి మీలోగొప్పవాడుగా,నాయకుడుగా ఉండగోరువారు ముందు మంచి పరిచారకుడుగా ఉండాలి.నేనుకూడా ఈ లోకానికి పరిచారంచెయుంచుకోడానికి రాలేదు,పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభోదిచాడు.

5.వేమన - (1650 రాయలసీమ ) (సామ్య వాద )భావవిప్లవం 
తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం. వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందు చూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.
తన కాలాన్ని మించి కొన్ని విషయాల్లో ముందుకు చూడగలిగిన కవిగా వేమన్నను మనం గౌరవించాలి. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. శైవ వైష్ణవ మతాలవారి ఆర్భాటాలను, వారి దురాచారాలను, మోసాలను బట్టబయలు చేశాడు. చిలుక పలుకుల చదువులను విమర్శించాడు. కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు. శ్రమశక్తిలోనే సర్వమూ ఉన్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు, తనకాలపు చట్రంలో ఇమడని గొప్ప కవి.
వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు.

ప్రజలభాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం.

చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం.

ఊహలోనుంచికాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం.

కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని దృఢంగా భావిస్తున్నాం. చేకూరి రామారావు 

6.కారల్ మార్క్స్ - (1818 - 1883) కమ్యూనిజం
చారిత్రిక గతి తార్కిక భౌతిక వాదం
"తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించారు. కావలసింది దాన్ని మార్చడం ". సోషలిస్టు విప్లవం తీసుకురాగలిగింది కార్మికవర్గం మాత్రమే.నడచిన చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్రే.మానవాళిని దోపిడీనుండి విముక్తి చేసే కర్తవ్యానికి శ్రామికవర్గాన్ని సమాయత్తం చేయాలి ! పీడనను , ఆకలిమంటలను , యుధ్దాన్ని నిర్మూలించాలి .శతాబ్దాల క్రమంలో "పెట్టుబడి" ఎలాపోగుపడిందీ,పెంపొందిందీ కారల్ మార్క్స్వవర్ణించాడు. "నఖశిఖ పర్యంతం,దాని ప్రతి అణువు రుధిరంతో తడిసి " పుట్టిందన్నాడు .( దాస్ క్యాపిటల్ ) వ్యక్తిగత ఆస్తి ప్రసక్తిలేని సమాజంలో మాత్రమే దారిద్ర నిర్మూలన సాధ్యమని ఎంగెల్స్ సూత్రీకరించాడు.ఈనాటి పెట్టుబడిదారులు సమకూర్చుకున్న సంపదలు - బానిసలు యజమానులు లేదా ఫ్యూడల్ ప్రభువులు అర్ధబానిసల శ్రమను దోచుకొని గడించినదానికన్నా భిన్నమేంకాదు . ఈ రకరకాల దోపిడీల మధ్య వ్యత్యాసం
ప్రతిఫలమివ్వకుండా శ్రమను కొల్లగొట్టే విధానంలో తేడా మాత్రమే .ఈనాటి బూర్జువా సమాజం లోగడ వున్న వాటికన్నా మెరుగైందేమీకాదు .అపార జనసందోహాన్ని అత్యల్పసంఖ్యాకులు దోచుకునేందుకు అవకాశమిస్తున్న మహా భీకర వ్యవస్థ ఇది .

