మత్తయి సువార్త 5:11–20 | సారాంశం

మత్తయి సువార్త 5:11–20

వచనాల సారాంశం

11–12: యేసు నిమిత్తము ప్రజలు నిందించి, హింసించి, అబద్ధముగా అపవాదులు మోపినప్పుడు ఆనందించండి. పరలోకంలో మీ ప్రతిఫలం గొప్పది.

13: మీరు భూమికి ఉప్పు. ఉప్పు తన రుచిని కోల్పోతే అది పనికిరాదు.

14–16: మీరు లోకానికి వెలుగు. దీపాన్ని దాచకుండా వెలుగునిచ్చే స్థలంలో ఉంచినట్లు, మీ మంచి క్రియలు ప్రజలకు కనిపించి దేవుని మహిమపరచాలి.

17: ధర్మశాస్త్రమును గాని, ప్రవక్తల బోధలను గాని రద్దు చేయడానికి నేను రాలేదు; వాటిని నెరవేర్చడానికి వచ్చాను.

18: ఆకాశము, భూమి గతించిపోయినా ధర్మశాస్త్రంలోని ఒక్క అక్షరం కూడా నెరవేరకుండ ఉండదు.

19: దేవుని ఆజ్ఞలను పాటించి ఇతరులకు బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని పిలువబడును.

20: శాస్త్రులు, పరిసయ్యుల నీతికంటే మీ నీతి అధికంగా ఉండాలి; అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు.

ప్రధాన సందేశం

యేసుక్రీస్తు తన అనుచరులు లోకంలో ఉప్పులా ప్రభావం చూపాలని, వెలుగులా ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని బోధించాడు. దేవుని ధర్మాన్ని కేవలం ఆచారాల రూపంలో కాకుండా, హృదయపూర్వక నీతితో జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం అని ఈ భాగం తెలియజేస్తుంది.

© CONCEPT BIBLE STUDY | మత్తయి సువార్త అధ్యయనం
CONCEPT ( development of human relations and human resources )