7.ఫ్రౌయిడ్ - (1856 - 1939) మనోవిశ్లేషణ 
(Sex ఇరుసుగా సాగేదే జీవన వాహనం )
(ఈ లోకమనగా నేమి? స్త్రీ పురుషులు కలసికొని సంతానమును కనుట. అందుచేత లోకము సాగుచున్నది. యిది ప్రధానమైన విషయము -విశ్వనాధ సత్యనారాయణ -శృంగారనైషధము పీ ఠి క )
స్వేచ్ఛ లో బాధ్యత ఉంటుంది
ఫ్రాయిడ్ ను చదవడమంటే మనల్ని మనం
చదవడమే,ఫ్రాయిడ్ ను తెలుసుకోవడమంటే
మన గురించి మనం తెలుసు కోవడమే.
మన అంతరంగ సంఘర్షణ..ఫ్రాయిడ్,
ద్వందభావాల పెనుగులాట..ఫ్రాయిడ్
అస్పష్టాస్పష్ట కలల డికోడ్..ఫ్రాయిడ్,
అర్ధం కాని మన మనస్సు..ఫ్రాయిడ్ 
పురాణాల్లోంచి గాలించి సిగ్మండ్ అనే చక్రవర్తి
పేరు పెట్టుకుందట వాళ్ళమ్మ.భౌతికార్ధంలో
అతడు చక్రవర్తి కాక పోయినా మనస్సు అనే
మరో ప్రపంచాన్ని పాలించాడు.అన్వేషించాడు
దాని లోతులు కనుక్కుని శిఖరం ఎత్తుకు
ఎదిగాడు.
ఆస్ట్రియాకు చెందిన ఈసైక్రియాటిస్ట్ సైకో ఎనాలసిస్ అనే కొత్తదారి పరచి
స్టడీస్ ఆఫ్ హిస్టిరియా
ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ 
ది ఇగో అండ్ ది ఇడ్  
త్రి ఎస్సేస్ ఆన్ది థియరీ ఆఫ్ సెక్సువాలిటి బియాండ్ ద ప్లెజర్ 
ప్రిన్సిపుల్ లాంటి పుస్తకాలను వెలువరించాడు
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన
వ్యక్తుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు

Sigmund Freud, (born May 6, 1856, Freiberg, Moravia, Austrian Empire—died Sept. 23, 1939, London, Eng.),

Austrian neuropsychologist, founder of psychoanalysis, and one of the major intellectual figures of the 20th century. Trained in Vienna as a neurologist, Freud went to Paris in 1885 to study with Jean-Martin Charcot, whose work on hysteria led Freud to conclude that mental disorders might be caused purely by psychological rather than organic factors. Returning to Vienna (1886), Freud collaborated with the physician Josef Breuer (1842–1925) in further studies on hysteria, resulting in the development of some key psychoanalytic concepts and techniques, including free association, the unconscious, resistance (later defense mechanisms), and neurosis. In 1899 he published The Interpretation of Dreams, in which he analyzed the complex symbolic processes underlying dream formation: he proposed that dreams are the disguised expression of unconscious wishes. In his controversial Three Essays on the Theory of Sexuality (1905), he delineated the complicated stages of psychosexual development (oral, anal, and phallic) and the formation of the Oedipus complex. During World War I, he wrote papers that clarified his understanding of the relations between the unconscious and conscious portions of the mind and the workings of the id, ego, and superego. Freud eventually applied his psychoanalytic insights to such diverse phenomena as jokes and slips of the tongue, ethnographic data, religion and mythology, and modern civilization. Works of note include Totem and Taboo (1913), Beyond the Pleasure Principle (1920), The Future of an Illusion (1927), and Civilization and Its Discontents (1930). Freud fled to England when the Nazis annexed Austria in 1938; he died shortly thereafter. Despite the relentless and often compelling challenges mounted against virtually all of his ideas, both in his lifetime and after, Freud has remained one of the most influential figures in contemporary thought.

8.లెనిన్ - కమ్యూనిజం (1872 - 1924)  పెట్టుబడిదారి విధానం యొక్క అంత్యదశ సామ్రాజ్యవాదం

9.స్టాలిన్ - కమ్యూనిజం (1879 - 1953) రాజ్యరహిత సమాజం
(Stalin's Legacy of Statelessness)

10.మావొ - (1893 - 1976) కమ్యూనిజం
సాంస్కృతిక విప్లవం 

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులలో బుద్ధుడు ఒకరు

తన ముందు తరం యొక్క భావాలు భావజాలాల నుండి నూతన భావజాలాన్ని ప్రపంచానికి అందించి తరువాత తరాల తాత్వికులకు,తత్త్వవేత్తలకు మార్గం సుగమం చేయడమే కాకుండా తన ముందు, తర్వాత తరాల వారికీ వారధి గా నిలిచాడు.

1.బుద్ధుడు క్షత్రియ వంశంలో జన్మించాడు.
వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. అనేక ఏళ్లపాటు కఠోర తపస్సు చేసాడు.
చివరకు భోది వృక్షమూలంలో కుర్చుని
జ్ఞానం సంపాదించాడు.ఆయన సాధించిన
జ్ఞాన సంపదే బౌద్ద దర్శనంగా రూపొందింది.
ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు తన 29వ ఏటనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయస్సులో జ్ఞానోదయాన్ని పొందాడు.ఆ తరువాత పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయస్సులో నిర్యాణము పొందాడు.

2.చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీ.పూ. 563లో జన్మించాడు.ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. 
గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 22 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు.ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. 
బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు.
కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు.
తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు.
అలా ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడు . ఆ ప్రాంతానికే 'బుద్ధ గయ' అనే పేరు వచ్చింది.
తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు.

3.బుద్ధునడు  కపిలవస్తు రాజ కుటుంబానికి చెందినవాడు. తండ్రి శుద్ధోధనుడు, పాలకుడు. గౌతమ్ తల్లి మాయా దేవి అతనికి జన్మనిచ్చిన వెంటనే మరణించింది.
అతను విశాలమైన మనస్సుతో ఆలోచించే పిల్లవాడు. అతను చాలా క్రమశిక్షణ గలవాడు మరియు సమకాలీన భావనలను అర్థం చేసుకోవడానికి మరియు మరింత జ్ఞానాన్ని సేకరించడానికి ప్రశ్నించడానికి ఇష్టపడేవాడు. 
అతను తన జీవితాన్ని ఆధ్యాత్మికత మరియు ధ్యానం కోసం అంకితం చేయాలనుకున్నాడు. ఇది అతని తండ్రికి నచ్చలేదు. అతను ఆధ్యాత్మికతను కనుగొనడానికి తన తండ్రి కోరికలకు విరుద్ధంగా వెళ్ళాడు. ఏదో ఒక రోజు, గౌతమ్ తన కోరికల కోసం తన కుటుంబాన్ని విడిచిపెడతాడని అతని తండ్రి ఆందోళన చెందాడు. దీని కోసం, శుద్ధోధనుడు తన కొడుకును చుట్టుముట్టిన కఠినత్వం నుండి ఎల్లప్పుడూ కాపాడుకున్నాడు. అతను తన కొడుకును రాజభవనాన్ని వదిలి వెళ్ళనివ్వలేదు . అతను 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, గౌతమ్ అందమైన  యువరాణి యశోధరను వివాహం చేసుకున్నాడు. వారికి 'రాహుల్' అనే కొడుకు ఉన్నాడు. సిద్ధార్థ కుటుంబం పూర్తి మరియు సంతోషంగా ఉన్నప్పటికీ, అతనికి శాంతి లేదు. గోడలకు అవతల ఉన్న సత్యాన్ని వెతకాలని అతని మనస్సు ఎల్లప్పుడూ అతనిని కోరేది.

4.బౌద్ధ వ్రాతప్రతుల ప్రకారం, సిద్ధార్థ ఒక వృద్ధుడిని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మరియు శవాన్ని చూసినప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అతను అర్థం చేసుకున్నాడు. అతను అనుభవించిన ఆనందాలన్నీ తాత్కాలికమైనవి మరియు ఏదో ఒక రోజు, అతను వాటిని విడిచిపెట్టవలసి వస్తుంది అనే గ్రహింపు నుండి అతని మనస్సు ఆశ్చర్యపోయింది. అతను తన కుటుంబాన్ని, సింహాసనాన్ని మరియు రాజ్యాన్ని వదిలి అడవుల్లో మరియు ప్రదేశాలలో లక్ష్యం లేకుండా తిరగడం ప్రారంభించాడు. అతను కోరుకున్నది నిజమైన సత్యాన్ని మరియు జీవిత ఉద్దేశాన్ని కనుగొనడమే. తన ప్రయాణంలో, అతను పండితులను మరియు సాధువులను కలుసుకున్నాడు, కాని ఎవరూ అతని సత్య దాహాన్ని తీర్చలేకపోయారు. 
అతను బాధను అనుభవించాలనే లక్ష్యంతో ధ్యానం ప్రారంభించాడు మరియు 6 సంవత్సరాల తర్వాత ఒకపెద్దబోధి (రావి)వృక్షం క్రింద కూర్చొని అంతిమ సత్యాన్ని గ్రహించాడు. అది బీహార్‌లోని బోద్‌గయాలో జరిగింది. అతను 35 ఏళ్లు నిండినప్పుడు జ్ఞానోదయం పొందాడు. అతని జ్ఞానానికి హద్దులు లేవు. ఆ చెట్టుకు బోధి వృక్ష అని పేరు పెట్టారు. అతను కొత్తగా కనుగొన్న జ్ఞానంతో చాలా సంతృప్తి చెందాడు మరియు సారనాథ్‌లో జ్ఞానోదయం గురించి తన మొదటి ప్రసంగం చేశాడు. ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు మరియు కష్టాల వెనుక ఉన్న అంతిమ సత్యాన్ని అతను కనుగొన్నాడు.  
బుద్దుడు దుఃఖాన్ని అసలు కారణాన్ని కనుగొన్నాడు.దుఃఖం నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే అవిద్యను లేక అజ్ఞానాన్నితొలగించాలన్నాడు.
అవిద్యను నిర్ములించడానికి అష్టాంగ మార్గమే సరైనదని బుద్దుడు భోదించాడు.
అష్టాంగం మార్గం అంటే ఎనిమిది అంశాలతో కూడుకుని ఉండేవి అవి
1. సమ్యక్ దృష్టి, 2. సమ్యక్ సంకల్పం, 3. సమ్యక్ వాక్కు, 4. సమ్యక్ కర్మ, 5. సమ్యక్ జీవనం, 6. సమ్యక్ ప్రయత్నం, 7. సమ్యక్ స్మృతి, 8.సమ్యక్ సమాధి(ధ్యానం)

త్రిరత్నాలు 

I.రతన-త్తయ (త్రి-రత్న)

బుద్దం శరణం గచ్చామి  
ధర్మం శరణం గచ్చామి  
సంఘం శరణం గచ్చామి

అనే దాంట్లో మూడు విషయాలున్నాయి. 
1.బుద్ధం 2. ధర్మం. 3 సంఘం. 
బుద్ధం శరణం అంటే బుద్ధుణ్ణి శరణుకోరమని కాదు. తనని శరణు కోరమని,తనని గురువుగానో, దేవుడిగానో భావించమని బుద్ధుడు ఎప్పుడూ చెప్పలేదు. బుద్ధం అంటే జ్ఞానం-అని అర్థం! జ్ఞానోదయమైంది గనుకనే సిద్ధార్ఠుడు బుద్ధుడయ్యాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవల్సిందేమంటే జ్ఞానాన్ని శరణు కోరి ముందుకు సాగండి అని. అలాగే, ధర్మం అంటే ప్రకృతి ధర్మం అని అర్థం 

ప్రకృతి ధర్మానుసారంగా నడుచుకోండని – అంతేగాని మనిషి మధ్యలోకల్పించుకున్న ఏవో ధర్మాలకు కట్టుబడి ఉండమని కాదు. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుని, ప్రకృతిలో గల కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకుని ముందుకు సాగండి అని! ‘ధర్మోరక్షతి రక్షిత:’ – అంటే ప్రకృతి ధర్మాన్ని రక్షించుకుంటే – ఆ ప్రకృతి ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని. తర్వాత సంఘం నీ చుట్టూ ఉన్న సంఘాన్నీ, దాని కట్టుబాట్లనూ గుర్తిస్తూ అందులో ఒదుగుతూ, ఇమిడిపోతూ మాత్రమే ముందుకు సాగమని అర్థం.

II.ఆర్యసత్యాలు 

గౌతమ బుద్ధుడు మధ్యేమార్గాన నాలుగు ఆర్యసత్యములను తెలియపరచెను. అవి

  1. దుఃఖం అంతటా వుంది
  2. ఈ దుఃఖం ‘తృష్ణ’ (కోరిక )వలన ఏర్పుడుతుంది
  3. తృష్ణ ‘అవిద్య’ (అజ్ఞానం )వలన వస్తుంది
  4. అష్టాంగ మార్గమే అవిద్యానాశకారి.

వీటినే నాలుగు ఆర్య సత్యాలు లేదా నాలుగు పరమ సత్యాలు అంటారు . వాటి పరిపూర్ణ స్వరూప స్వభావ పరిజ్ఞానం ఆయన సముపార్జించాడు. అప్పటినుంచి ఆయన గౌతమ బుద్ధుడైనాడు.

అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం దానివల్ల శాశ్వతమైన దుఃఖ – రాహిత్యం కలుగుతుంది

  • “తృష్ణ” అంటే శృతికి మించిన రాగం.
  • “తృష్ణ” అంటే లయకు మించిన తాళం
  • “తృష్ణ” అంటే మితికి మించిన మోతాదు.
  • “తృష్ణ” అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం.
  • “తృష్ణా-రాహిత్యం” వల్లనే దుఃఖ-రాహిత్యం కలుగుతుంది.

దుఃఖ-రాహిత్యమే నిర్వాణం

నిర్వాణం” అన్నా, “ముక్తి” అన్నా, “మోక్షం” అన్నా, “నిఃశ్రేయస్సు” అన్నా, “అపవర్గం” అన్నా అన్నీ ఒక్కటే, అవన్నీ పర్యాయపదాలే.

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక అవి బుద్ధుని మొదటి బోధనలు.  "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యే మార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం) గా చెప్పాడు.

III.పంచ-శీల 

పానాతిపత వేరమణి శిఖాపదం సమాదియామి.


ఆదిన్నాదానా వేరమణి శిఖాపదం సమాదియామి.


కామేసు మిచ్ఛాచార వేరమణి శిఖాపదం సమాదియామి.


ముసావదా వేరమణి సిక్ఖపదం సమాదియామి.


సుర మేరయ మజ్జ పమదత్థానా వెరమి సిక్ఖపదం సమాదియామి

ఇమాని పంచ శిఖాపదాని సమాదియామి 

ఐదు సూత్రాలు

1.ప్రాణులను నాశనం చేయకుండా ఉండాలనే నియమాన్ని నేను పాటిస్తాను.
2.నేను ఇవ్వని వస్తువులను తీసుకోకుండా ఉండాలనే ఆదేశాన్ని పాటిస్తాను.
3.నేను లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండాలనే ఆదేశాన్ని పాటిస్తాను.
4.తప్పుడు మాటలకు దూరంగా ఉండాలనే ఆదేశాన్ని నేను పాటించాను.
5.మత్తు మరియు అజాగ్రత్త కలిగించే మద్యపానానికి దూరంగా ఉండాలనే ఆదేశాన్ని నేను పాటిస్తాను.
నేను నా సామర్థ్యం మేరకు ఐదు సూత్రాలను పాటిస్తాను.

జీవులను చంపడం ,(1.జీవహింస చేయరాదు )దొంగిలించడం,(2.దొంగిలించరాదు )లైంగిక దుష్ప్రవర్తన,(3.వ్యభిచరించరాదు )అబద్ధం (4.అబద్దమాడరాదు) మరియు మత్తుకు(5.మత్తు పానీయాలు సేవించరాదు )దూరంగా ఉండాలనే కట్టుబాట్లను సూత్రాలు అంటారు

ఐదు సూత్రాలు

 ( సంస్కృతం : పంచశిల ; పాళీ : పంచసిల ) లేదా దు శిక్షణానియమాలు

( సంస్కృతం:పంచశిక్షపద ;పాళీ :పంచసిక్ఖపద )

బౌద్ధ సామాన్యులకు అత్యంత ముఖ్యమైన నైతిక వ్యవస్థ .

అవి బౌద్ధమతం యొక్క సాధారణ అనుచరులు గౌరవించవలసిన ప్రాథమిక నీతి నియమావళి.

జీవులను చంపడం , దొంగిలించడం, లైంగిక దుష్ప్రవర్తన, అబద్ధం మరియు మత్తుకు దూరంగా ఉండాలనే కట్టుబాట్లను సూత్రాలు అంటారు .

బౌద్ధ సిద్ధాంతంలో, అవి జ్ఞానోదయం మార్గంలో పురోగతి సాధించడానికి మనస్సు పాత్రను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడ్డాయి . వాటినికొన్నిసార్లు మహాయాన సంప్రదాయంలో శ్రావకాయనసూత్రాలుగా సూచిస్తారు .

ఐదు సూత్రాలు బౌద్ధ సిద్ధాంతంలోని అనేక భాగాలకు ఆధారం.

బౌద్ధ నీతి శాస్త్రంలో వారి ప్రాథమిక పాత్రకు సంబంధించి,వారు అబ్రహమిక్మతాలలోని పది

ఆజ్ఞలతో లేదా కన్ఫ్యూషియనిజం యొక్క నైతిక నియమాలతో పోల్చబడ్డాయి

IV.అష్టాంగ మార్గం

నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం.

ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది.

I. శీలము (భౌతికమైన చర్యలు),

II. సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము),

III.ప్రజ్ఞ(అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)

I.శీలము - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:

  1. "సమ్యక్ వచనము"            సరియైన వాక్కు                      (సమ్మ-వాచ)                    నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
  2. "సమ్యక్ కర్మము"                సరియైన చర్య                           (సమ్మ-కమ్మంత)                          హానికలిగించే పనులు చేయకుండుట
  3. "సమ్యక్ జీవనము"               సరియైన జీవనోపాధి             (సమ్మ-అజీవ)                           తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం

II.సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.

  1. "సమ్యక్ సాధన"-                సరియైన ప్రయత్నం                      (సమ్మ- వాయమ)           ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
  2. "సమ్యక్ స్మృతి"                 సరియైన బుద్ధి                          (సమ్మా-సతి)                      స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం  (ఎరుక కలిగి వుండాలి )
  3. "సమ్యక్ సమాధి" -                        సరి యైన ఏకాగ్రత                  (సమ్మ-సమాధి)                          రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం(ఉపేక్ష స్మృతి పరిశుద్ధత )

III.ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.

  1. "సమ్యక్ దృష్టి"                         సరైన దృక్పథం                      (సమ్మ-దృష్టి )                  అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం( సరి యైనా అవగాహన )
  2. "సమ్యక్ సంకల్పము"          సరియైన ఆలోచన                  (సమ్మ-సంకప్ప)                                ఆలోచించే విధానంలో మార్పు
1.సరియైన దృక్పథం (సమ్మ-దృష్టి )
2.సరియైన ఆలోచన (సమ్మ-సంకప్ప)
3.సరియైన వాక్కు (సమ్మ-వాచ)
4.సరియైన చర్య (సమ్మ-కమ్మంత)
5.సరియైన జీవనోపాధి (సమ్మ-అజీవ)
6.సరియైన ప్రయత్నం (సమ్మ- వాయమ)
7.సరియైన బుద్ధి (సమ్మా-సతి)
8.సరియైన ఏకాగ్రత(సమ్మ-సమాధి)

ముఖ్యమైన బౌద్ధమతం పది పరిపూర్ణతలు. 
సంతోషకరమైన మరియు దయగల జీవితాన్ని నిర్వహించడానికి  ముఖ్యమైనవి.

V.పది పరిపూర్ణతలు

పది పరిపూర్ణతలు (పారామిస్)

1. దాతృత్వం (దానా).దాన 
2. నైతికత (సిలా) శీల
3. త్యజించడం (నెక్కమ్మ) నిష్కామ 
4. జ్ఞానం (పన్నా) ప్రజ్ఞ 
5. శక్తి (విరియా)వీర్య 
6. సహనం (ఖాంతి)క్షమా 
7. సత్యసంధత (సక్కా)
8. రిజల్యూషన్ (అధిత్థాన).అధిష్టాన 
9. ప్రేమపూర్వక దయ (మెట్టా)మైత్రి 
10. సమా (ఉపేక్ష )

దశపారమితలు : దశపారమితలు అంటే పరిపూర్ణతలు. వాటిని ఆచరించడమే ఉత్తమ ధార్మిక మార్గం.

1. శీలం : శీలం అనేది నైతిక ప్రవృత్తి. చెడు చేయకూడదు, మంచి చేయాలనే గుణం. తప్పు చేయడానికి సిగ్గుపడే, భయపడే లక్షణం.

శిక్షపడుతుందన్న భయంతో తప్పు చెయ్యకుండా ఉండడం కాదు, శిక్షలేకపోయినా తప్పు చెయ్యడానికి, చెడు చేయడానికి భయపడడమే శీలం. మేలు చేయాలనే నైతిక స్వభావమే శీలం.

2. నిష్కామం : ప్రాపంచిక సుఖాలను వదులుకోవడం. తృష్ణ లేకపోవడం.

3. దానం : ప్రతిఫలం ఆశించకుండా తన ఆస్తినిగాని, వస్తువులనుగాని, రక్తాన్ని, అవయవాలను, అవసరం అయితే ప్రాణాన్నిసైతం ఇచ్చివేయడం దానం.

4. ఉపేక్ష : మనసును రాగద్వేషాలకు అతీతంగా ఉంచుకోవడాన్నే ఉపేక్ష అంటారు. అలాగే కష్ట సుఖాలకు చలించకుండా ఉండడం. రోజువారి జీవితంలో ఎదురయ్యే ఫలితాలకు దుఃఖపడకుండా, సంతోషపడకుండా నిర్లిప్తంగా ఉండగలగడం. నిజానికి ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండడం కాదు. సమచిత్తంతో ఉంటూ లక్ష్యసాధనను కొనసాగించడం.

5. వీర్యం : వీర్యమంటే మంచి ప్రయత్నం, గట్టి ప్రయత్నం. శాయశక్తులా కృషి చేసి కర్తవ్యాన్ని నెరవేర్చడం. ధర్మమైన పద్ధతిలో సర్వశక్తులూ ధారపోసి ఒక కార్యాన్ని సాధించడం.

6. క్షాంతి : క్షాంతి అంటే క్షమ, ఓర్పు, సహనం. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోవడం కాకుండా క్షమతో ద్వేషాన్ని ఉపశమింపజేయడం. శాంతం కలిగి ఉండడం.

7. సత్యం : సత్యమంటే నిజం. ఎవరూ ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడూ నిజమే చెప్పాలి.

8. అధిష్టానం : అధిష్టానం అంటే లక్ష్యం చేరుకోవాలనే స్థిరసంకల్పం.

9. కరుణ : కరుణ అంటే సాటి మానవుల పట్ల చూపించే ప్రేమపూరితమైన దయ.

10. మైత్రి : మైత్రి అంటే స్నేహం. ప్రేమకన్నా మించినది. స్నేహితులకే కాకుండా శత్రువులకు గూడా స్నేహం అందించడం. సాటి మనుషులతోనే కాకుండా సకల జీవ రాశుల పట్ల ప్రేమతో, స్నేహంతో ఉండడం.

ఈ పది ఉత్తమ గుణాలను ప్రతి వ్యక్తి ఆచరించాలి. వీటిని ఆచరించడం బౌద్ధ ధర్మాన్ని పాటించడంలో ముఖ్యమైన భాగం.


CONCEPT ( development of human relations and human resources ) ch. రామమోహన్ BA.,

No comments: